Home » AP Police
పోస్టల్ బ్యాలెట్ , పోలింగ్ సమయంలో పరీక్షలపై ఎన్నికల సంఘానికి తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) సీనియర్ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) ఫిర్యాదు చేశారు. సోమవారం నాడు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనాను కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు.తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ఏపీ విద్యార్థులకు మే 14న పరీక్షలు ఉన్నాయని వివరించారు.
ఏపీలో అన్ని నియోజకవర్గాలకు ఎన్నికల్లో డబ్బు పంపిణీ చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కడప నుంచి మనుషులను పంపారని కూటమి అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప (Chinarajappa) మండిపడ్డారు. పెద్దాపురం మండలం అనూరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
Andhrapradesh: ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అనుచరుడిపై ఫాక్సో, అత్యాచార కేసు నమోదు అయ్యింది. వన్ టౌన్ పోలీస్స్టేషన్లో వైసీపీ నాయకుడు, ఎమ్మెల్యే అనుచరుడు వడ్ల దాదాపీర్పై కేసు నమోదు చేసిన పోలీసులు.. అతడిని అదుపులోకి తీసుకున్నారు. దాదాపీర్ తనను లైంగికంగా వేధించాడంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నా వైసీపీ అరాచకాలు, ఆగడాలు ఆగట్లేదు. అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు రెచ్చిపోయిన ఘటన అందరికీ తెలిసే ఉంటుంది. సొంత బావమరిది అని కూడా చూడకుండా అధికారంను అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు దౌర్జన్యం చేశారు.
Andhrapradesh: మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై హత్యాయత్నం కేసు నమోదు అయ్యింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా 8వ డివిజన్ జనసేన నేత కర్రి మహేష్ ఇంట్లోకి కిట్టు అనుచరులు చొరబడి దాడి చేశారు. పేర్ని కిట్టు ఎన్నికల ప్రచారంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కేసులో మొత్తం ఆరుగురిపై హత్యాయత్నం కేసు నమోదు అయ్యింది. A1గా పేర్ని కిట్టుని పోలీసులు చూపించారు.
అధికార వైసీపీ(YSRCP) అరాచకాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని వైసీపీ పలు కుట్రలకు తెరదీసింది. ఇందులో భాగంగానే చిత్తూరు జిల్లాలో వైసీపీకి బలంగా ఉన్న ప్రత్యర్థి పార్టీ నేతలపై కుట్రకు పన్నింది. ఇందులో భాగంగానే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకాలకు అడ్డుగా ఉన్న బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ (Ramachandra Yadav)పై పోలీసులను ఉసిగోల్పుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు (AP Elections) కీలక దశకు చేరుకున్నాయి. సమయం లేదు మిత్రమా అంటూ అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా సరే సువర్ణావకాశంగా మలుచుకుని ముందుకెళ్తున్నారు. ఇక.. ఎటు చూసినా పోలీసుల తనిఖీల్లో కోట్లల్లోనే నగదు పట్టుబడుతోంది. ఎక్కడ చూసినా నోట్ల కట్టలే దర్శనమిస్తున్నాయి. ఇక నోట్ల తరలించే విధానం చూస్తే ముక్కున వేలేసుకునే పరిస్థితి. తాజాగా.. అనంతపురం జిల్లాలో 2 వేల కోట్ల నగదు పట్టుబడింది...
Andhrapradesh: టీడీపీ నేత జయరాం నాయుడు అక్రమ అరెస్ట్ను నిరసిస్తూ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట తెలుగుదేశం నేతలు ఆందోళనకు దిగారు. అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, అనంతపురం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్, టీడీపీ నేతలు నిరసన చేపట్టారు. గత అర్ధారాత్రి టీడీపీ నేత జయరాం నాయుడును అక్రమంగా అరెస్ట్ చేసిన పోలీసులు...
అనంతలో పోలీస్ మార్క్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. వైసీపీని వీడి టీడీపీలో చేరిన నేతలను పోలీసులు టార్గెట్ చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జయరాం నాయుడు ను అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి నుంచి ధర్మవరం, ఇతర పోలీస్ స్టేషన్ల చుట్టూ ఆయనను పోలీసులు తిప్పుతున్నారు. జయరాం నాయుడు ఆచూకీ తెలపాలంటూ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట టీడీపీ శ్రేణులు.. కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.
Andhrapradesh: బెజవాడలో డాక్టర్ శ్రీనివాస్ కుటుంబం ఆత్మహత్య తీవ్ర కలకలం రేపింది. శ్రీనివాస్ సహా ఐదుగురు కుటుంబసభ్యులు సూసైడ్ చేసుకున్నారు. విజయవాడలోని గురునానక్నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. డాక్టర్ కుటుంబం ఆత్మహత్యపై డీసీపీ ఆదిరాజ్ రాణా స్పందించారు.