నిష్పక్షపాతంగా రాష్ట్రపతి ఉత్తర్వుల అమలు
ABN , Publish Date - Jul 06 , 2026 | 06:01 AM
రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో ఏఈ-ఏఈఈలకు 50:50 నిష్పత్తిలో పదోన్నతులు కేటాయించి నిష్పక్షపాతంగా..
పీఆర్ డిప్లొమో ఇంజనీర్ల సంఘం డిమాండ్
అమరావతి, జూలై 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో ఏఈ-ఏఈఈలకు 50:50 నిష్పత్తిలో పదోన్నతులు కేటాయించి నిష్పక్షపాతంగా అమలు చేయాలని ఏపీ పంచాయతీరాజ్ డిప్లొమో ఇంజనీర్ల సంఘం డిమాండ్ చేసింది. ఆదివారం విజయవాడ పీఆర్ ఈఎన్సీ కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం.. ఆ సంఘ అధ్యక్షుడు కె.రవీంద్ర అధ్యక్షతన నిర్వహించారు. శాఖలో ఖాళీగా ఉన్న టెక్నికల్ అసిస్టెంట్లు, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులను ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ ద్వారా గానీ, నేరుగా గానీ నియామకం చేపట్టాలన్నారు. 2014-19లో చేపట్టిన ఉపాధి మెటీరియల్ సిమెంట్రోడ్లకు సంబంధించి గత ప్రభుత్వం ఆపాదించిన ఏసీబీ కేసులన్నింటినీ ఎత్తివేయాలని కోరింది.