Home » AP Liquor
మొలకల చెరువు నకిలీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ(22) నిందితుడిగా ఉన్న చైతన్య బాబుని అరెస్టు చేసి రిమాండ్కి తరలించారు ఎక్సైజ్ పోలీసులు.
అసత్య ప్రచారం చేస్తున్న సాక్షి మీడియాకి నోటీసులు పంపించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. కల్తీ మద్యంతో మరణాలు అంటూ అసత్య వార్తలు వండి వార్చిన జగన్ మీడియా సంస్థ సాక్షి.
నకిలీ మద్యం కేసులో మూలాల్లోకి పోతే షాకింగ్ వార్తలు బయటకు వస్తున్నాయి. అందుకే దీనిపై మరింత విచారణ కోసం సిట్ వేస్తున్నాం. దీంతో దీని వెనుక ఉన్న ఆఫ్రికా లింకులు కూడా బయటకు వస్తాయి. మళ్ళీ ఇలాంటి నేరాలు చేయాలంటే వెన్నులో వణుకు పుట్టేలా చేస్తా..
ఏపీ నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సౌతాఫ్రికా నుంచి విజయవాడ వచ్చిన జనార్దన్రావును పోలీసులు అరెస్ట్ చేశారు.
ఏపీ లిక్కర్ స్కాం కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. లిక్కర్ కేసులో మధ్యంతర రక్షణ కల్పించింది సుప్రీంకోర్టు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ని గతంలో ఏపీ హైకోర్టు తోసిపుచ్చింది.
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం కేసులో నిందితులుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, వెంకటేష్ నాయుడులు ఉన్నారు. వీరి బెయిల్ పిటిషన్పై బుధవారం విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరుగనుంది.
మాజీ మంత్రి పేర్ని నానిపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో మద్యం మాఫియా తయారు చేసింది జగన్ కాదా అని ప్రశ్నించారు. సౌతాఫ్రికాలో వైసీపీ పెద్దలకు మద్యం వ్యాపారాలు లేవా..? అని మంత్రి కొల్లు రవీంద్ర నిలదీశారు.
దెయ్యాలు వేదాలు వల్లించడం.. జగన్ కల్తీ లిక్కర్ గురించి మాట్లాడటం నూటికి నూరుశాతం ఒక్కటేనని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సెటైర్లు గుప్పించారు. జగన్ తన అక్రమార్జన కోసం నాణ్యత లేని జే బ్రాండ్స్తో వేలమంది ప్రాణాలు తీసి లక్షలాది మంది ఆరోగ్యాన్ని దెబ్బతీశారని ధ్వజమెత్తారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.
నిజానికి ఐదేళ్ల కిందట వైసీపీ హయాంలోనే ఈ నకిలీ మకిలి మొదలైందని, తీగలాగితే తమ డొంకా కదులుతుందని పలువురు వైసీపీ నేతలు భయపడుతున్నారు.
మద్యం కుంభకోణం కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మోహిత్రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తుడా చైర్మన్గా ఉండగా మద్యం ముడుపులు తరలించేందుకు అధికార వాహనాలు వాడారనేది తనపై ఆరోపణలు ఉన్నాయి.