Home » AP Assembly Sessions
ఏపీ శాసనమండలిలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై వైసీపీ ఎమ్మెల్సీలు చేసిన వ్యాఖ్యలపై మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
గ్రామ, వార్డు సచివాలయాల చట్ట సవరణ బిల్లుకు ఏపీ శాసనసభలో ఆమోదముద్ర పడింది. గ్రామ, వార్డు సచివాలయాలను స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డులుగా మారుస్తూ చట్ట సవరణ బిల్లును మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ పథకం నిలిపివేయడంపై వైసీపీ ఎమ్మెల్సీ ఆగ్రహం వ్యక్తం చేయగా.. రాయలసీమ అంశంపై మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఏపీ శాసనమండలిలో వైసీపీ సభ్యులు, మంత్రుల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. రాయలసీమ లిఫ్ట్ విషయంలో తప్పంతా వైసీపీదే అని మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు.
ఏపీ శాసనమండలిలో వైసీపీ సభ్యుల ఆందోళనలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు మీదకు వైసీపీ ఎమ్మెల్సీలు దూసుకెళ్లారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో వివిధ సమస్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇచ్చారు.
హెరిటేజ్కి.. వీఎస్ఆర్ ఏవియేషన్కి ఎలాంటి సంబంధం లేదని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. మాజీ మంత్రి వివేకారెడ్డిని చంపి ఆ కత్తి తమ చేతిలో పెట్టారని.. ఇప్పుడు కూడా వీఎస్ఆర్ ఏవియేషన్పై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు అలాంటివేనని ధ్వజమెత్తారు.
ఏపీ శాసనమండలిలో ఆడబిడ్డ నిధి పథకంపై వైసీపీ ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమాధానం ఇచ్చారు. ఆడబిడ్డ నిధి పథకం ప్రభుత్వ పరిశీలనలో ఉందని మంత్రి తెలిపారు.
నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయం ఏర్పాటుపై ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేశ్ సమాధానం ఇచ్చారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చామని, క్లస్టర్ ఆధారంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు.
ఏపీ శాసనసభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో పొరుగు సేవల ఉద్యోగుల సమస్యలపై ఎమ్మెల్యే గల్లా మాధవి అడిగిన ప్రశ్నకు మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి సమాధానం ఇచ్చారు.