Home » AP Liquor
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసు నిందితులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో సుప్రీంకోర్టును నిందితులు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప ఆశ్రయించారు.
మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడు, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఈ కేసులో నిందితుల ఆస్తుల అటాచ్మెంట్కు సర్కార్ అనుమతినిచ్చింది.
ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఏ49గా ఉన్న అనిల్ చోఖ్రాకు ఎసిబి కోర్టు రిమాండ్ విధించింది. షెల్ కంపెనీల ఏర్పాటు, మనీలాండరింగ్లో కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఏపీ మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అనిల్ చోకరాని సిట్ అధికారులు ముంబైలో అరెస్ట్ చేశారు. ఏపీకి తీసుకువచ్చి ఆయనను విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
జోగి రమేశ్తో పాటు ఆయన సోదరుడు జోగి రామును 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఎక్సైజ్శాఖ కోర్టును కోరింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను రేపటి(మంగళవారం)కి వాయిదా వేసింది.
కల్తీ మద్యం కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి జోగి రమేశ్, ఆయన బ్రదర్ రామును నెల్లూరు సెంట్రల్ జైలుకు పోలీసులు సోమవారం తరలించారు. ఈ రోజు తెల్లవారుజామున న్యాయాధికారి రిమాండ్ విధించిన అనంతరం జోగి రమేశ్ ఆయన సోదరుడు రామును విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.
నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత జోగి రమేశ్ని ఆదివారం ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. నకిలీ మద్యం కేసులో జోగి రమేశ్ విచారణ పూర్తి అయింది. సుమారు 7 గంటల పాటు జోగి రమేశ్ని సిట్, ఎక్సైజ్ పోలీసులు విచారించారు.
మద్యం కుంభకోణం కేసులో నిందితులు రాజ్ కేసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, భూనేటి చాణిక్య, చెవి రెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు.. విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.
మొలకలచెరువు నకిలీ మద్యం తయారీ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్టై మదనపల్లి జైల్లో రిమాండ్లో ఉన్న పదిమంది నిందితులను ఎక్సైజ్ పోలీసుల కస్టడీకి అనుమతించింది తంబళ్లపల్లి కోర్టు. అయితే, మూడు రోజుల కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది.
సోషల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపైన, ఎక్సైజ్ అధికారులపైన వైసీపీ సభ్యులు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎక్సైజ్ సీఐ మండవల్లి రామచంద్ర ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు తిరుపతి ఈస్ట్ పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ఏఎస్పీ రవిమనోహర్ ఆచారి తెలిపారు.