Home » AP Govt
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో ఏపీని గంజాయి మయంగా మార్చారని ధ్వజమెత్తారు.
నేడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో ఏపీ భవిష్యత్తుకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
అనకాపల్లిలోని ఉపమాక ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. ఉపమాక శ్రీ వేంకటేశ్వర స్వామిని హోం మంత్రి అనిత సోమవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నెల్లూరు జిల్లా నాయుడుపేట అర్బన్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు ఆదివారం మెరుపు సోదాలు నిర్వహించారు. లంచం తీసుకుంటూ పోలీసు సిబ్బంది రెడ్ హ్యాండెడ్గా పట్టుబడటం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో రాజకీయ ప్రయోజనాల కోసం విద్యుత్ రంగాన్ని నాశనం చేశారని ధ్వజమెత్తారు.
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడు జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న వెంకటేశ్వరరెడ్డి అద్భుతమైన కృషిని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ప్రశంసించారు.
'మన్ కీ బాత్' కార్యక్రమంలో అనంతపురం జిల్లా వాసుల జలసంరక్షణ చర్యలను ప్రస్తావించడంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఏడాది తిరిగి మొదటిసారి చేపట్టిన మన్ కీ బాత్లో అనంతపురం ప్రజలు నీటి సంరక్షణలో చేసిన స్ఫూర్తిదాయకమైన ప్రయత్నాలను హైలైట్ చేశారని సీఎం వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం ఆదివారం ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో టీడీపీ ఎంపీలకు చంద్రబాబు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం ఏపీలో విధ్వంసం మాత్రమే చేసిందని ఆరోపణలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గన్నవరం విమానాశ్రయంలో కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘవాల్తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.