Home » AP Govt
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో పూడి శ్రీహరి, గిరీశ్ కుమార్ రెడ్డిలకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అనిల్ చంద్ర పునేఠా నియామకానికి ఆమోదం లభించింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆమోద ముద్ర వేశారు.
ఏపీలో జనగణన కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని పూర్తిగా డిజిటల్ పద్ధతిలో నిర్వహిస్తు్న్నారు. స్వీయ జనగణనలో సీఎం నారా చంద్రబాబు తన వివరాలను నమోదు చేసుకున్నారు.
ఏపీలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలవరం, వెలిగొండ, హంద్రీనీవా సుజల స్రవంతి, పోలవరం-నలమల్ల సాగర్ లింక్, చింతలపూడి ఎత్తిపోతల, వరికపూడిశెల, ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల పనులను సమీక్షించారు.
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు నిర్వహించిన పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన ఎన్టీఆర్ మహిళా జూనియర్, డిగ్రీ కాలేజ్ విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. అన్ని విభాగాల నుంచి పదుల సంఖ్యలో విద్యార్థులు అత్యధిక మార్కులు, టాప్ ర్యాంకులతో ప్రతిభ కనబరచడం తనకెంతో సంతోషాన్ని కలిగించిందని వ్యాఖ్యానించారు.
కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలను నిర్వహిస్తున్నట్లు ఏపీ మంత్రి కందుల దుర్గేశ్ వ్యాఖ్యానించారు. 2027లో వచ్చే గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారని తెలిపారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధానికి మావిగన్ పేరుతో, ప్రజలనీ తప్పు దోవ పట్టిస్తున్నారని.. ఆయనకు మతిస్థితం లేదని ఎద్దేవా చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఉండవల్లిలోని నివాసంలో ఎన్డీఏ కూటమి పార్టీల అత్యున్నత స్థాయి సమావేశం బుధవారం సాయంత్రం జరగనుంది.
విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థుల బృందం ఎవరెస్ట్ శిఖరారోహణకు వెళ్లడం దేశ చరిత్రలోనే ఇది మొదటిసారని నారా లోకేశ్ తెలిపారు. సవాళ్లను అధిగమించి ప్రపంచాన్ని జయించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
ప్రపంచ క్వాంటం దినోత్సవాన్ని పురస్కరించుకుని క్వాంటం నూతన అధ్యాయం ఏపీలో ఆవిష్కృతమైందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీలోని 1ఎస్ ఓపెన్ యాక్సెస్ క్వాంటం ఫెసిలిటీ సహా, మేధా టవర్స్లోని 1 క్యూ క్వాంటం ఫెసిలిటీని ప్రారంభించామని పేర్కొన్నారు.