Home » AP Police
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ విచారణలో సిట్ అధికారులు వేగం పెంచారు. రిమాండ్ ఖైదీలుగా ఉన్న నిందితులను విచారించడం ద్వారా ఈ కుంభకోణంలో ఎవరెవరి హస్తం ఉంది, నిధుల మళ్లింపు ఎలా జరిగింది అనే కోణంలో సిట్ అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. పాఠశాలల్లో టీచర్లు, స్టూడెంట్స్ మధ్య రిలేషన్పై అంతర్గతంగా కెరీర్ గైడర్స్ సర్వే చేస్తోంది. ఈ సర్వేలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
కాకినాడలోని కెనాల్ రోడ్డులో గత శనివారం భారీ ట్రాఫిక్ జామ్ కాగా.. మహిళా కానిస్టేబుల్ జయశాంతి దానిని క్లియర్ చేశారు. ఈ వ్యవహారంపై హోంమంత్రి అనిత స్పందిస్తూ.. ఆమెకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు.
పల్నాడు జిల్లా గుండ్లపాడు జంట హత్యల కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న పిన్నెల్లి సోదరులను పల్నాడు జిల్లా పోలీసులు మరోసారి కస్టడీలోకి తీసుకోనున్నారు.
మచిలీపట్నంలో మద్యం మత్తులో కొంతమంది యువకులు పోలీసులపై ఎదురుదాడికి దిగిన ఘటన కలకలం రేపింది. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడి చేసిన ముగ్గురు మందుబాబులను ఆర్పేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తిరుపతి జిల్లా పీలేరు నియోజకవర్గంలో చోటుచేసుకున్న ఓ విషాద ఘటన రెండు కుటుంబాలను తీవ్ర శోకం మిగిల్చింది. క్షణిక ఆనందం కోసం చేసిన నిర్లక్ష్యం ఇద్దరు యువకుల ప్రాణాలు తీసింది.
అనంతపురం నగరంలో మంగళవారం తెల్లవారుజామున ఒక ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. నగరంలోని అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో, ఒక ప్రముఖ వైన్ షాపులో జరిగిన ఈ ప్రమాదం స్థానికంగా పెను కలకలం రేపింది..
కృష్ణా జిల్లాలో ఇద్దరు జర్నలిస్టులు వీరంగం సృష్టించారు. చల్లపల్లి రోడ్డులోని ఓ మద్యం దుకాణం వద్ద గొడవకు పాల్పడ్డారనే కారణంతో ఇద్దరు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు.
వారం కిందట బందరులో జరిగిన జాతీయ రహదారుల సంస్థ అధికారుల సమావేశంలో ఎంపీ కేశినేని శివనాథ్ కంచికచర్ల బైపాస్ దగ్గర దెబ్బతిన్న రోడ్డు గురించి ప్రస్తావించారు. ఆ రోడ్డును సరిచేయకపోతే పండగకి సొంతూర్లకు వచ్చే వారితో ట్రాఫిక్ కష్టాలు కలుగుతాయని, తక్షణం మరమ్మతులు చేయాలని సూచించారు..
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు పట్టణాలు, గ్రామాల్లో కోడి పందేలకు బరులు సిద్ధం చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం మండలంలో శ్రీనివాసపురం, లక్కవరం, కేతవరం, ఎ.పోలవరం, తాడువాయి, పేరంపేట గ్రామాల్లో పందెం బరులకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు..