Home » AP Police
మచిలీపట్నంలో సైబర్ కేటుగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. ఢిల్లీ పోలీసులమంటూ వృద్ధురాలికి వాట్సాప్ కాల్ చేశారు. వృద్ధురాలి అకౌంట్ నుంచి రూ.1.43కోట్లు మాయం చేశారు.
వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని కర్నూలు జిల్లాలోని చిప్పగిరిలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే విరూపాక్షితో పాటు ఆయన తనయుడు చంద్ర, పలువురు వైసీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.
గాదె సాయికృష్ణ కేసులో సిట్ అధికారులు వేగం పెంచారు. ఈ కేసులో పరారీలో ఉన్న నిందితుడు సురేశ్ ఆచూకీ తెలపాలంటూ గుర్తులతో ప్రకటన విడుదల చేశారు.
మాజీ సీఎం జగన్ పర్యటన సందర్భంగా శ్రీకాకుళంలో వైసీపీ నేతల దౌర్జన్యాలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. మహిళ అని కూడా చూడకుండా విధుల్లో ఉన్న ఎస్ఐపై వైసీపీ నేతలు ప్రవర్తించిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందని, అలాంటి వారిని ఉపేక్షించవద్దని పోలీసు ఉన్నతాధికారులకు ప్రభుత్వం స్పష్టం చేసింది.
రౌడీషీటర్ గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న అప్పటి సీఐ ఎస్ఎస్ వీవీ నాగరాజు రెండో రోజు విచారణలోనూ మౌనం పాటించారు. ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులు అడిగిన ఏ ప్రశ్నకూ ఆయన సమాధానమివ్వలేదు.
వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్కు సంకెళ్లు వేసినట్లు ఆయన అభ్యంతరకర వీడియోను రూపొందించి సోషల్ మీడియాలో పోస్టు చేశారని టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు.
రోడ్డు కుదుపునకు ప్రాణం లేచొచ్చిన సంఘటన ఇది. ఏలూరు జిల్లా కైకలూరు మండలం భుజబలపట్నం మాజీ సర్పంచ్ గురజాల రామతులసి(48) రెండు రోజుల కిందట కిడ్నీ సంబంధిత వ్యాధితో అనారోగ్యానికిగురయ్యారు.
వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీకాకుళం పర్యటన పోలీసులనే భయపెట్టేలా సాగింది. జగన్ వెంట వచ్చిన వైసీపీ నేతలు, కార్యకర్తలు నిబంధనలను ఏ మాత్రం పట్టించుకోలేదు.
ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన గాదె సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
చిత్తూరు జిల్లాలో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ఉగాండాకు చెందిన మహిళా డాన్ను చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు.