Home » AP Govt
విశాఖ ఉక్కుపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ వ్యాఖ్యానించారు. కేంద్రం పాలసీకి విరుద్ధంగా రాష్ట్ర ప్రజలు సెంటిమెంట్, రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి మేరకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ (APTS) చైర్మన్ మన్నవ మోహన కృష్ణ ఆధ్వర్యంలో వినూత్నంగా వివిధ శకటాలతో భారీ ర్యాలీ నిర్వహించారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలోని ఐదేళ్లలో ఏపీ భయాన్నే చూసిందని విమర్శలు చేశారు. వైసీపీ హయాంలో ప్రజలు భయం గుప్పెట్లో బతికారని ఆరోపించారు.
దేశ భక్తి లేని వారు.. ఈదేశం విడిచి వెళ్లిపోతేనే మంచిదని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. దేశానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా దేశ ద్రోహే అవుతారని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 233, 234వ ఎస్ఎల్బీసీ సమావేశం శుక్రవారం జరిగింది. ఏపీ సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో అధికారులకు సీఎం చంద్రబాబు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు.
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ విచారణలో సిట్ అధికారులు వేగం పెంచారు. రిమాండ్ ఖైదీలుగా ఉన్న నిందితులను విచారించడం ద్వారా ఈ కుంభకోణంలో ఎవరెవరి హస్తం ఉంది, నిధుల మళ్లింపు ఎలా జరిగింది అనే కోణంలో సిట్ అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో నిందితులకు సుప్రీంకోర్టులో గట్టి షాక్ తగిలింది. ట్రయల్ కోర్టు మంజూరు చేసిన డీఫాల్ట్ బెయిల్ను రద్దుచేస్తూ.. హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. పాఠశాలల్లో టీచర్లు, స్టూడెంట్స్ మధ్య రిలేషన్పై అంతర్గతంగా కెరీర్ గైడర్స్ సర్వే చేస్తోంది. ఈ సర్వేలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన కొనసాగుతోంది. రెండో రోజు పర్యటనలో పలువురు పారిశ్రామిక వేత్తలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఏపీకి కావాల్సిన పెట్టుబడులపై సీఎం సుదీర్ఘంగా చర్చించారు..
విశాఖపట్నం ప్రజలకు, ఎన్డీఏ కూటమికి అవినాభావ సంబంధం ఉందని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. హెల్దీ, వెల్తీ, హ్యాపీనే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమని పేర్కొన్నారు.