Home » Andhrajyothy Breaking News
నాగార్జునసాగర్లో నిర్వహించే వరుణ యాగంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాల్గొననున్నారు. సాగర్ విజయ్ విహార్ టూరిజం గెస్ట్హౌస్ ప్రాంగణంలో యాగం నిర్వహించనున్నారు.
వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మరణం బాధించిందని పేర్కొన్నారు.
మహిళా ఎస్ఐపై దాడి కేసులో వైసీపీ నేత చింతాడ రవికుమార్కు ఆగస్టు 21వ తేదీ వరకు శ్రీకాకుళం కోర్టు రిమాండ్ విధించింది. 13 రోజుల పాటు మేజిస్ట్రేట్ రిమాండ్ విధించారు. అనంతరం రవికుమార్ను జిల్లా జైలుకు పోలీసులు తరలించారు.
తెలంగాణలో ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ రేపటితో ముగియనుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉన్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పారదర్శకంగా జరిగిన డీఎస్సీలో వైసీపీ నేతలు నానాయాగి చేస్తున్నారని ధ్వజమెత్తారు.
తాను చేసిన వ్యాఖ్యలను కొన్ని ఛానెళ్లు వక్రీకరించాయంటూ మెడికో ప్రియాంక తండ్రి వెంకటేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.
కుమురం భీమ్ ఆశయాల సాధనకు అందరూ ఐక్యంగా కృషి చేయాలని తెలంగాణ మంత్రి సీతక్క సూచించారు.
పట్టిసీమ నీటితో కృష్ణా డెల్టా కళకళలాడుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఎల్నినో వేళ పంటలకు పట్టిసీమ నీరే జీవాధారమని పేర్కొన్నారు.
వృద్ధులే టార్గెట్గా సైబర్ నేరగాళ్లు భారీ మోసాలకు పాల్పడుతున్నారని.. అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సజ్జనార్ సూచించారు.19 నెలల్లో సీనియర్ సిటిజన్ల నుంచి రూ.102.02 కోట్లను కేటుగాళ్లు కాజేశారని పేర్కొన్నారు.
పోలీసు శాఖలో మెరుగైన సంస్కరణలు తీసుకువస్తున్నామని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. తెలంగాణలో మావోయిజం, నక్సలిజం పూర్తిగా అంతమైందని వ్యాఖ్యానించారు.