Home » AP Police
మచిలీపట్నంలో మద్యం మత్తులో కొంతమంది యువకులు పోలీసులపై ఎదురుదాడికి దిగిన ఘటన కలకలం రేపింది. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడి చేసిన ముగ్గురు మందుబాబులను ఆర్పేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తిరుపతి జిల్లా పీలేరు నియోజకవర్గంలో చోటుచేసుకున్న ఓ విషాద ఘటన రెండు కుటుంబాలను తీవ్ర శోకం మిగిల్చింది. క్షణిక ఆనందం కోసం చేసిన నిర్లక్ష్యం ఇద్దరు యువకుల ప్రాణాలు తీసింది.
అనంతపురం నగరంలో మంగళవారం తెల్లవారుజామున ఒక ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. నగరంలోని అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో, ఒక ప్రముఖ వైన్ షాపులో జరిగిన ఈ ప్రమాదం స్థానికంగా పెను కలకలం రేపింది..
కృష్ణా జిల్లాలో ఇద్దరు జర్నలిస్టులు వీరంగం సృష్టించారు. చల్లపల్లి రోడ్డులోని ఓ మద్యం దుకాణం వద్ద గొడవకు పాల్పడ్డారనే కారణంతో ఇద్దరు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు.
వారం కిందట బందరులో జరిగిన జాతీయ రహదారుల సంస్థ అధికారుల సమావేశంలో ఎంపీ కేశినేని శివనాథ్ కంచికచర్ల బైపాస్ దగ్గర దెబ్బతిన్న రోడ్డు గురించి ప్రస్తావించారు. ఆ రోడ్డును సరిచేయకపోతే పండగకి సొంతూర్లకు వచ్చే వారితో ట్రాఫిక్ కష్టాలు కలుగుతాయని, తక్షణం మరమ్మతులు చేయాలని సూచించారు..
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు పట్టణాలు, గ్రామాల్లో కోడి పందేలకు బరులు సిద్ధం చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం మండలంలో శ్రీనివాసపురం, లక్కవరం, కేతవరం, ఎ.పోలవరం, తాడువాయి, పేరంపేట గ్రామాల్లో పందెం బరులకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు..
సంక్రాంతి పండుగ సందర్భంగా మూడు రోజుల పాటు జూద క్రీడల నిర్వహణకు సర్వం సిద్ధమవుతోంది. కోడిపందేలు నిర్వహించేందుకు పందెంరాయుళ్లు 'సై’ అంటుంటే పోలీసు అధికారులు మాత్రం 'నై' అంటున్నారు. అయినా షరా మామూలుగానే కోడి పందేలు, గుండాటలు, పేకాట పోటీల వంటివి నిర్వహించడానికి బహిరంగంగానే ఏర్పాట్లు జరుగుతున్నాయి..
కృష్ణా జిల్లాలో వైసీపీ నాయకుల ఆగడాలు మితిమీరుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు మహాత్మా గాంధీ విగ్రహానికి కట్టడం తీవ్ర వివాదానికి దారితీసింది..
శిశువుల విక్రయం కేసులో పసికందులంతా తల్లిదండ్రులు విక్రయించినవారే అని అంతా అనుకున్నారు. ఢిల్లీ ముఠాలో పనిచేసి ముంబయిలోని థానే జైల్లో ఉన్న అనిల్బాబా కైర్ గురించి తెలిసిన తర్వాత.. కొత్త అనుమానాలు కలుగుతున్నాయి. గత ఏడాది మార్చిలో నగరంలో శిశువులను విక్రయిస్తుండగా పోలీసులు సరోజిని గ్యాంగ్ను పట్టుకున్నారు..
పరకామణి కేసులో పోలీసులకు ఏపీ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఈ కేసులో ప్రమేయం ఉన్న పోలీసులపై కేసులు నమోదు చేయాలని ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.