Home » AP Govt
రాజ్యసభలో ఏపీ మెగా డీఎస్సీ అంశాన్ని ప్రస్తావించి రభస చేయడానికి వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రయత్నించారు. గురువారం రాజ్యసభలో యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చ జరగగా వైసీపీ తరఫున వైవీ సుబ్బారెడ్డి మాట్లాడారు.
మాజీ సీఎం జగన్ శ్రీకాకుళం పర్యటనలో పరామర్శలు ఉంటాయని అంతా భావించారు. యాక్సిడెంట్ ఘటనలో కుమారుడిని కాపాడటానికి కుట్ర చేసిన కేసులో జైలుకు వెళ్లిన వైసీపీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును జగన్ పరామర్శిస్తారని వైసీపీ నేతలు కూడా ప్రకటించారు.
ఏపీలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ(సర్) - 2026 ప్రక్రియలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేయనుంది.
భూసేకరణ విషయంలో విస్తృత ప్రజా ప్రయోజనం, వ్యక్తిగత ప్రయోజనం మధ్య సంఘర్షణ ఉన్నప్పుడు విస్తృత ప్రజా ప్రయోజనానికే ప్రాధాన్యత ఉంటుందని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. చిన్నస్థలం అయినప్పటికీ ఆ భూమిని సేకరించే విషయంలో చట్టంలో నిర్దేశించిన విధానాన్ని అనుసరించాల్సిందేనని స్పష్టం చేసింది.
చరిత్రాత్మక ఆంధ్రా విశ్వవిద్యాలయానికి వైస్ చాన్సలర్ హోదాలో ఉంటూ.. గత ప్రభుత్వంలో స్థాయిని మరచి వైసీపీ కార్యకర్తలా వ్యవహరించిన ప్రొఫెసర్ పీవీజీడీ ప్రసాదరెడ్డి అడ్డంగా దొరికిపోయారు. ఆయన చేసిన అక్రమాలన్నీ ఆధారాలతో బయటపడ్డాయి.
యూనివర్సిటీల్లో పరిపాలనా వ్యవహారాలపై నిర్ణయాలు తీసుకునే ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్లను ప్రభుత్వం రద్దు చేసింది. రాష్ట్రంలోని మొత్తం 18 యూనివర్సిటీలలోని మండళ్లను రద్దుచేస్తూ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. త్వరలో మండళ్లు, వాటి సభ్యుల పదవీకాలం ముగియనుంది.
నాలుగు నెలల నైరుతి రుతుపవనాల సీజన్లో సగం కాలం గడిచిపోయింది. దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీవర్షాలు కురుస్తుండగా దక్షిణ భారతంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మాత్రం వర్షం కోసం ఎదురుచూస్తోంది.
ఎల్నినో ప్రభావంతో వర్షాలు ముఖం చాటేసిన వేళ.. ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. ఓవైపు కృష్ణమ్మ, మరోవైపు గోదావరి వరద ప్రవాహం రాష్ట్రంలోకి తరలివస్తోంది. కృష్ణమ్మ తరలి రావడంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి నీటి చేరిక ప్రారంభమవగా.. గోదావరి వరద ప్రవాహం మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకుంటోంది.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంపై జగన్ది ఆది నుంచీ అడ్డుపుల్ల వేసే ధోరణే! అసలు కొత్త ఎయిర్పోర్టు అవసరమా? ‘విశాఖలో ఒకటి ఉందికదా! ఎర్రబస్సు రాని ఊర్లో ఎయిర్పోర్టు కడతారా?’... అంటూ ఎద్దేవా చేశారు. కోర్టుకు పోతాం, కేసులు వేస్తాం! అని బహిరంగ సభల్లో ప్రకటించారు.
స్వచ్ఛ ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్ను మరో సౌదీ అరేబియాగా మార్చాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి లోకేశ్ అన్నారు.