Home » AP Police
అనంతపురం నగరంలో వెలుగులోకి వచ్చిన హనీట్రాప్ కేసు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. సంపన్న వర్గాలు, ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, రియల్టర్లను లక్ష్యంగా చేసుకుని ఒక ముఠా వ్యవహరించిన తీరుపై పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారం మళ్లీ వార్తల్లోకి వచ్చింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుతో సంబంధం ఉన్న పరిణామాల నేపథ్యంలో పోలీసులు ఆయన నివాసంలో సోదాలు నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
విశాఖపట్నంలోని గాజువాకలో సోమవారం అగ్నిప్రమాదం జరిగింది. ఓ ఎలక్ట్రానిక్ షోరూమ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
కర్నూలులోని ప్రముఖ వైద్య విద్యాసంస్థలో ర్యాగింగ్ ఘటన వెలుగులోకి రావడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వైద్య విద్యార్థులు సేవాభావంతో ఉండాల్సిన వాతావరణంలో ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనలో ఓ ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి ర్యాగింగ్కు గురయ్యాడని ఆరోపణలు రావడంతో అధికారులు వెంటనే స్పందించారు.
అనకాపల్లి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది. నక్కపల్లి సమీపంలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తాపడటంతో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం తప్పింది.
ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో ఓ యువ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. ప్రేమించిన యువతి తనను నిరాకరించిందనే మనస్థాపంతో ఓ యువకుడు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు.
పది నెలల బాలుడు కిడ్నాప్ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పేర్కొన్నారు. పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పదినెలల బాలుడిని కిడ్నాప్ చేసి విక్రయించిన కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు.
అగ్నిప్రమాదాలు, వాటి నివారణ గురించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. ఏప్రిల్ 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
వైసీపీ సోషల్ మీడియా మాజీ ఇన్చార్జ్ సజ్జల బార్గవ్ రెడ్డి, ఇతర నిందితులది ఆనాగరిక, ఆటవిక ప్రవర్తన అని ఇతరుల గౌరవ ప్రతిష్ఠలను దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో భార్గవ్ రెడ్డిపై న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఏ2 నిందితుడు వాసుదేవ రెడ్డికి ఏసీబీ కోర్టు ఈరోజు (శుక్రవారం) షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.