Home » AP Assembly Sessions
ఏపీ శాసనమండలిలో మరోసారి వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించడంతో పోడియం వద్ద ప్లకార్డులతో ఆ పార్టీ ఎమ్మెల్సీలు నిరసన చేపట్టారు.
ఉపాధి హామీ పథకం కింద పల్లెపండుగ రూపంలో గ్రామీణ రోడ్ల నిర్మాణం చేపట్టామని ఏపీ శాసనసభలో మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పల్లెపండుగ 1 కింద 4 వేల కిలోమీటర్ల మేర వివిధ రోడ్లు వేశామన్నారు.
అచ్యుతాపురం సెజ్కు ఐదువేల ఎకరాలు సేకరించారని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ప్రస్తావించారు. అప్పటి భూమి ధర ప్రకారం కాకుండా ఇప్పటి ధర ప్రకారం రైతన్నలు పరిహారం అడుగుతున్నారని తెలిపారు.
ఏపీ శాసనసభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో డిస్నీ ల్యాండ్ ఏర్పాటుపై సభలో ఎమ్మెల్యే ప్రశ్నించగా.. మంత్రి కందుల దుర్గేశ్ సమాధానం ఇచ్చారు.
భారత్తో పాటు ఏపీ లాంటి రాష్ట్రాల్లోనూ ఫెర్టిలిటీ రేట్ తగ్గే పరిస్థితి నెలకొందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఇప్పటివరకూ ఫ్యామిలీ ప్లానింగ్కు ప్రాధాన్యం ఇచ్చామని.. ఇకపై పాపులేషన్ కేర్ వైపు దృష్టి సారించాల్సి ఉందన్నారు సీఎం.
ఉగాది నాటికి లక్ష టిడ్కో ఇళ్లు సిద్ధం చేస్తామని మంత్రి నారాయణ అసెంబ్లీలో ప్రకటించారు. గతంలో 5 లక్షల టిడ్కో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించగా.. వైసీపీ అధికారంలోకి వచ్చాక వాటిని 2.65 లక్షలకు కుదించి, రంగులు మార్చిందని మంత్రి తెలిపారు.
చైర్మన్ను ఉద్దేశించి మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలంటూ శాసనమండలిలో వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది.
మంత్రి నారాయణ రాష్ట్రవ్యాప్తంగా నిరంతరం పర్యటిస్తూ కష్టపడుతున్నారని ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. ఆరోగ్య దృష్ట్యా రాత్రి లేట్ రివ్యూలు తగ్గించాలని సూచించారు.
ఏపీ అసెంబ్లీలో ఆమోదం పొందిన రెండు బిల్లులకు శాసన మండలి ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక సేవల సవరణ బిల్లు-2026ని శాసన మండలి ఆమోదించింది.
రహదారుల పక్కన ఉన్న భారీ వృక్షాలును విస్తరణ సమయంలో తొలగిస్తున్నారని.. వందేళ్లకు పైగా వయసున్న చెట్లను తొలగించటం బాధాకరమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. వాటిని వేరే ప్రాంతానికి తరలించడానికి ప్రత్యేక పాలసీ తీసుకువస్తున్నామని పేర్కొన్నారు.