Home » AP Police
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. హైదరాబాద్లో శనివారం పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. జగన్కు చెందిన భారతీ సిమెంట్స్లో సిట్ అధికారులు సోదాలు చేశారు.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో గురువారం విజయవాడలోని సిట్ ఆఫీస్కు తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు శ్రవణ్రావు విచారణకు హాజరయ్యారు. లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు దుబాయ్లో శ్రవణ్రావు ఆశ్రయం ఇచ్చాడని అధికారుల విచారణలో తేలడంతో నోటీసులు ఇచ్చారు. దీంతో ఆయన సిట్ ఆఫీసుకి వచ్చారు.
చెట్ల పొదల్లో మనల్ని ఎవరు చూస్తారులే అనుకున్నారు. మత్తు ఇంజక్షన్లు వేసుకుంటూ.. మత్తులో మునిగి తేలుతున్నారు. ఇలా తిరుపతి రూరల్ మండలం లింగేశ్వరనగర్లో బుధవారం మత్తు ఇంజక్షన్లు వాడుతున్న నలుగురు యువకులను డ్రోన్ కెమెరాతో నిఘా వుంచి పోలీసులు పట్టుకున్నారు.
నంద్యాల జిల్లాలోని నూనెపల్లె రమనయ్యతో, పల్నాడు జిల్లా పిడుగురాల్లకు చెందిన రవనమ్మకి వివాహం జరిగింది. పెళ్లి అయిన తర్వాత వీరి వివాహా బంధంలో తరచుగా మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. అయితే భర్త రమనయ్య ప్రవర్తనతో విసిగిపోయిన భార్య రవనమ్మ.. తన భర్తని అంతమొందించాలని ప్లాన్ చేసింది.
తిరువూరు ఎస్ఐ సత్యనారాయణ ఒక బ్యాచ్నీ పెట్టుకొని గంజాయి అమ్మే, కొనే వారి వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆరోపణలు చేశారు. తిరువూరు స్టేషన్లో ఎస్ఐ ప్రైవేట్ పంచాయతీలు చేస్తూ అక్రమ వసూళ్లు చేస్తున్నాడని పూర్తి ఆధారాలు తాను చూపిస్తానని ఎమ్మెల్యే కొలికపూడి చెప్పారు.
క్వార్ట్జ్ కుంభకోణం కేసు విచారణలో వైసీపీ ముఖ్య నేతల భాగోతాలు బయటకొస్తున్నాయి. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ భారీ అక్రమాలు బయటపడ్డాయి. మాజీ మంత్రులు అనిల్ కుమార్, కాకాణి గోవర్థన్రెడ్డికి అత్యంత సన్నిహితుడైన బిరదవోలు శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చేతిలో రీజన్స్ ఫర్ అరెస్టు నివేదిక ఉంది. కోర్టులో 10 పేజీల రీజన్స్ ఫర్ అరెస్టు రిపోర్టు దాఖలు చేశారు సిట్ అధికారులు. లిక్కర్ స్కాం కేసులో మిథున్రెడ్డి పాత్ర స్పష్టంగా ఉందని అధికారులు తెలిపారు.
AP Police Vs Jagan: వైసీపీ ప్రభుత్వంలో కూడా తాము చట్ట విరుద్ధంగా వ్యవహరించిన వారిపై కేసులు పెట్టామని.. అరెస్ట్లు చేశామని పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు తెలిపారు. పోలీసులను వీఆర్లో పెట్టడం అనేది గత ప్రభుత్వంలో చేశారని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ప్రకాశం జిల్లా సింగరాయకొండ సీఐ చావా హజరత్తయ్య..
మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత పేర్ని నానిపై విజయవాడలో ఆదివారం నాడు మరో కేసు నమోదైంది. పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలంటూ విజయవాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు ఫతావుల్లా, ఆషాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.