Home » Annamayya District
79వ స్వాంతంత్య్ర దినోత్సవం సందర్భంగా వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ప్రభుత్వ, ప్రైవేటు, విద్యాలయాలు, కార్యాలయాల వద్ద మువ్వన్నెల జెండాలు ఎగురవేశారు. మదనపల్లె సబ్కలెక్టరేట్ వద్ద సబ్కలెక్టర్ చల్లా కళ్యాణి జాతీయ జెండా ఎగురవేసి మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులర్పించారు.
వైఎస్ కుటుంబానికి కంచుకోటగా నిలిచిన పులివెందులలో టీడీపీ విజయఢంకా మోగిం చడం, పులివెందుల ప్రజల తీర్పు జగన్కు చెంపపెట్టు అని తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి దాసరిపల్లి జయచంద్రారెడ్డి అన్నారు.
గుర్రంకొండ మండలానికి చెందిన మహిళ ఏపీఎం రజనికుమారిపై దాడిని ఖండిస్తూ గురువారం వాల్మీకిపురం మండల వెలు గు (సెర్ఫ్) ఉద్యోగులు కార్యాలయ ఆవరణలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.
వర్షం కురిస్తే చాలు అటు హోమియోపతి వైద్యశాల, ఇటు ఆరోగ్య ఉపకేంద్రంలో సిబ్బంది గుండెలదిరి పోతుంటాయి. ఎప్పుడో 40 ఏళ్ల కిందట నిర్మించి న భవనాలు కావడంతో పెచ్చులూడి, భవనాలు మొత్తం ఉరుస్తున్నాయి. దీంతో ఆరుబయటే చెట్ల కింద రోగులకు వైద్య సేవలు అం దించాల్సిన దుస్థితి నెలకొం ది.
మండలంలో రీసర్వే త్వరగా చేపట్టాలని మద నప ల్లె సబ్కలెక్టర్ చల్లా కళ్యాణి సూచించారు
ఖరీఫ్లో సాగు చేసి పంటలన్నింటికీ విధి గా ఈ పంట నమోదు చేయాలని జిల్లా వ్యవసాయాధికారి శివనారాయణ సూచిం చారు.
తిరుత్తణి సమీపంలో సోమవారం వేకువజాము సంభవించిన రోడ్డు ప్రమాదంలో అన్నమయ్య జిల్లా పీలేరుకు చెందిన అన్నదమ్ములు మృతి చెందారు. వివరాలిలా. పీలేరుకు చెందిన మాజీ సర్పంచ్ హుమయూన్ (70) అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆయనను చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు.
ఆంధ్రప్రదేశ్లో నిన్న(ఆదివారం) అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ బోల్తా పడి తొమ్మిది మంది మృతిచెందారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలోని రెడ్డిపల్లె చెరువుకట్టపై చోటు చేసుకుంది. రాజంపేట నుంచి రైల్వేకోడూరు మార్కెట్కు మామిడికాయల లోడుతో వెళ్తున్న సమయంలో లారీ అదుపు తప్పి చెరవుకట్టపై బోల్తా పడింది.
రాష్ట్రంలోని ప్రకాశం, సత్యసాయి, అన్నమయ్య జిల్లాలను కూడా ఆకాంక్షిత జిల్లాల జాబితాలో చేర్చాలి. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తా’ అని 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్ లంకా దినకర్ తెలిపారు.
వైసీపీ నేతలకు హైకోర్టులో ఉపశమనం లభించింది. ఎన్నికల సందర్భంగా బాణాసంచా కాల్చడంతో గాయపడ్డానంటూ పసల లోకేశ్ అనే యువకుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తొందరపాటు చర్యలు తీసుకోవద్దని అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లె పోలీసులను కోర్టు ఆదేశించింది.