నేడు ఆర్టీసీ యాజమాన్యంతో జేఏసీ చర్చలు
ABN , Publish Date - Jul 06 , 2026 | 06:05 AM
ఆర్టీసీని బలోపేతం చేసే చర్యలను ప్రభుత్వం తక్షణమే చేపట్టాలని, ప్రైవేట్ విద్యుత్ బస్సుల నిర్ణయాన్ని విరమించుకుని, విద్యుత్ బస్సుల నిర్వహణను..
విజయవాడ సిటీ, జూలై 5(ఆంధ్రజ్యోతి): ఆర్టీసీని బలోపేతం చేసే చర్యలను ప్రభుత్వం తక్షణమే చేపట్టాలని, ప్రైవేట్ విద్యుత్ బస్సుల నిర్ణయాన్ని విరమించుకుని, విద్యుత్ బస్సుల నిర్వహణను చేపట్టాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్లు వై.శ్రీనివాసరావు, పి.దామోదరరావు కోరారు. ఆర్టీసీ యాజమాన్యం తో సోమవారం జరిగే చర్చలకు సంబంధించిన అంశాలు, డిమాండ్ల విషయమై విజయవాడలోని సంఘ కార్యాలయంలో ఆదివారం ఆర్టీసీ జేఏసీ అత్యవసరంగా సమావేశమైంది. ఆడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ జిల్లాల జేఏసీ కన్వీన ర్లు, కోకన్వీనర్లతో సమీక్ష నిర్వహించారు. స్త్రీశక్తి బస్సుల సంఖ్యను పెంచాలని, ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న వివిధ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్టు తెలిపారు. మరో 30 డిమాండ్లను యాజమాన్యం ముందు ఉంచాలని తీర్మానించినట్లు తెలిపారు.