Home » AP News
Andhrapradesh: ఏపీ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైనప్పటికీ కొన్ని చోట్ల మాత్రం ఈవీఎంల మొరాయింపుతో పోలింగ్ ఆలస్యమైంది. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు వేచి ఉన్నారు. చాలా చోట్ల ఈవీఎంల మొరాయింపులతో పోలింగ్ ప్రారంభంకాని పరిస్థితి. పోలింగ్ మొదలై గంట గడిచినప్పటికీ కొన్ని చోట్ల మాత్రం ఇంకా పోలింగ్ ప్రారంభంకాలేదు.
ఏపీలో ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ సీఎం, వైసీపీ అధినేత చంద్రబాబు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు.. ఆయన సతీమణి భువనేశ్వరితో కలిసి ఉదయం 7.00 గంటలకు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉండవల్లి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో టీడీపీ చీఫ్ ఓటు వేశారు.
Andhrapradesh: ఏపీలో పోలింగ్ ప్రారంభమైంది. అయితే పలుచోట్ల ఈవీఎంల మొరాయింపులతో పోలింగ్ ఆలస్యమైంది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఇప్పటికీ పోలింగ్ ప్రారంభంకాని పరిస్థితి ఏర్పడింది. పోలింగ్ ఆలస్యం కారణంగా రాజకీయ నేతలు కూడా పోలింగ్ కేంద్రాల్లో వేచి ఉండాల్సి వస్తోంది. ఇటు టీడీపీ అభ్యర్థి కేశినేని చిన్ని ఉదయం ఏడు గంటలకే ఓటు వేసేందుకు వచ్చారు.
Andhrapradesh: పల్నాడు జిల్లాలో జరిగిన ఘటనలపై ఎన్నికల కమిషన్ సీరియస్ అయ్యింది. పోలింగ్ ప్రారంభానికి ముందే పల్నాడులో గొడవలు జరగడంపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పల్నాడు గొడవపై ఆరా తీసిన ఈసీ.. వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అవసరమైతే మరిన్ని అదనపు బలగాలను తరలించేలా చూడాలని ఆదేశించింది. పీలేరులో ముగ్గురు ఏజెంట్లను కిడ్నాప్ చేసి పోలింగ్ స్టేషన్లకు చేరుకోలేని ప్రాంతంలో వదిలారని ఈసీకి టీడీపీ ఫిర్యాదు చేసింది.
Andhrapradesh: ఏపీలో పోలింగ్ మొదలవక ముందే ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. పలు ప్రాంతాల్లో వైసీపీ శ్రేణులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఏజెంట్లపై అధికార పార్టీ నేతలు దాడులకు తెగబడుతున్నారు. ఇక చిత్తూరు జిల్లాలో ఏకంగా టీడీపీ ఏజెంట్లను కిడ్నాప్ చేశారు వైసీపీ నేతలు. అది కూడా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత మండలంలోనే.
Andhrapradesh: ఏపీలో పోలింగ్ ప్రారంభం అయ్యేందుకు మరికొద్ది నిమిషాలే సమయం ఉంది. పోలింగ్ కేంద్రాల వద్ద అధఇకారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోగా.. ఓటర్లు ఒక్కొక్కరుగా పోలింగ్ బూత్ వద్దకు వస్తున్నారు. అయితే పోలింగ్ ప్రారంభకాకముందే కొన్ని ప్రాంతాల్లో ఆందోళనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రతిపాడు నియోజకవర్గంలో పలు గ్రామాల్లో టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు.
Andhrapradesh: రాష్ట్ర వ్యాప్తంగా మరికాసేపట్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభంకానుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల వద్ద మాక్ పోలింగ్ ప్రారంభమైంది. ఏజెంట్ల సమక్షంలో అధికారులు మాక్ పోలింగ్ నిర్వహించారు. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మాక్ పోలింగ్ ప్రారంభమైంది. ఐదు గంటలకే ప్రధాన పార్టీల ఏజెంట్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మాక్ పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మరోవైపు కర్నూలులో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా పెడుతూ.. గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. రానున్న ఐదేళ్లు తమ భవిష్యత్, రాష్ట్ర అభివృద్ధిని నిర్దేశించే పాలకులను ఎంపిక చేసుకొనేందుకు ఓటు ద్వారా ప్రజలు తీర్పు ఇవ్వనున్నారు.
పోలింగ్కు మరికొన్ని గంటల సమయమే ఉంది. కానీ అధికారి వైఎస్సార్సీపీ (YSRCP) మాత్రం కుయుక్తులకు పాల్పడటంలో ఏమాత్రం తగ్గడం లేదు. మరోసారి అధికారంలోకి రావడానికి వైసీపీలు కుట్రలకు పాల్పడుతోంది. దీనిలో భాగంగానే పల్నాడు జిల్లాలో ఉద్రిక్తతలకు ప్లాన్ చేసినట్లు సమాచారం. పల్నాడు జిల్లాలోని రెంటచింతలలో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి.