Home » Andhrajyothy Breaking News
హైదరాబాద్లో బోనాల ఉత్సవాలు ఆగస్టు 9, 10 తేదీల్లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టినట్లు ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు.
నకిలీ, ట్యాంపరింగ్ నంబర్ ప్లేట్లపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. అలాగే ఈనంబర్ ప్లేట్లపై ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.
పార్లమెంట్లో ఎంఎస్ఎంఈ సవరణ బిల్లు 2026కు ఆమోదించడంపై ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్వాగతించారు. నూతన చట్టంతో ఎంఎస్ఎంఈ రంగానికి బలమైన రక్షణ, 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'కు పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు.
అత్యవసర చికిత్సలో భాగంగా పాముకాటు బాధితుల ప్రాణాలను కాపాడేందుకు యాంటీ స్నేక్ వీనం ఇంజక్షన్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలిసారిగా 108 అంబులెన్స్లో అందుబాటులోకి తీసుకువచ్చింది.
సాగునీటి ప్రాజెక్టులకు రూ.5 వేల కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. భూసేకరణ, R&R కోసం రూ.5 వేల కోట్లు మంజూరు చేశామని వెల్లడించారు. నిధుల కొరతతో సాగునీటి పనులు ఆగొద్దని చెప్పుకొచ్చారు.
ఉత్తర ఒడిశా, నైరుతీ బంగాళాఖాతాన్ని అనుకుని అల్పపీడనం ఒకటి ఏర్పడిందని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీనిపైన ఉపరితల ఆవర్తనం మరోకటి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని వెల్లడించారు.
అమ్మాయిలూ.. రెంటల్ బాయ్ఫ్రెండ్ ఆఫర్ల వలలో పడకండి.. జాగ్రత్త అని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సజ్జనార్ హెచ్చరించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రెంట్ బాయ్ఫ్రెండ్ ఆఫర్ల వెనుక సైబర్ మోసం ఉందని వ్యాఖ్యానించారు.
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో ట్విస్ట్ నెలకొంది. సూసైడ్ నోట్, ఆధారాలున్న ఐఫోన్ మాయమయ్యాయి ఈ కేసుపై హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సజ్జనార్ ప్రత్యేకంగా దృష్టి సారించారు.
హైదరాబాద్ జలమండలి సిటిజన్ సర్వీసెస్ మొబైల్ అప్లికేషన్లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ మొబైల్ అప్లికేషన్ ద్వారా ట్యాంకర్ బుకింగ్ చేసుకునే సేవలకు తాత్కాలిక అంతరాయం ఏర్పడిందని జలమండలి అధికారులు తెలిపారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీపై జగన్ అండ్ కో రాజకీయ డ్రామాలాడుతోందని ఎద్దేవా చేశారు.