Home » AP Assembly Sessions
వైసీపీ ఎమ్మెల్యేలకు దొంగచాటు సంతకాలపైనే శ్రద్ధ ఉందంటూ ప్రభుత్వ విప్ ఎద్దేవా చేశారు. తమ ప్రాంత సమస్యల పరిష్కారం కోసం సభకు రావాలనే చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు చివరిరోజుకు చేరుకున్నాయి. దాదాపు వారం రోజులుగా.. వాడివేడీగా అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి.
సూపర్ 6 సూపర్ హిట్పై అసెంబ్లీలో నేడు లఘు చర్చ జరుగనుంది. ఈ అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభలో సమాధానం ఇవ్వనున్నారు. అలాగే ప్రశ్నోత్తరాల్లో రాష్ట్రంలోని సమస్యలపై సభ్యులు అడిగే ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇవ్వనున్నారు.
కూటమి ప్రభుత్వ 15 నెలల పాలనలో ఉద్యోగాల కల్పనపై ఆంధ్రప్రదేశ్ శాసన సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు మాట్లాడారు. 15 నెలల్లో అన్ని రంగాల్లో, అన్ని సెక్టార్లలో కలిపి మొత్తం 4,71,574 మందికి ఉద్యోగాలు కల్పించామని స్పష్టం చేశారు.
ఏపీకి ప్రస్తుతం డ్రై పోర్టుల ప్రాజెక్టులు కూడా పెద్దఎత్తున వస్తున్నాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. లాజిస్టిక్స్ ఎకో సిస్టంలో మౌలిక సదుపాయాలే ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని ఉద్గాటించారు.
మండలి ఛైర్మన్ను తరచూ అగౌరవ పరుస్తున్నారని.. అసెంబ్లీ ప్రాంగణంలో క్యాంటీన్ భవనం ప్రారంభోత్సవంలో మండలి ఛైర్మన్ పేరు పెట్టలేదని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.
నాలా యాక్ట్ రద్దు బిల్లుపై శుక్రవారం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో చర్చించారు. నాలా యాక్ట్ రద్దు అవసరాన్ని రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ వివరించారు. ఏపీలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకే నాలా యాక్ట్ రద్దు చేయాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ సూచించారు.
ప్రజలకు పన్నుల రూపంలో వసూలు చేసేటప్పుడు గతంలో 4 టాక్స్ స్లాబ్లు ఉండేవని.. దీని వల్ల కన్ఫ్యూజన్ ఉండేదని మంత్రి పయ్యావుల తెలిపారు. దీంతో దేశ వ్యప్తంగా జీఎస్టీపై పెనుమార్పులు తీసుకురావాలని సూచించినట్లు చెప్పారు.
సూపర్ సిక్స్.. సూపర్ హిట్ కాదు.. సూపర్ డూపర్ హిట్ అయిందన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. రెండు జెడ్పీటీసీ ఎన్నికలు జరిగితే ప్రజలు వైసీపీకి డిపాజిట్లు రాకుండా చేశారు.
ఎస్కేయూలో అక్రమాలపై ఫిర్యాదులు వచ్చాయని.. దీనిపై విచారణ కమిటీ వేశామని... నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని లోకేష్ చెప్పారు. ఎస్కేయూలో నిన్న ఓ విద్యార్థి ఫిట్స్ వచ్చి చనిపోయారని.. కానీ దాన్ని రాజకీయం చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.