Share News

శ్రీవారి ఆలయంలో 17న ఆణివార ఆస్థానం

ABN , Publish Date - Jul 06 , 2026 | 05:46 AM

తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 17న ఆణివార ఆస్థానం జరుగుతుంది. ఈ సందర్భంగా సాయంత్రం ఆరు గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి..

శ్రీవారి ఆలయంలో 17న ఆణివార ఆస్థానం

తిరుమల, జూలై 5 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 17న ఆణివార ఆస్థానం జరుగుతుంది. ఈ సందర్భంగా సాయంత్రం ఆరు గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి అత్యంత శోభాయమానంగా అలంకరించిన పుష్పపల్లకిపై తిరుమల పురవీధుల్లో విహరిస్తూ భక్తులకు కనువిందు చేస్తారు. ఈ ఉత్సవం నేపథ్యంలో 17వ తేదీన కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.

Updated Date - Jul 06 , 2026 | 05:47 AM