Home » AP Police
కూటమి ప్రభుత్వంపై తప్పుడు వార్తలు రాయడంపై సాక్షి మీడియా, వైసీపీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సాక్షి పత్రికలో ప్రైవేట్ స్కూల్ బాలికపై లైంగిక దాడి అని వార్త ఇచ్చారని.. అదే వార్తపై ఇవాళ బాలిక కాదు వివాహిత అని రాశారని అనిత మండిపడ్డారు.
మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత కొడాలి నాని అనుచరుడు నకిలీ పోలీసు అవతారం ఎత్తి బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో కొడాలి నాని అనుచరుడిపై పోలీసులకి ఫిర్యాదు అందడంతో రంగంలోకి దిగి ఆటకట్టించారు.
ఆన్లైన్ యాప్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్న ఓ ముఠా గుట్టు రట్టు చేశారు కడప జిల్లా పోలీసులు. పొద్దుటూరులో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్కి పాల్పడుతున్న ఆరుగురు బెట్టింగ్ ముఠా సభ్యులని బుధవారం అరెస్టు చేశారు కడప జిల్లా పోలీసులు.
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో మాజీ సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసుల నిబంధనలను వైసీపీ నేతలు ఉల్లంఘిస్తున్నారు. డీజే ఏర్పాటు చేయగా.. అనుమతి లేదని పోలీసులు దాన్ని తీయించారు.
కల్తీ మద్యం కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి జోగి రమేశ్, ఆయన బ్రదర్ రామును నెల్లూరు సెంట్రల్ జైలుకు పోలీసులు సోమవారం తరలించారు. ఈ రోజు తెల్లవారుజామున న్యాయాధికారి రిమాండ్ విధించిన అనంతరం జోగి రమేశ్ ఆయన సోదరుడు రామును విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.
నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత జోగి రమేశ్ని ఆదివారం ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. నకిలీ మద్యం కేసులో జోగి రమేశ్ విచారణ పూర్తి అయింది. సుమారు 7 గంటల పాటు జోగి రమేశ్ని సిట్, ఎక్సైజ్ పోలీసులు విచారించారు.
తిరుపతిలో మహిళపై ర్యాపిడో బైక్ డ్రైవర్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. శనివారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటనపై అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
విశాఖపట్నంలో ఈగల్ టీం, సిటీ టాస్క్ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. డ్రగ్స్ తరలిస్తున్నారనే సమాచారం రావడంతో వెంటనే రంగంలోకి దిగి ఆపరేషన్ చేపట్టారు.
కాశీబుగ్గ మృతుల కుటుంబాల బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించిందన్నారు.
తిరుపతి గరుడ వారధిపై ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు కొనసాగుతున్నాయని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ స్పష్టం చేశారు. తిరుపతిలో ప్రతి మలుపు వద్ద బ్లీకింగ్ లైట్లు, రేడియం ఏరో మార్క్స్, సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకున్నామని ఎస్పీ సుబ్బరాయుడు వెల్లడించారు.