Home » AP News
మరికొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర(Andhra Pradesh) భవితవ్యం నిర్దేశితం అవనుంది. మరో ఐదేళ్ల పాలన ఎవరి చేతిలో అనేది మే 13న డిసైడ్ కానుంది. దీనిని డిసైడ్ చేసేది రాష్ట్ర ఓటర్లే. అందుకే రాష్ట్ర భవిష్యత్ కోసం ఒక్కసారి ఆలోచించండంటూ తెలుగుదేశం పార్టీ(TDP) కీలక ప్రకటన విడుదల చేసింది.
నేరాలు, ఘోరాలు, అరాచకాల్లో సీఎం జగన్ రెడ్డి (CM Jagan) పీహెచ్డీ చేశారని తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఆరోపించారు. రాష్ట్రంలో దొంగలు పడ్డారని.. మనల్ని మనం కాపాడుకోవాలంటే అందరం కర్రలు చేతపట్టి రోడ్ల మీదకి రావాలని పిలుపునిచ్చారు. రాతియుగం పోవాలి, స్వర్ణయుగం రావాలని చెప్పారు. ఈ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే అభివృద్ధి చేస్తాం.. వైసీపీ అధికారంలోకి వస్తే ఏపీలో మళ్లీ అరాచకం సృష్టిస్తుందని చంద్రబాబు విరుచుకుపడ్డారు.
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. శనివారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ రెడ్డి (CM Jagan) ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోపై మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) కీలక వ్యాఖ్యలు చేశారు. పేద వాడి జీవన ప్రమాణాలకు అనుగుణంగా తమ మేనిఫెస్టో ఉందని అన్నారు.
మాట తప్పను.. మడమ తిప్పనంటారు.. కానీ చేసేదంతా రివర్స్ ఉంటుంది. అనునిత్యం మాట తప్పడం.. మడమ తిప్పడమే పనిగా ఉంటారు. మేనిఫెస్టో(YSRCP Manifesto) అంటే భగవద్గీత, ఖురాన్, బైబిల్ అని ఊదరగొడతారు.. కానీ, అదే మేనిఫెస్టోలోని హామీలను 85 శాతం అమలు చేయకుండా పవిత్ర గ్రంధాలకు అపచారం చేస్తారు.
ఓటమి భయంతో వైసీపీ (YSRCP) నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని దెందులూరు తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ (Chintamaneni Prabhakar) అన్నారు. దెందులూరులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అరాచకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. శనివారం నాడు దెందులూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై చింతమనేని ప్రభాకర్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila).. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు(YS Jagan) సంచలన లేఖ రాశారు. ఇదీ నీ పాలన అంటూ జగన్ పాలనా తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో(Andhra Pradesh) బలహీనవర్గాల జీవన ప్రమాణాలు అత్యంత దారుణంగా ..
మునుపెన్నడూ లేనంతగా ఎండ వేడి, తీవ్ర వడగాడ్పులతో దేశంలోని అనేక ప్రాంతాలు ఉడుకుతున్నాయి.
వైసీపీ (YSRCP)కి ఈ ఎన్నికల్లో చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు. శుక్రవారం నాడు రాజోలు నియోజకవర్గం మలికిపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై పవన్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
విశాఖపట్నం నార్త్ నుంచి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ సంచలన ఆరోపణలు చేశారు. తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని అన్నారు.
ఏపీ ఎన్నికల (AP Election 2024) ముందు ఏపీ పోలీసుల (AP Police) కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. మొన్ననే అధికార వైసీపీకి సహకరిస్తున్నారనే విషయంపై ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీసు కమిషనర్ కాంతిరాణా టాటాలపై కేంద్ర ఎన్నికల కమిషన్ వేటు వేసిన విషయం తెలిసిందే.