Home » AP Police
ఏలూరు జిల్లా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజును సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. తన ఖాతా నుంచి భారీగా నగదు కాజేశారు. ఈ విషయంపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
మచిలీపట్నంలో బాలికపై అత్యాచారం జరిగింది. ఆ బాలిక గర్భం దాల్చడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
మాజీ మంత్రి కఠారి ఈశ్వర్ కుమార్ ఇంట్లో దుండగులు చోరీకి తెగబడ్డారు. వంశపారంపర్యంగా వస్తున్న సుమారు 10 కిలోల వెండి వస్తువులు, పూజా సామాగ్రి అపహరణకు గురైనట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన కడియం నర్సరీలో మహిళపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో రాజమండ్రి జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నర్సరీలో పనిచేసే మహిళపై అత్యాచారానికి పాల్పడి, ఆపై హత్య చేసిన నలుగురు నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది.
ఏపీ మద్యం స్కాం కేసులో మరో కీలక పరిణామంచోటుచేసుకుంది. ఈ కేసులో ఏ7 నిందితుడిగా ఉన్న ముప్పిడి అవినాశ్రెడ్డిని సిట్ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు.
పిల్లల విక్రయాలపై సమగ్ర విచారణ చేస్తున్నామని ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు. తమకు లభించిన ఆధారాల సహాయంతో ఈ కేసును పూర్తిగా దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు.
మచిలీపట్నంలో రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. జనసేన పార్టీ జెండా దిమ్మ నిర్మాణంపై మొదలైన వివాదం చివరకు గూడూరు పోలీస్ స్టేషన్ వరకు చేరింది.
ఏపీ హైకోర్టు అడ్వకేట్ను కిడ్నాప్ చేసి హింసించిన కేసులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరుడిని పోలీసులు అరెస్టు చేశారు. 2023 నవంబర్ 7వ తేదీన హైకోర్టు అడ్వకేట్ని నిర్భంధించి హింసించినట్లు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు కర్నాటి వీరభద్రరావు, కర్నాటి సతీశ్లపై ఆరోపణలు ఉన్నాయి.
విజయవాడ బస్టాండ్ సమీపంలోని ఓ హోటల్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఊహించని పరిణామం ఎదురైంది. ఓ వ్యక్తి పోలీసులపైనే తుపాకీతో కాల్పులు జరిపేందుకు ప్రయత్నించడం నగరంలో సంచలనంగా మారింది.
విశాఖపట్నం జిల్లాలోని పెందుర్తి మండలం చీమలపల్లిలో ప్రభుత్వ భూములపై అక్రమంగా నిర్మించిన పాకలపై రెవెన్యూ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. చీమలపల్లిలోని సర్వే నంబర్ 24లోని ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించిన సుమారు 400 పాకలను అధికారులు తొలగించారు.