Home » Assembly elections
కరూర్లో టీవీకే అధినేత విజయ్ ప్రచారం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సరైన భద్రత కల్పించలేదని, విద్యుత్ సరఫరాను నిలిపేశారని, ఉద్దేశపూర్వకంగా ప్రచారమార్గంలో అంబులెన్సులను నడిపారంటూ వస్తున్న విమర్శలకు ప్రభుత్వ ఉన్నతాధికారులు సమాధానం చెప్పారు.
ఇటీవల ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధినేత విజయ్ కరూర్ పర్యటన సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతి చెందగా, పలువురు గాయపడిన వ్యవహారం రాష్ట్రంలో ఇంకా నిప్పు రాజేస్తూనే వుంది. ఈ దుర్ఘటన ద్వారా లబ్ధి పొందేందుకు అన్ని పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహాలు పన్నుతుండడంతో మరిన్ని కొత్త వివాదాలకు కారణమవుతోంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి తుది ఓటర్ల జాబితాను మంగళవారం ప్రకటించారు. మొత్తం ఓటర్లు 3,98,982 మంది ఉన్నారని పేర్కొన్నారు. సెప్టెంబరు 17 రాత్రి వరకు కొత్తగా ఓటు నమోదుకు 6,563 దరఖాస్తులు, తొలగింపు కోసం 361, సవరణ కోసం 2,298 దరఖాస్తులు వచ్చాయి.
ముసాయిదా జాబితాకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని తుది జాబితాను ఈనెల 30న ఈసీ ప్రకటించింది. ఇందులో అదనంగా 3.66 లక్షల అనర్హులైన ఓటర్లను తొలగించగా, 21.53 లక్షల అర్హులైన ఓటర్లను జాబితాలోకి చేరింది.
బిహార్లో 22 ఏళ్ల తర్వాత స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ను ఈసీ చేపట్టడం విశేషం. ఓటర్ల తుది జాబితా ఆధారంగానే అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించనుంది. తుది జాబితా కాపీలను అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు పంపిస్తామని బీహార్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) తెలిపారు.
కరూర్ దుర్ఘటనలో అన్నివైపులా తప్పులు జరిగాయని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్రమాజీ ఆర్థికమంత్రి పి.చిదంబరం అభిప్రాయపడ్డారు.శనివారం సాయం త్రం కరూర్లో తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ పర్యటనలో ఊహించని విధంగా జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతిచెందగా, మరో 50 మందికి పైగా గాయపడ్డారు.
బిహార్లో 22 ఏళ్ల తర్వాత ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)ను ఎలక్షన్ కమిషన్ నిర్వహించింది. గత ఆగస్టు 1న ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటించింది. సెప్టెంబర్ 1వ తేదీలోగా వ్యక్తులు, రాజకీయ పార్టీలకు తమ క్లెయిమ్స్, అభ్యంతరాలు తెలియజేసుకునే అవకాశం కల్పించింది.
అక్టోబర్ 4,5 తేదీల్లో రెండ్రోజుల పాటు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి పాట్నాలో పర్యటిస్తారు
అన్ని పార్టీలతోనూ డీఎండీకే స్నేహపూర్వకంగానే మెలగుతోందని, అయినప్పటికీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పొత్తుపై చర్చించేందుకు ఇప్పటి వరకు ఏ కూటమి నుంచి కూడా తమకు ఆహ్వానం అందలేదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమలత అన్నారు.
వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే విజయాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) ధీమా వ్యక్తం చేశారు. మాజీ సీఎం, ప్రతిపక్షనేత ఈపీఎస్ ‘మక్కలై కాప్పోం-తమిళగతై మీడ్పోం’ అనే నినాదంతో చేపట్టిన ప్రచారయాత్ర శుక్రవారం కరూర్ జిల్లాలోని అరవకురిచ్చి అసెంబ్లీ నియోజకవర్గం మీదుగా సాగింది.