Home » AP Govt
పీపీపీ మోడ్ అంటే అమ్మడం కాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీలపై వైసీపీ కోటి సంతకాలు చేసుకుంటారా.. లేదా ఐదు కోట్ల సంతకాలు చేసుకుంటారో వారి విచక్షణకే వదిలేస్తున్నామని రఘురామ విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల DA విడుదలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన GO నంబర్ 60, 61 లలో మార్పులు చేస్తూ.. జీవో 62 రిలీజ్ చేసింది చంద్రబాబు సర్కారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు హర్షం..
2024 జనవరి 1 నుంచి డీఏను 3.64% పెంచుతూ ఆదేశాలు ఇచ్చింది. డీఏ పెంపు 2024 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుబ్బానాయుడు మృతి పార్టీకి తీరని లోటు అని మంత్రి నారాయణ తన ఆవేదన వ్యక్తం చేశారు. సుబ్బానాయుడు కుటుంబ సభ్యులు, బంధువులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
పెట్టుబడులపై ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో అమరావతి- విశాఖపట్నంలో జరుగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ(ఆదివారం) ఏపీ సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.
టీటీడీ ట్రస్టులో కూడా బంజారాలకు అవకాశం కల్పించాలని బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ కోరారు. హాథిరాంజీ బాబా మఠానికి చెందిన భూములు అన్యాక్రాంతం అయ్యాయని ఈటల రాజేందర్ ఆరోపించారు.
దీపావళి.. చెడుపై విజయానికి సూచిక.. చీకట్లు తొలగించి వెలుగులు అందించే పండగ.. గత వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనతో చీకట్లు కమ్ముకున్నాయి.. కూటమి ప్రభుత్వంలో ఎన్నో కొత్త వెలుగులు వచ్చా యి. పింఛన్ల పెంపు నుంచి ఉచిత గ్యాస్, ఫ్రీబస్, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఆటో డ్రైవర్ల సేవ లో, విద్యుత బిల్లుల తగ్గింపుతో పేద, మధ్యతరగతి ప్రజల జేబుల్లో కాసులు గలగలలాడుతున్నాయి. అటు కొత్తరేషన కార్డులు, పాస్ పుస్తకాల జారీ. గుంతల్లేని రహదారులు, ఇటు అభివృద్ధి, అటు పె
కేఎల్ యూనివర్సిటీ నుంచి లాంచ్ అవుతున్న శాటిలైట్లు వాతావరణం, ఓజోన్ పొర, హెల్త్ ఇలా వివిధ అంశాలకు సంబంధించి డేటా అందిస్తాయని భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. ప్రధాని మోదీ వికసిత్ భారత్, సీఎం చంద్రబాబు విజన్ ఆంధ్ర.. కలిసి మంచి ఫలితాలు ఇస్తున్నాయని పేర్కొన్నారు.
సంత్రగచ్చి - చర్లపల్లి రైల్వే స్టేషన్ల మధ్య కదులుతున్న రైల్లో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి అర్బన్ మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన మహిళ(35)పై నిందితుడు జొన్నలగడ్డ రాజారావు అత్యాచారంచేశాడు. వివరాళ్లోకి వెళ్తే.. సోమవారం రాత్రి రాజమండ్రి స్టేషన్లో సంత్రగచి స్పెషల్ రైల్లోని మహిళా బోగీలో ఎక్కింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ఉద్యోగ సంఘాలతో ఏపీ సచివాలయంలో సమావేశం కానున్నారు. ఉద్యోగ సంఘాలతో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు సీఎం చంద్రబాబు.