Home » AP Govt
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని సాయికృష్ణ కుటుంబసభ్యులు కలిశారు. తమకు న్యాయం చేయాలంటూ ముఖ్యమంత్రిని సాయికృష్ణ తల్లి కోరారు.
ఏపీ మంత్రి నారా లోకేశ్ కృషితో విశాఖ విమల విద్యాలయానికి పూర్వవైభవం వచ్చింది. 2024లో RINL ఆర్థికసాయం నిలిపివేతతోఈ స్కూలు మూతపడింది. లోకేశ్ చొరవతో రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలోకి పాఠశాల వచ్చింది.
అన్నదాత సుఖీభవ మొదటి దశ నిధులను ఈనెల 20వ తేదీన విడుదల చేస్తామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. 45.5 లక్షల మంది రైతులకు కేంద్ర సాయంతో కలిపి రూ.12వేలు జమ చేస్తామని స్పష్టం చేశారు.
కూటమి ప్రభుత్వం పేదలందరికీ ఇళ్లు అందించడమే లక్ష్యంగా పనిచేస్తోందని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు ఎప్పుడూ పేదల గృహ నిర్మాణానికి ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో మహిళలను వైసీపీ నాయకులు చిన్నచూపు చూస్తున్నారని ధ్వజమెత్తారు.
కోస్తాతీర ప్రాంతాల్లో గ్రీన్ బెల్ట్ అభివృద్ధిపై ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించారు. గురువారం నాడు ఏపీ సచివాలయంలో సామాజిక అడవుల పెంపకానికి తీసుకోవాల్సిన చర్యలపై అటవీ శాఖ అధికారులతో పవన్ సమావేశమయ్యారు.
సాయికృష్ణ ఘటనపై ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజుపై చర్యలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ క్రమంలో సీఐ నాగరాజును సస్పెండ్ చేయాలని పోలీస్ ఉన్నతాధికారులకు హుకుం జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్లో తీర ప్రాంత పర్యాటకాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ‘బీచ్ షాక్స్’ పేరుతో మార్గదర్శకాలు విడుదల చేసింది. ఎక్సైజ్ శాఖ జారీ చేసిన జీవో నంబర్ - 362 ప్రకారం, ఎంపిక చేసిన బీచ్లలో పరిమిత నిబంధనలతో ఈ షాక్స్ ఏర్పాటు చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీసు శాఖలో కీలక స్థాయిలోని అధికారుల బదిలీలు, కొత్త నియామకాలు చేపట్టింది. పలువురు అదనపు ఎస్పీలు, డిప్యూటీ కమిషనర్లు (డీసీపీలు), నాన్-కేడర్ ఎస్పీలకు కొత్త పోస్టింగ్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అనుమతి లేకుండా ఫీడ్ ధరలు పెంచితే ఊరుకునేది లేదని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరించారు. అనుమతి లేకుండా ఫీడ్ ధరలు పెంచడాన్ని నిలిపివేశామని స్పష్టం చేశారు.