Home » AP Govt
పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు పాఠశాలలో విద్యా విప్లవం సృష్టిస్తున్న స్పెషల్ గ్రేడ్ టీచర్ షేక్ ఫిరోజ్ బాషాపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అభినందనల వర్షం కురిపించారు. పిడుగురాళ్ల తుమ్మలచెరువు పాఠశాల అభివృద్ధికి షేక్ ఫిరోజ్ బాషా విశేషంగా కృషి చేస్తున్నారని వ్యాఖ్యానించారు మంత్రి నారా లోకేష్.
తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి ఏపీ హైకోర్టుని ఆశ్రయించారు. తన వివరాలను సిట్ బృందం అడగటంపై ఏపీ హైకోర్టులో సవాల్ చేశారు సుబ్బారెడ్డి.
ధూప, దీప, నైవేద్యాల కోసం 73 దేవస్థానాలకి నెలకి రూ.10వేలు చొప్పున సహాయం అందిస్తున్నామని ఏపీ మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి స్పష్టం చేశారు. దాతలు దేవస్థానాలు నిర్మించేటప్పుడు దేవాదాయ శాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి ఆదేశించారు.
మొంథా తుపాన్ వల్ల నష్టపోయిన ప్రతీ రైతుకు పరిహారం అందజేస్తామని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు భరోసా కల్పించారు. తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని వెంటనే ఆదేశాలు ఇచ్చామని అన్నారు. వైసీపీ ప్రభుత్వం రైతులని పట్టించుకోలేదని ఆరోపించారు మంత్రి అచ్చెన్నాయుడు.
ప్రజాప్రతినిధులు వారంలో ఒక రోజు ఖచ్చితంగా ప్రజావేదిక కార్యక్రమం ద్వారా అర్జీలు స్వీకరించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. నియోజకవర్గ స్థాయిలో పరిష్కారం కాని ప్రజా సమస్యలను జిల్లా స్థాయిలో, అక్కడా పరిష్కారం కానివి రాష్ట్ర స్థాయిలో పరిష్కరించాలని సూచించారు సీఎం చంద్రబాబు.
సోషల్ మీడియాలో టీడీపీ నేతలపై ముఖ్యంగా లోకేశ్, జనసేన అధినేత పవన్లపై వైసీపీ అనుకూల సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు పెడుతూ.. విమర్శలు చేశారు. ప్రత్యర్థి పార్టీల నాయకులపై వ్యక్తిగత విమర్శలు సైతం చేశారు.
గూగుల్ మ్యాప్స్తో త్వరలో ఏపీఎస్ఆర్టీసీ అనుసంధానం కానుంది. ఈ మేరకు మ్యాప్స్లో ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు సెర్చ్ చేస్తే.. ఆ రూట్లో తిరిగే ఆర్టీసీ రిజర్వేషన్ ఉన్న బస్సుల టికెట్ బుక్ చేసుకునే అవకాశం కల్పించనుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో అమరావతి డెవలప్మెంట్కి కావాల్సిన నిధులపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
బీసీసీఐ మాజీ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్కు ప్రొటోకాల్ వివాదంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ప్రొటోకాల్ వివాదంపై టీడీపీ ఎంపీ సానా సతీష్పై సీఎం అసహనం వ్యక్తం చేశారు. మరోసారి ఇలాంటి తప్పిదాలు జరగ్గకుండా చూసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
ఎన్డీయే ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. ప్రజల కోసం అన్నదాతలు నిరంతరం పనిచేస్తున్నారని తెలిపారు. తాను ఐటీని ప్రోత్సహించి ఎందరో రైతన్నల బిడ్డలను ఐటీ ఉద్యోగాల వైపు వెళ్లేలా చేశానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.