Home » Annamayya District
అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలం ఎగువ మల్లెలవారిపల్లికి చెందిన వెంకటేశ్కు(30) గుండె నొప్పి రావడంతో స్నేహితులు అతన్ని బైక్పై చౌడేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వెంకటేశ్ అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో ఏపీకి చెందిన మహిళ మస్కట్ నుంచి క్షేమంగా స్వగ్రామానికి చేరుకుంది. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలానికి చెందిన షెహనాజ్ కుటుంబ జీవనం కోసం ఏజెంట్ ద్వారా మస్కట్కు వెళ్లి చిత్ర హింసలకు గురైంది.
కొత్త ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. వైసీపీ ప్రభుత్వంలో చివరి సంవత్సరం కొత్తవి ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక వాటి గురించి పట్టించుకోలేదు. దరఖాస్తుదారులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
తన భార్య, ఇద్దరు పిల్లలను వదిలేసి మరో యువకుడితో వెళ్లిపోవడాన్ని ఆ భర్త తట్టుకోలేకపోయాడు. భార్యపై ప్రేమతో తిరిగి ఇంటికి రావాలని ఎంతగానో ప్రాదేయపడ్డాడు.
కిలాడీ దంపతుల మాయ మాటలు నమ్మి ఓ వివాహిత తీవ్రంగా నష్టపోయింది. ఆ దంపతులు సీబీఐలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ వివాహితనుంచి ఏకంగా 55 లక్షల రూపాయలు దోచేశారు.
టమోటా రైతుల కష్టం పశువులు, గొర్రెలకు మేతగా మారింది. కోటి ఆశలతో సాగు చేసిన టమోటా పంట అన్నదాతకు అప్పులే మిగిల్చింది.
రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జులు పనితీరు మార్చుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించినట్లు సమాచారం.
రైస్ పుల్లింగ్ కేసులో వైసీపీ తలుపుల మండల కన్వీనర్ కృష్ణారెడ్డి అలియాస్ డిక్కి బాబును పోలీసులు ఇవాళ(ఆదివారం) అరెస్టు చేశారు. డిక్కీ బాబు నుంచి ఐదు రాగి చెంబులు, రూ.1,10,000 నగదు, మూడు సెల్ ఫోన్లు, ఫార్చునర్ వాహనాన్ని కదిరి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు..
మదనపల్లిలో చిన్నారి హత్య కేసు నిందితుడు కులవర్ధన్ మృతిపై జిల్లా ఎస్పీ ధీరజ్ స్పష్టతనిచ్చారు. కురబలకోట మండలం కనసానిపల్లె చెరువులో ఈరోజు ఉదయం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని తెలిపారు.
మదనపల్లిలో దారుణ హత్యకు గురైన ఏడేళ్ల బాలిక అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. చిన్నారికి కుటుంబసభ్యులు, బంధువులు కన్నీటి వీడ్కోలు పలికారు.