Home » Andhrajyothy Breaking News
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సెక్యూరిటీ చీఫ్, ఎస్పీ సీహెచ్.భద్రయ్య ప్రెసిడెంట్ పోలీసు మెడల్ సాధించారు. స్వాతంత్య్ర వేడుకల్లో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా భద్రయ్యకు ప్రెసిడెంట్ పోలీసు మెడల్ ప్రధానం చేయనున్నారు.
సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం సత్వార్ గ్రామం సమీపంలో యూ టర్న్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. కూలీలను తీసుకెళ్తున్న ఆటోను ట్యాంకర్ ఢీకొంది.
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 19వ మహాసభలు, యువజన సదస్సు దిగ్విజయంగా ముగిశాయి.
అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి అడ్డంకులు తొలిగాయి. ఈ రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూమిని సేకరించేందుకు అధికారులు ఇచ్చిన నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ రెండు వేర్వేరు వ్యాజ్యాలు దాఖలయ్యాయి.
జీనోమ్ వ్యాలీలో ‘యామ్జెన్’ అత్యాధునిక పరిశోధన కేంద్రం ఏర్పాటు కానుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో యామ్జెన్ ఎంఓయూ కుదుర్చుకుంది. తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది.
ప్రజల భాగస్వామ్యంతో పార్ట్నర్స్ ఇన్నేషన్ బిల్డింగ్ సాధ్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖల పనితీరుపై మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
పీఎం సూర్యఘర్ పథకం కింద తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ ప్యానెల్స్ కుంభకోణం జరిగిందని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషికి మంగళవారం రఘునందన్ రావు ఢిల్లీలో ఫిర్యాదు చేశారు.
నిషేధిత భూములపై ప్రజలు ఆందోళన చెందొద్దని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. చట్టబద్ధంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని మాటిచ్చారు.
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మండల స్థాయిలో ప్రజావాణి నిర్వహించాలని నిర్ణయించింది.
లోకకల్యాణార్థం, సమృద్ధిగా వర్షాలు కురవాలని ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం దగ్గర త్రయాహ్నిక వరుణ యాగాలు, జపాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జరిపించనుంది.