Home » AP Govt
ఆంధ్రప్రదేశ్లో 30 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర కేబినెట్ శుభవార్త చెప్పింది. ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఏపీలో క్రికెట్ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ని నిర్వహిస్తున్నామని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు శివనాథ్(చిన్ని) వ్యాఖ్యానించారు. ఐపీఎల్ తరహాలో తీసుకెళ్లడానికి ప్రభుత్వం, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ భారీ ఏర్పాట్లు చేస్తున్నాయని పేర్కొన్నారు.
ఏపీలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు ఒక కీలకమైన విషయాన్ని గుర్తించారు.
పీజీఆర్ఎస్ అర్జీలను మానవీయ కోణంలో పరిష్కరించాలని అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. అర్జీదారుల స్థానంలో ఉండి ఫిర్యాదులను పరిష్కరించే దిశగా దృష్టి సారించాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ బదిలీకి కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. యువజన, అభ్యుదయ, పర్యాటక & సాంస్కృతిక శాఖ పరిధి నుంచి సైన్స్, టెక్నాలజీ & ఇన్నోవేషన్ శాఖకు అకాడమీని బదిలీ చేసింది.
రెండేళ్ల పాలన గురించి ప్రజలకు ఎప్పటికప్పుడు వివరించాలనేది ముఖ్యమంత్రి అభిమతమని.. దానిలో భాగంగా వరుస కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు.
నెల్లూరు జిల్లాలోని ఏఎస్పేట దర్గా నిర్వహణకు సంబంధించిన అంశంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ దర్గా నిర్వహణలో జరుగుతున్న పరిణామాలపై సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. యోగా అనేది భారతదేశ నాగరికతా జీవన విధానంలో ఒక అంతర్భాగమని వ్యాఖ్యానించారు.
ఆర్థిక, అంత్యోదయ విధానంతో ముందుకెళ్తున్నామని ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. పేదరికాన్నీ నిర్ములించడానికి మోదీ సర్కార్ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిందని పేర్కొన్నారు.
ఏబీఎన్ – ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, కొలుసు పార్థసారథి, టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు శుభాకాంక్షలు తెలిపారు. మీడియా రంగంలో ఆర్కే చేసిన సేవలను గుర్తుచేస్తూ నేతలు ప్రశంసలు కురిపించారు.