Home » Andhrajyothi
కార్తవీర్యుని వధించిన అనంతరం పరశురాముడు తన గురువు అయిన పరమశివుణ్ణి దర్శించుకోవాలని కైలాసం వెళ్ళాడు. ఆ సమయానికి శివపార్వతులు ఏకాంతంలో ఉన్నారు. బయట కాపలా కాస్తున్న గణపతి పరశురాముడిని ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి వీలుపడదని నివారించాడు.
కోరిన కోర్కెలు తీర్చి సకల విఘ్నాలు తొలగించే వినాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి గ్రామంలో శ్రీసిద్ధి వినాయకుడిగా కొలువుదీరాడు. కృతయుగంలో దక్షప్రజాపతి యజ్ఞం తలపెట్టినప్పుడు ముందుగా అయినవిల్లి గణపతినే కొలిచాడని ప్రతీతి. ఈ స్వామిని స్వయంభువుగా చెబుతారు.
శ్రీ మన్మహారాజ రాజేశ్వరీదేవి యంకంబులో స్తన్య పానంబుతో తన్మయత్వంబునన్ అంతులేనట్టి వాత్సల్య దుగ్ధాంబుధిన్ దేలియాడంగనిన్ జేరి యర్చించు భక్తావళిన్ సర్వవిఘ్న ప్రకాండంబులన్ రూపుమాయించి నానా వరంబుల్ ప్రసాదించి ఈరేడు లోకాల శోకాలు మాన్పించి రక్షించుచున్నట్టి యో
ఇది నిజమేనా? అనే ప్రశ్న వస్తుంది ఈ ఫొటోలు చూస్తే... ముత్యాల్లా మెరిసే ఇసుక రేణువుల మధ్య, అందంగా పేర్చినట్టు నీటి మడుగులు. అందులో నీలం, ఆకుపచ్చ రంగుల కలబోత. ఒక అద్భుత కళాచిత్రంగా అనిపించే ఈ దృశ్యం ఈజిప్టులోని ‘సివా’ ఉప్పు నీటి సరస్సులున్న ప్రాంతం.
తెలుగులో కూడా పూరికలున్నాయి. కానీ, వ్యుత్పత్తి అర్థం వేరు. తెలుగులో పూరిక అంటే పొంగినదని! మూలద్రావిడ శబ్దం పూరి తెలుగులో బూర అయ్యింది. గాలి ఊదితే పొంగే బెలూనుని బూర అంటారు. బూరలా పొంగే వంటకాలు ప్రముఖంగా రెండున్నాయి.
పిచ్చి పలురకాలు... వెర్రి వేయి రకాలు..’ అని వూరికే అనలేదు మన పెద్దలు. ఆ వెర్రి ఇప్పుడు టూరిజాన్ని పట్టుకుంది. కరోనా తర్వాత రివేంజ్ తీర్చుకున్నట్లు పొలోమని ప్రపంచమంతా చుట్టేస్తున్నారు పర్యాటకులు. కొందరైతే వెళ్లిన దేశానికే మళ్లీ మళ్లీ వెళుతున్నారు.
సమయం, సందర్భం వచ్చినప్పుడు... పర్యావరణం గురించి మాట్లాడడం, మొక్కలు నాటడం... చాలాచోట్ల, చాలామంది చేసేదే. కానీ పర్యావరణహితం కోరుకునే ఒక గ్రామం మాత్రం ఇలాంటి సమయం, సందర్భాల కోసం వేచి చూడలేదు.
గ్రామీణ జీవనాన్ని, అక్కడి జీవన సౌందర్యాన్ని ‘ఊరు పల్లెటూరు’ అంటూ అందంగా అక్షరీకరించారు గేయ రచయిత కాసర్ల శ్యామ్. ‘బలగం’లోని ఈ పాటే ఆయనకు ‘ఉత్తమ గీత రచయిత’గా జాతీయ పురస్కారాన్ని అందించింది. ఈ సందర్భంగా ‘మీ ఫేవరెట్ 5’ ఏమిటని అడిగితే... ఆయన వాటి నేపథ్యాన్ని ఇలా పంచుకున్నారు.
ఆ రాశివారు ఈ వారం నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ప్రముఖ జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. అలాగే.. మీ కృషి ఫలిస్తుందని, అయితే.. ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోవడం మంచిదని తెలుపుతున్నారు. అంతేగాక ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచడం మంచిదని సూచిస్తున్నారు.
ఎంతో ఆనందంగా, అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న ఓ యువకుడు (వరుడు).. రెండురోజులకే మృతి చెందాడు. దాంతో రెండు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. బడంగ్పేట్ కార్పొరేషన్ 30వ డివిజన్లోని లక్ష్మీదుర్గ కాలనీకి చెందిన కాశ పుల్లప్ప కుమారుడు సాయిఅనిల్కుమార్(25) వివాహం కర్నూల్కు చెందిన యువతితో గురువారం అర్ధరాత్రి జిల్లెలగూడలో జరిగింది.