Home » AP Govt
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం దేవస్థానంలో నెయ్యి కల్తీ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ పరిణామాలపై ప్రస్తుత దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు ఆళ్ల అనీల్, దేవకి వెంకటేశ్వర్లు తీవ్రమైన ఆరోపణలు చేస్తూ సిట్ విచారణకు డిమాండ్ చేశారు.
శ్రీవారి లడ్డూ కల్తీ విషయంలో అనుమానాలపై వాస్తవాలు చెబుతున్నామని ఏపీ ఆర్థిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. వేంకటేశ్వర స్వామి లడ్డూ గట్టిగా ఉందని, సువాసన లేదని భక్తులు ఫిర్యాదు చేశారని తెలిపారు..
తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ విషయంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సున్నిత అంశంపై చాలా ఆలోచించి మాట్లాడాలని తెలిపారు. ఎన్డీడీబీ రిపోర్ట్ సీఎం చంద్రబాబు తమకు చదివి వినిపించారని ప్రస్తావించారు.
బడ్జెట్ కసరత్తులో భాగంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వరుసగా ప్రీ-బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు ఐదు శాఖలకు చెందిన మంత్రులతో సమావేశాలు పూర్తయ్యాయి.
కేవలం ఒక వారంలోనే రెండు ప్రపంచ స్థాయి వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవడం ద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నూతన ఉత్తేజాన్ని అందించారని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ప్రధానికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
ఏపీలో అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారంటూ వస్తున్న ఫిర్యాదులపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. కాకినాడ జిల్లాతోపాటు రాష్ట్రం నలుమూలల నుంచి ఈ తరహా ఫిర్యాదులు వస్తున్నాయని ప్రస్తావించారు.
వైసీపీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని, అలజడులు సృష్టించాలని ప్లాన్ చేస్తోందని సీనియర్ మంత్రులు విమర్శించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలతో జరిపిన టెలీకాన్ఫరెన్స్లో వైసీపీ ట్రాప్లో పడొద్దని టీడీపీ నేతలకు సూచించారు.
సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలపై బీజేపీ రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా అంబటి వ్యాఖ్యలు ఉన్నాయని ధ్వజమెత్తారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో శాంతిభద్రతలు ఉన్నాయా లేదా అనేది కేంద్ర ప్రభుత్వానికి తెలుసన్నారు.
మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత జోగి రమేశ్పై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీ మంత్రి నారా లోకేశ్పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టేలా వ్యాఖ్యలు చేయడంపై ఈ కేసు నమోదైంది.