Home » AP High Court
రాష్ట్ర హైకోర్టులో నలుగురు జడ్జీలు శాశ్వత న్యాయమూర్తులగా బుధవారం ప్రమాణం చేశారు. హైకోర్టులోని మొదటి కోర్టు..
సాంఘిక సంక్షేమ బీసీ గురుకుల హాస్టళ్లలో వసతుల కల్పనలో అధికారుల నిర్లక్ష్యంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జిల్లా స్థాయి అధికారులు హాస్టళ్లను సందర్శించి పరిస్థితులను ఎందుకు చక్కదిద్దడం లేదని ప్రశ్నించింది. అధికారుల ప్రవర్తనపై ఏపీ హై కోర్టు ఆసహనం వ్యక్తం చేసింది.
రప్పా రప్పా అని చెప్పడం కాదు.. . రాత్రికి రాత్రి చేసేయాలంటూ.. పామర్రులో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి పేర్ని నానిపై రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించినా చుక్కెదురు కావడంతో పేర్ని నాని ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పై ఏపీ హైకోర్ట్ సీరియస్ అయింది. మహిళా ఎమ్మెల్యేపై ఆ వ్యాఖ్యలు ఏంటి? అని నిలదీసింది. మాజీ ఎమ్మెల్యే, మహిళా ఎమ్మెల్యేకు ఇచ్చే గౌరవం ఇదేనా?
గతేడాది ద్విచక్ర వాహన ప్రమాదాలలో 4,276 మంది మరణించడంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
సోషల్ మీడియా వేదికగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డిపై నిరాధార ఆరోపణలు, వ్యక్తిత్వ హననం చేస్తూ ట్రోల్ చేయడాన్ని ఏపీ బార్ కౌన్సిల్ ఖండించింది.
సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకే సోషల్ మీడియా కేసుల్లో రిమాండ్ విధిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ హై కోర్టు స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో అనుచిత, అభ్యంతరకర పోస్టులు, వ్యాఖ్యల కేసుల్లో నిందితులకు రిమాండ్ విధించే సమయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాలని ఏపీ హైకోర్ట్ తేల్చిచెప్పింది.
టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం)కి నకిలీ నెయ్యి సరఫరా చేసిన కేసులో భోలేబాబా డెయిరీ డైరెక్టర్లు పోమిల్ జైన్(ఏ3), విపిన్ జైన్(ఏ4), వైష్ణవి డెయిరీ సీఈవో అపూర్వ వినయ్కాంత్ చావడా(ఏ5)లకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
తిరుపతి, ఎంఆర్ పల్లి పరిధిలోని సర్వే నెంబర్లు 261/1లోని 1.50 ఎకరాలు, 261/2లోని 2.38 ఎకరాలకు సంబంధించిన భూదస్త్రాలను వారం రోజుల్లో వైసీపీ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అందజేయాలని తిరుపతి బుగ్గ మఠం అసిస్టెంట్ కమిషనర్/ఈవోను హైకోర్టు ఆదేశించింది.
టీడీపీ నేతలు జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావుల హత్య కేసు విషయంలో నిందితులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డిలపై పది రోజులపాటు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు పోలీసులను ఆదేశించింది.