Home » AP Govt
నకిలీ మద్యం కేసులో దర్యాప్తులో పలువురి పాత్రపై ఆధారాలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో నిందితుల జాబితా పెరుగుతోంది. ప్రస్తుతం నిందితుల సంఖ్య 23కు చేరింది.
హైవేపై ఎటువంటి గుమిగూడటం గాని సమావేశాలు నిర్వహించడానికి గాని అనుమతి లేదని డీఎస్పీ సీహెచ్.రాజా తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో హైవేపై వాహన రాకపోకలు, ప్రజా జీవనానికి ఎటువంటి అంతరాయం కలిగించరాదని పేర్కొన్నారు.
విశాఖలోని ఆరిలోవ, అడవివరం, మాధవధార, అక్కయ్యపాలెం, హెచ్బీ కాలనీ, అల్లిపురం, ఎండాడ, భీమిలిలో స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
ఏపీకి పెట్టుబడులు ఆహ్వానించేందుకు లండన్ పారిశ్రామికవేత్తలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరుసగా సమావేశాలు నిర్వహించారు. లండన్లో ఆక్టోపస్ ఎనర్జీ ఇంటర్నేషనల్ డైరెక్టర్ క్రిస్ ఫిట్జ్గెరాల్డ్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు.
గ్రూప్-1 వివాదంపై ఏపీ హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. గ్రూప్-1 జవాబు పత్రాలను హాయ్ల్యాండ్కు తరలించాలనే నిర్ణయం ఎవరిదని ప్రశ్నించింది న్యాయస్థానం. ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీకి ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
వందేమాతరానికి 150 సంవత్సరాలు అయినందున ప్రత్యేక కార్యక్రమం నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. నవంబరు 7వ తేదీన దేశవ్యాప్తంగా అందరూ ఒక నిర్ణీత సమయంలో వందేమాతరం గేయం పాడాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
కృత్రిమ మేధస్సు ద్వారా వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. కుంకీ ఏనుగుల నుంచి కృత్రిమ మేధస్సు వరకు.. ప్రజలు, వన్యప్రాణుల కోసం ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టడంలో ఏపీ ముందంజలో ఉందని ఉద్ఘాటించారు పవన్ కల్యాణ్.
అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో డిసెంబర్ నెలలో మిట్టల్ ఉక్కు పరిశ్రమకు భూమి పూజ జరగబోతోందని భూపతి రాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే భారతదేశం నాలుగో ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారిని కర్లపాలెం వాసులుగా తెలిపారు. బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ బంధువులుగా పేర్కొన్నారు. ఎమ్మెల్యే కుమారుడి సంగీత్ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుందని తెలిపారు.
బాహుబలి రాకెట్ LVM3 ప్రావీణ్యం చాటిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. LVM3-M5 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం, మన దేశానికి గర్వకారణమని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.