Home » AP Assembly Sessions
వైసీపీ.. వాకౌట్ అండ్ టాకౌట్ పార్టీగా మారిందని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఎద్దేవా చేశారు. జగన్ అండ్ కో నిజస్వరూపం ఇప్పడు రాయలసీమ ప్రజలందరికీ తెలిసిపోయిందన్నారు..
లైన్మెన్ల నియామకంపై ఏపీ శాసనమండలిలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా మండలి సభ్యులు, ఆలపాటి రాజా, కావలి గ్రీష్మ, బీటీ నాయుడు అడిగిన ప్రశ్నకు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సమాధానం ఇచ్చారు..
ఏపీ శాసనమండలిలో వైసీపీ సభ్యుల తీరుపై పంచుమర్తి అనురాధ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బడ్జెట్ సెషన్ అంతా గాలికి వదిలేసి చర్చ జరగకుండా చేశారని మండిపడ్డారు.
పోలవరం - నల్లమల సాగర్ లింకు ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం లేదని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గోదావరి నుంచి సముద్రంలోకి వృథాగా వెళ్లే వరద జలాలను ఆయా ప్రాజెక్ట్లకు తరలిస్తామని పేర్కొన్నారు.
అసైన్డ్ భూముల చట్ట సవరణ బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం తెలిపింది. అసైన్డ్ భూములను సౌర విద్యుత్ సంస్థలకు లీజుకు ఇచ్చేలా చట్ట సవరణ చేశామని ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.
తిరుమల లడ్డూ అంశంపై ఏపీ శాసనమండలిలో చర్చ గందరగోళానికి దారి తీసింది. దీంతో ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు సభను రేపటికి వాయిదా వేశారు.
ఏపీ శాసనమండలిలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై వైసీపీ ఎమ్మెల్సీలు చేసిన వ్యాఖ్యలపై మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
గ్రామ, వార్డు సచివాలయాల చట్ట సవరణ బిల్లుకు ఏపీ శాసనసభలో ఆమోదముద్ర పడింది. గ్రామ, వార్డు సచివాలయాలను స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డులుగా మారుస్తూ చట్ట సవరణ బిల్లును మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ పథకం నిలిపివేయడంపై వైసీపీ ఎమ్మెల్సీ ఆగ్రహం వ్యక్తం చేయగా.. రాయలసీమ అంశంపై మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఏపీ శాసనమండలిలో వైసీపీ సభ్యులు, మంత్రుల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. రాయలసీమ లిఫ్ట్ విషయంలో తప్పంతా వైసీపీదే అని మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు.