Home » AP Govt
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పంటల బీమా పోర్టల్స్ గత వారం రోజులుగా మొరాయిస్తున్నాయి. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో నమోదు చేసుకోవటానికి రాష్ట్రంలోని వరి రైతులు ప్రయత్నిస్తుండగా, పోర్టల్స్ ఓపెన్ కావట్లేదు. నేషనల్ క్రాప్ ఇన్యూరెన్స్ పోర్టల్, పీఎంఎ్ఫబీవై పోర్టల్.. ఏదీ ఓపెన్ కావట్లేదని రైతులు వాపోతున్నారు.
నైరుతి రుతుపవనాల సీజన్ మొదలై రెండున్నర నెలలు అవుతోంది. జూన్, జూలై నెలల్లో సరైన వర్షాలు కురవలేదు. వరుస అల్పపీడనాలు ఏర్పడడంతో ఆగస్టులోనైనా పరిస్థితి మారుతుందని రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ.. వారి ఆశలన్నీ ఆవిరవుతున్నాయి.
రాజధాని అమరావతికి ఎట్టకేలకు రాచబాట సిద్ధమైంది! అమరావతి నిర్మాణాల్లో అతి కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. గురువారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు ఘనంగా ప్రారంభిస్తారు.
కడప బెసిన్లో కీలక ఖనిజాల అన్వేషణకు కేంద్ర ప్రభుత్వ సంస్థ సీఎస్ఐఆర్-నేషనల్ జియాలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ)తో రాష్ట్ర గనుల శాఖ ఒప్పందం చేసుకుంది. సీఎం చంద్రబాబు సమక్షంలో గనులశాఖ, ఎన్జీఆర్ఐ ప్రతినిధులు ఒప్పందపత్రాలపై బుధవారం సంతకాలు చేశారు.
రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేలా పారిశ్రామిక సంస్థలకు ఇచ్చే ప్రోత్సాహకాలను ఈ ఏడాది డిసెంబరు నుంచి ఎస్ర్కో ఖాతాలో జమ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరు కావడంలేదని, సభకు రానివాళ్లు ఎమ్మెల్యేలుగా ఎందుకని, అలాంటివారికి జీతాలు ఎందుకు ఇవ్వాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. బుధవారం అమరావతి అసెంబ్లీ ప్రాంగణంలోని తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
‘‘హద్దులు మీరే సంఘ విద్రోహ శక్తులు, రాజకీయ ముసుగు వేసుకున్న నేరగాళ్లకు చెక్ పెట్టాల్సింది మీరే. ఏపీలో ఎక్కడ చిన్న నేరం చేసినా సీసీ కెమెరాలు, డ్రోన్లకు దొరికి పోతామన్న భయం నేరస్థుల్లో కలగాలి. అభివృద్ధికి శాంతిభద్రతలు కీలకం. ప్రజలు ప్రశాంతంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.
గ్రూప్-1 పరీక్షలు రాయాలంటే.. అర్హత డిగ్రీ ఉండాలి. కానీ మెయిన్స్ జవాబుపత్రాల మూల్యాంకనం ఎవరితో చేయించారో తెలుసా..? టెన్త్, ఇంటర్ చదివిన వారితో, సెక్యూరిటీ గార్డులు, గృహిణులతో కానిచ్చేశారు.
బీచ్శాండ్ మినరల్స్కు ప్రాధాన్యమిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. దేశ, రాష్ట్రాభివృద్ధికి ఉపకరించేలా రేర్ ఎర్త్ మినరల్స్ అభివృద్ధి సాధిస్తాయని పేర్కొన్నారు.
ముంబై సినీ నటి కాదంబరీ జెత్వానీ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కృష్ణ జిల్లా సీఐడీ కోర్టుకు కుక్కల విద్యాసాగర్ బుధవారం హాజరయ్యారు.