Home » AP Govt
తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటింటికీ కార్యక్రమంలో కూటమి పార్టీలు రికార్డు సృష్టించాయి. 5 రోజుల్లో 12 లక్షల ఇళ్లను సందర్శించడం ద్వారా ఈ రికార్డు సృష్టించారు.
వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్కు సంకెళ్లు వేసినట్లు ఆయన అభ్యంతరకర వీడియోను రూపొందించి సోషల్ మీడియాలో పోస్టు చేశారని టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పునేఠా ఈ నెల 6న మున్సిపల్, పంచాయతీరాజ్ అధికారులతో భేటీ కానున్నారు. స్థానికసంస్థల ఎన్నికలకు సంబంధించిన కసరత్తు ప్రారంభించేలా దిశానిర్దేశం చేయనున్నారు.
రాష్ట్రంలోని పండ్ల తోటలపై ఎల్నినో తీవ్ర ప్రభావం చూపుతోంది. రుతుపవన వర్షాలు కురవక, భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టి నీటి తడులు అందించడం కష్టంగా మారుతోంది. పొడి వాతావరణం కారణంగా తోటలు ఎండుముఖం పడుతున్నాయి.
విజయవాడ ఎన్టీఆర్ పోలీసు కమిషనర్ ఎస్వీ రాజశేఖర్బాబుపై ఆధారరహిత ఆరోపణలు ప్రచురించినట్లు పేర్కొంటూ సాక్షి దినపత్రిక ప్రచురణకర్త, రెసిడెంట్ ఎడిటర్, రిపోర్టర్తో పాటు ప్రచురణకు బాధ్యులైన ఇతరులపై కోర్టులో ఫిర్యాదు దాఖలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది.
అధికమాసం కారణంగా తిరుమలలో ఈ ఏడాది శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఇందుకు సంబంధించి టీటీడీ అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు.
రాష్ట్రంలో 2019-24 కాలంలో వైసీపీ ప్రభుత్వం సాగించిన ప్రాజెక్టుల విధ్వంసాన్ని సరిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. జగన్ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా శిథిలావస్థకు చేరిన ఎత్తిపోతల పథకాలను తిరిగి గాడినపెట్టనున్నారు.
రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ ప్రవేశ పరీక్షకు సంబంధించి మొదటి 50 మంది ర్యాంకర్ల పేర్లతో జాబితాను ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ సిద్ధం చేసింది.
ప్రజలు ఛీకొట్టినా జగన్ తీరు మాత్రం మారడం లేదని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందడం జగన్ లాంటి నేర మనస్తత్వం ఉన్న రాజకీయ నాయకులకు ఏమాత్రం ఇష్టం ఉండదన్నారు.
13 వేలమంది గిరిజన బాలికలతో ప్రదర్శించిన థింసా నృత్యం గిన్నీస్ బుక్ అఫ్ రికార్డ్సులో చోటు దక్కించుకుంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా థింసా నృత్య ప్రదర్శనను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.