Home » AP Police
తాజా రాజకీయ పరిణామాలు, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై పవన్ కల్యాణ్ సమావేశాల్లో చర్చిస్తారు. 29వ తేదీన ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ ఆవిర్భావం నుంచి పని చేస్తున్న 10 మందిని ఎంపిక చేసి.. వారితో వివిధ అంశాలపై అధినేత మాట్లాడతారు.
పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ అల్లుడు పునీత్ను సైబర్ కేటుగాళ్లు టార్గెట్ చేశారు. పునీత్ కంపెనీలో సైబర్ మోసానికి పాల్పడ్డారు. పునీత్ పేరుతో తన అకౌంటెంట్కు సైబర్ కేటుగాళ్ల మెసేజ్ చేశారు. అత్యవసరంగా రూ.1.40 కోట్లు కావాలంటూ.. అకౌంట్కు డబ్బులు పంపుమని మెసేజ్ పంపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులపై మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత పేర్ని నాని చేసిన నిరాధారమైన అనుచిత వ్యాఖ్యలను నూజివీడు డీఎస్పీ ఖండించారు. పెదవేగి మండలం కొండలరావుపాలెం గ్రామ కొల్లేరు ప్రాంత రైతాంగ పోరాటంలో ముందస్తు ప్రణాళిక ప్రకారం మారణయుధాలతో కొంతమంది రౌడీ షీటర్లు, బౌన్సర్లను తన ఇంటి వద్ద వైసీపీ నాయకుడు అబ్బాయి చౌదరి ఏర్పాటు చేశారు.
వైసీపీ హయాంలో ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ డిప్యూటీ సీఎం, మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి కీలకంగా ఉండటంతో శుక్రవారం ఉదయం నుంచి నారాయణ స్వామిని సిట్ అధికారులు విచారించారు. ఆరు గంటల పాటు కొనసాగిన విచారణ ముగిసింది. అయితే ఈ విచారణలో నారాయణ స్వామి సిట్ అధికారుల ప్రశ్నలకు దాటవేసినట్లు తెలుస్తోంది.
ఏపీ మద్యం కుంభకోణం కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. సిట్ అధికారులు నిందితులకు నిద్రలేకుండా చేస్తున్నారు. సిట్ దూకుడుతో కేసు జెట్ స్పీడ్లో ముందుకెళ్తుంది. తాజాగా కేసులో డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకోనున్నారు. ఆయనను విచారించి నిజానిజాలు రాబట్టానున్నట్లు అధికారులు తెలిపారు.
కదిరి నుంచి జిల్లా సరిహద్దుగా ఉన్న తనకల్లు మండలంలోని చీకటిమానుపల్లి వరకు అనేక మలుపులున్నాయి. ఈమలుపుల్లో ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించడంలేదు. ముఖ్యంగా నల్లచెరువు మండలంలోని పెద్దయల్లంపల్లి వద్ద ఎదురుగా వస్తున్న వాహనాలు పూర్తిగా కనిపించవు.
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చుక్కెదురైంది. తాడిపత్రికి వెళ్లేందుకు భద్రత కల్పించాలని హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను కొట్టేసి డివిజన్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
విద్యా రంగంలో కావచ్చు.. స్పోర్ట్స్లో కావచ్చు.. బిజినెస్లో కావచ్చు మేము ఏం తక్కువ కాదు అంటూ వారి ఉనికి చాటుకుంటున్నారు. మగవాళ్ళకు సమానంగా పనులు చేస్తూ.. దేనిలోనూ ఆడవారు తక్కువ కాదు అని నిరూపిస్తున్నారు.
తనను హత్య చేసేందుకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్లాన్ చేశారని కావలి ఎమ్మెల్యే కావ్యా కృష్ణారెడ్డి ఆరోపించారు. క్రషర్ వద్ద మధ్యాహ్న సమయాల్లో తాను ఉంటుంటానని చెప్పుకొచ్చారు. ఇవాళ వేరే పనిమీద విజయవాడకి వచ్చానని పేర్కొన్నారు.
DSR కంపెనీ ట్యాక్స్ చెల్లింపుల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు సమాచారం రావడంతో సోదాలు నిర్వహిస్తున్నట్లు ఐటీ అధికారలు తెలిపారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, SR నగర్, సురారంలో సోదాలు కొనసాగుతున్నాయి.