Home » AP Govt
జగన్ హయాంలో వేధింపులు, కక్ష సాధింపులతో పాలన పతనావస్థకు చేరిందని ఏపీ హోంమంత్రి అనిత విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఏపీ పారిశ్రామిక అభివృద్ధి పరంగా ముందుకు దూసుకెళ్తుందని వెల్లడించారు.
డీఎస్సీ నిర్వహణకు సంబంధించిన ప్రక్రియపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. సుమారు 2,500 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేయాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది.
గత వైసీపీ ప్రభుత్వంలో నాటి సీఎం జగన్ మోహన్ రెడ్డి ఫొటోలతో భూమి హక్కు పత్రాల పంపిణీ చేశారని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. నాటి ప్రభుత్వ చర్యలపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారని అన్నారు. తాము అధికారంలోకి రాగానే రీ సర్వే చేసి తప్పులను సరిదిద్ది కొత్త పాసుపుస్తకాలు ఇస్తామని హామీ ఇచ్చామని ప్రస్తావించారు.
బ్యాంక్ ఆఫ్ బరోడా తాజా నివేదికలో పెట్టుబడుల సాధనలో దేశంలోనే ఏపీ నెంబర్ వన్గా నిలిచింది. ఈ నివేదికను ప్రస్తావిస్తూ సామాజిక మాధ్యమం ఎక్స్లో మంత్రి నారా లోకేశ్ ట్వీట్ పెట్టారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నదీజలాల వినియోగంలో నెలకొన్న వివాదాల పరిష్కారానికి సంబంధించిన కమిటీని ఇవాళ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం.. సహకార సమాఖ్య విధానంతో.. గత 11 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాల పరిష్కారానికి సంపూర్ణ సహకారాన్ని అందిస్తోందని పేర్కొన్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో అమరావతిని పట్టించుకోలేదని ధ్వజమెత్తారు.
కంకిపాడు నుంచి గుడివాడ వరకు గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదన చేశామని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. ఆయా ప్రాజెక్టులు ఆలస్యం అవుతున్నాయంటే దానికి అనేక కారణాలు ఉన్నాయని పేర్కొన్నారు.
శంకర్ విలాస్ ఆర్ఓబీ పనులపై కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఆర్ఓబీ పనులపై ఎవరూ అపోహలకు గురి కావద్దని అన్నారు. సకాలంలో బ్రిడ్జి నిర్మాణం పూర్తి అవుతుందని స్పష్టం చేశారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంపై తెలుగుదేశం పార్టీ విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ ఏడాది ఉత్తరాంధ్ర అభివృద్ధి చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలవబోతోందని వ్యాఖ్యానించారు.
న్యూఇయర్ వేడుకల సందర్భంగా బుధవారం మందుబాబులు అరుదైన రికార్డు సృష్టించారు. డిసెంబర్ 31వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం విక్రయాలు గణనీయంగా పెరిగాయి.