Home » AP Liquor
వైసీపీ హయాంలో ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ డిప్యూటీ సీఎం, మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి కీలకంగా ఉండటంతో శుక్రవారం ఉదయం నుంచి నారాయణ స్వామిని సిట్ అధికారులు విచారించారు. ఆరు గంటల పాటు కొనసాగిన విచారణ ముగిసింది. అయితే ఈ విచారణలో నారాయణ స్వామి సిట్ అధికారుల ప్రశ్నలకు దాటవేసినట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త బార్ పాలసీ నిర్ణయం తీసుకుందని ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్ తెలిపారు. 840 బార్లు ఏపీ వ్యాప్తంగా ఉన్నాయని.. పది శాతం కల్లు గీత కులస్థులకు కేటాయిస్తామని పేర్కొన్నారు. కొత్త వారూ ఈ బిజినెస్లోకి రావడానికి కొన్ని మార్పులు చేశామని వివరించారు.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు బుధవారం రిమాండ్ ముగిసింది. రిమాండ్ ముగియడంతో వైసీపీ రాజంపేట ఎంపీ మిథున్రెడ్డిని విజయవాడ ఏసీబీ కోర్టుకు రాజమండ్రి పోలీసులు తరలించారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో మిథున్రెడ్డి ఉన్న విషయం తెలిసిందే.
మరి కొద్దిసేపట్లో.. విజయవాడ ఏసీబీ కోర్టులో రెండవ ఛార్జ్ షీట్ దాఖలు చేయనోంది సిట్. 200 పేజీలతో రెండవ ఛార్జ్ షీట్ను రెడీ చేసినట్లు సిట్ అధికారులు తెలుపుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో మాజీ ఎక్సైజ్ మంత్రి కె. నారాయణ స్వామికి జులై 21న విచారణకు హాజరు కావాలని సిట్ నోటీసులు జారీ చేసింది. కానీ, సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు..
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు ఆగస్టు 1వ తేదీ వరకు రిమాండ్ విధించింది. దీంతో అతడ్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
లిక్కర్ స్కామ్ కేసులో డొల్ల కంపెనీల నుంచి అంతిమ లబ్ధిదారునికి ముడుపులు చేర్చడంపై ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ ప్రశించినట్లు తెలుస్తోంది. మిథున్రెడ్డి విచారణ ఈ కేసులో కీలకంగా మారనున్నట్లు అధికారులు భావిస్తున్నారు.
Vijayasai Reddy SIT Inquiry: ఏపీ లిక్కర్ స్కాంలో సిట్ విచారణకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి డుమ్మాకొట్టారు. తాను విచారణకు రాలేనంటూ సిట్ అధికారులకు మాజీ ఎంపీ సమాచారం ఇచ్చారు.
Payyavula Slams Jagan: బంగారుపాళ్యంలో ట్రాక్టర్ లాక్కొచ్చి మరీ వైసీపీ చేసిన ట్రిక్స్ అన్నీ డ్రోన్ కెమెరాల్లో బయటపడ్డాయని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వెటకారం తగ్గించుకుంటే మంచిదని హితవుపలికారు.
Chevireddy SIT Custody: గత రెండు రోజుల విచారణలో సిట్కు చెవిరెడ్డి ఏమాత్రం సహకరించనట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు ప్రశ్నలు సంధించినప్పటికీ మాజీ ఎమ్మెల్యే సరైన సమాధానం చెప్పనట్లు సమాచారం.