Home » AP Politics
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పిఠాపురంలో ఏ చిన్న ఘటన జరిగినా.. వైసీపీ నేతలు వైరల్ చేస్తున్నారని విమర్శలు చేశారు.
రాయలసీమ ఎత్తిపోతలపై కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కరువు కోరల్లో చిక్కుకున్న ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలనుకున్నామని అన్నారు.
'సాక్షి' దినపత్రిక మీద నారా లోకేష్ దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో 'సాక్షి' తరపు న్యాయవాదులు లోకేష్ను క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. విశాఖపట్నం 12వ అదనపు జిల్లా న్యాయస్థానంలో విచారణ జరిగింది.
పారిశ్రామికంగా పాయకరావుపేట నియోజకవర్గం అభివృద్ధి చెందుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. స్టీల్ ప్లాంట్, బల్క్ డ్రగ్, బొమ్మల పరిశ్రమ లాంటి ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయని వివరించారు.
కృష్ణాజిల్లాలోని మచిలీపట్నంలో తాగుబోతుల ఆగడాలకు పోలీసులు గట్టి హెచ్చరిక ఇచ్చారు. మద్యం మత్తులో వీరంగం సృష్టించి ప్రజలకు ఇబ్బంది కలిగించిన యువకులపై పోలీసులు కఠినంగా వ్యవహరించారు.
తెలంగాణ ప్రయోజనాల కోసం కూటమి ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ పనులు నిలిపివేసిందన్న తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలు సరికాదని ఏపీ మంత్రి సవిత పేర్కొన్నారు. చంద్రబాబును ఓ కారణంగా చూపి తెలంగాణ రాజకీయాలు నడుపుతూ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు చేశారు.
వైసీపీ హయాంలో నెల్లూరు జిల్లాలో ఎలాంటి పనులు చేయకుండానే రూ.కోట్లు తినేశారని తెలుగుదేశం పార్టీ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపణలు చేశారు. జగన్ హయాంలో చేసిన పనులను కాకాణి వెంటనే నిరూపించాలని బహిరంగంగా తాను సవాల్ విసిరితే తన మీద ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ఆంధ్రప్రదేశ్ జిల్లా కాంగ్రెస్ కమిటీల అధ్యక్షులను పార్టీ అధిష్టానం నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం నాడు ఒక లిస్ట్ రిలీజ్ చేశారు. జిల్లాలు, ముఖ్య పట్టణాలకు కలిపి 41 మంది అధ్యక్షుల పేర్లను ఏఐసీసీ ప్రకటించింది.
శ్రీకాకుళం అభివృద్ధికి అడ్డా కావాలని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సూచించారు. శ్రీకాకుళం జిల్లాపై సీఎం చంద్రబాబు ప్రత్యేక ఫోకస్ పెట్టారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా శ్రీకాకుళం అభివృద్ధికి సహాయం చేస్తోందని వెల్లడించారు. డ్రోన్స్ సాయంతో డ్రగ్స్ పంటలను గుర్తించామని తెలిపారు.
నంద్యాల రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి ముఖ్య అనుచరుడు, వైసీపీ పార్లమెంట్ సోషల్ మీడియా ఇన్చార్జిగా పనిచేసిన పీవీ ప్రదీప్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు.