Home » AP Govt
రాష్ట్ర జీవన రేఖ పోలవరం ప్రాజెక్టు కోసం భూములిచ్చి నిర్వాసితులైన కుటుంబాలకు రాష్ట్రప్రభుత్వం భారీ ఊరట కల్పించింది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం రైల్వేజోన్ విషయంలో వైసీపీ క్రెడిట్ చోరీకి పాల్పడుతోందని ధ్వజమెత్తారు.
‘సీఎం చంద్రబాబు నాయుడు వస్తున్నారని తెలిసినా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా? కనీసం యాక్షన్ ప్రణాళిక రూపొందించరా?’ అంటూ నరసన్నపేట పంచాయతీ ప్రత్యేకాధికారి, ఎంపీడీవో వెంకటేష్ ప్రసాద్, ఈవో ద్రాక్షాయణిపై కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర విద్యాశాఖలోని విప్లవాత్మక మార్పుల ప్రభావం.. తాజా పదో తరగతి ఫలితాల్లో స్పష్టంగా కనిపించిందని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సైతం గ్లోబల్ స్థాయిలో పోటీ పడే సత్తాను సాధించారని ప్రశంసించారు.
ఎస్.కోటలో పేదలకు చెందిన 1166 ఎకరాలను ప్రభుత్వం జెఎస్డబ్ల్యూ(జిందాల్)కు ఇచ్చింది. ఆ భూముల్లో అల్యూమినియం పరిశ్రమ పెడతామని యాజమాన్యం చెప్పింది. 2006లో భూములు అప్పగించగా నేటికీ పరిశ్రమ ఏర్పాటు చేయలేదు.
కొత్తవలస ఉమా జూట్ మిల్లును యాజమాన్యం మూడు నెలలు పాటు షట్డౌన్ చేస్తూ ప్రకటించింది. మిల్లులో ఉత్పత్తికి ముడిసరుగా ఉన్న జనపనారకు తీవ్ర కొరత ఏర్పడిందని పేర్కొంది. ఈ కారణంగానే షట్డౌన్ అమలు చేస్తున్నట్టు తెలిపింది.
రైల్వేశాఖ పరంగా ఉత్తరాంధ్ర ప్రజల కల నెరవేరింది. దశాబ్దాలుగా విశాఖ రైల్వేజోన్(సౌత్ కోస్ట్) ఏర్పాటు చేయాలన్న డిమాండ్కు గ్రీన్సిగ్నల్ వచ్చింది. కూటమి ప్రభుత్వం చొరవతో కేంద్రం సానుకూలంగా స్పందించడంతో.. విశాఖ జోన్ ఏర్పాటుకు రైల్వేశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్పై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు..
మన రాష్ట్రంలో భారీగా ఇనుప ఖనిజం నిల్వలు ఉన్నట్లు గనుల శాఖ నిర్ధారించింది. రాష్ట్రాన్ని స్టీల్ హబ్గా మార్చేలా 17 బ్లాక్ల పరిధిలో 2.40 లక్షల కోట్ల విలువైన 2,700 మిలియన్ టన్నుల నిల్వలున్నట్లు స్పష్టం చేసింది.
దక్షిణ భారతదేశంలో ఎయిర్ కండిషన్ల తయారీ కేంద్రంగా శ్రీసిటీ రూపుదిద్దుకుంది. ప్రస్తుతం డైకిన్, ఎల్జీ, హ్యావెల్స్, బ్లూస్టార్, అంబర్ ఎంటర్ ప్రైజెస్, హైసెన్స్, థెర్మాక్స్, వంటి ప్రముఖ సంస్థలతో పాటు నైడెక్, పానాసోనిక్, లైఫ్ సెల్యూషన్, అథెలా ఎలక్ట్రానిక్స్, ఈప్యాక్ సహా మొత్తం 32 విడి భాగాల సరఫరా కంపెనీలు ఇక్కడ ఏర్పాటు కావడంతో దేశంలోనే అతిపెద్ద ఏసీల తయారీ హబ్గా శ్రీసిటీ మారబోతోంది.