Home » AP Police
కృత్రిమ మేధ ఏఐ ప్రపంచంలోని అన్ని రంగాల్లోనూ ప్రవేశిస్తోంది. ఆ అత్యాధునిక సాఫ్ట్వేర్ ప్రయోజనాలు అందిపుచ్చుకోవాలని ఏపీ పోలీసులు కూడా ప్రయత్నిస్తున్నారు.
ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ టెక్నాలజీ వినియోగంలో ముందంజలో ఉందని హోం మంత్రి అనిత ప్రశంసించారు. ఎక్కడ నేరం జరిగినా, ట్రాఫిక్ స్తంభించినా, అసాంఘిక శక్తుల అడ్డాలను టెక్నాలజీ ద్వారా గుర్తించి చర్యలు తీసుకుంటున్నారని అనిత తెలిపారు.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత వల్లభనేని వంశీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ఇచ్చిన బెయిల్పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వంశీ బెయిల్పై సుప్రీంకోర్ట్లో ప్రభుత్వం సవాల్ చేయనుంది. ఈ మేరకు సుప్రీంకోర్ట్లో ఉన్న అడ్వకేట్ ఆన్ రికార్డ్స్కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఒకప్పుడు రౌడీల పక్కన నిలబడాలంటేనే రాజకీయ నేతలు సిగ్గుపడేవాళ్లని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఇప్పుడు రౌడీలే రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయం ముసుగులో నేరాలు చేసేవాళ్ల ముసుగు తీస్తామని సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.
ఓ లారీ డ్రైవర్ నిర్లక్ష్యం విధి నిర్వహణలో ఉన్న ఇద్దరు పోలీసులను బలితీసుకుంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలను ప్రపంచ పటంలో చంద్రబాబు నిలిపారని ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్లో పర్యావరణ, ప్రకృతి అందాలకు కొదవలేదని ఉద్గాటించారు. అరకులోయ అందాలు ప్రపంచానికే తలమానికమని రాందేవ్ బాబా పేర్కొన్నారు.
చిత్తూరులో దొంగలు రెచ్చిపోయారు. ప్రయాణికులను భయపెట్టి అందిన కాడికి దోచుకెళ్లారు. బీహార్ తరహాలో ట్రైన్ ఆపి మహిళల మెడలోని తాళిబొట్లు, చైన్లను దుండగులు గుంజుకెళ్లారు.
పల్నాడు జిల్లాలో అమానుష ఘటన జరిగింది. నవవధువుపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. అమరావతి మండలం అత్తలూరులో 20 రోజుల క్రితం ఆమెకి వివాహమైంది. వివాహం అయినప్పటి నుంచి నలుగురు యువకులు వివాహితను వేధిస్తున్నారు. భర్త ఇంటిలో లేని సమయంలో భార్యపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారు.
గంజాయి ఎవరూ వాడినా వదిలిపెట్టమని ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు. లా అండ్ ఆర్డర్లో చాలా సమస్యలు చూశానని తెలిపారు. రాయలసీమలో ముఠాలను అణచివేసిన పార్టీ టీడీపీ అని గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో ముఠా కక్షలు ఉండటానికి వీల్లేదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
విజయవాడ నగరంలో బుధవారం సీపీ రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో భారీగా గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. రూ.15 లక్షలు విలువైన 200 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం నుంచి బెజవాడకు తీసుకువస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.