Home » AP Police
విద్యార్థుల ఆచూకీ కోసం 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. ఎట్టకేలకు విద్యార్థులు సురక్షితంగా ఉండడంతో పోలీసులు, తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
సంత్రగచ్చి - చర్లపల్లి రైల్వే స్టేషన్ల మధ్య కదులుతున్న రైల్లో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి అర్బన్ మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మహిళ(35)పై నిందితుడు జొన్నలగడ్డ రాజారావు అత్యాచారంచేశాడు. వివరాళ్లోకి వెళ్తే.. సోమవారం రాత్రి రాజమండ్రి స్టేషన్లో సంత్రగచి స్పెషల్ రైల్లోని మహిళా బోగీలో ఎక్కింది.
ఏపీఎస్ ఆర్టీసీ బస్సులో పరిటాల గ్రామానికి చెందిన ఓ మహిళా ప్రయాణికురాలు వీరంగం సృష్టించింది. జగ్గయ్యపేట డిపోనకు చెందిన బస్సులో విజయవాడ వైపు వెళ్తున్న బస్సులో ఎక్కింది సదరు మహిళ.
ప్రస్తుతం ఆ రూట్లో వెళ్లే భారీ వాహనాలను దారి మళ్లింపు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత పూర్తిగా వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు తెలిపారు.
గత వైసీపీ ప్రభుత్వం హయాంలో చెన్నైకు చెందిన వ్యక్తులకు అప్పటి తహసీల్దార్ రామాంజనేయులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సురేష్, వీఆర్వోలు రాఘవేంద్ర, భార్గవ్, గ్రామ సర్వేయర్ వెంకటేష్, వ్యవసాయ/ఉద్యాన ఏంపీఈ పుట్టా పూర్ణచందునాయుడు, కంప్యూటర్ ఆపరేటర్ జగదీష్ పట్టాలు సృష్టించినట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ కర్నూలు జిల్లా పర్యటనలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశించారు. పోలీసు అధికారులు ప్రణాళిక ప్రకారం సమన్వయంతో పని చేయాలని దిశానిర్దేశం చేశారు.
మొలకలచెరువు నకిలీ మద్యం తయారీ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్టై మదనపల్లి జైల్లో రిమాండ్లో ఉన్న పదిమంది నిందితులను ఎక్సైజ్ పోలీసుల కస్టడీకి అనుమతించింది తంబళ్లపల్లి కోర్టు. అయితే, మూడు రోజుల కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది.
సోషల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపైన, ఎక్సైజ్ అధికారులపైన వైసీపీ సభ్యులు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎక్సైజ్ సీఐ మండవల్లి రామచంద్ర ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు తిరుపతి ఈస్ట్ పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ఏఎస్పీ రవిమనోహర్ ఆచారి తెలిపారు.
కావాలనే తనపై కొంతమంది బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వినుత డ్రైవర్ రాయుడు పేరుతో విడుదలైన వీడియోపై విచారణ జరగాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు శాఖను మూసివేయడం మేలని ఏపీ హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో డీజీపీ, పోలీసు శాఖ నిద్రపోతోందని.. పోలీసు వ్యవస్థ పనిచేసేది ఇలాగేనా అని ప్రశ్నించింది ఏపీ హైకోర్టు.