Home » Andhra Pradesh
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి..
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీకి మరో వెయ్యి ఈవీ బస్సులు వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలపై చర్చించారు.
ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. స్కూల్ బస్సుపై క్లీనర్ పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అర్ధవీడు మండలం పాపినేని పల్లిలో మంగళవారం ఉదయం ఈ ఘటన జరిగింది
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ ఫైర్ అయ్యారు. రూ. వెయ్యి పెంచేందుకు ఆయనకు ఐదేళ్లు పట్టింది.. అంటూ విమర్శించారు. రాష్ట్రాన్ని జగన్ సర్వనాశనం చేశారంటూ ఆయన దుయ్యబట్టారు.
ఏపీలోని కూటమి ప్రభుత్వం తాజాగా కీలకరంగాలకు నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ రీ సర్వే ప్రాజెక్టుకు అదనపు నిధులు మంజూరు చేసింది. బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు మౌలిక వసతుల కల్పనలో భాగంగా గురుకులాలకు రూ.39 కోట్ల అదనపు నిధులు విడుదల చేసింది.
వైసీపీ నాయకులు కూటమి నాయకులపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని జనసేన పార్టీ నేతలు పేర్కొన్నారు. ఈ మేరకు వారు విలేకరులతో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, అందుకే సార్వత్రిక ఎన్నికల్లో అడ్రస్ లేకుండా పోయారన్నారు.
ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులు, పరిశోధకులు, ఉద్యోగార్థులకు మరో అద్భుతమైన అవకాశం రాబోతోంది. దీనికి ఏపీ రాజధాని అమరావతి డెస్టినీ కాబోతోంది. ఇప్పటికే ప్రకటించిన స్టేట్ సెంట్రల్ లైబ్రరీ నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఇందుకోసం ప్రత్యేక ఎక్స్పర్ట్స్ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులిచ్చింది.
ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినాన్ని సోమవారం ధర్మవరం, కదిరి పట్టణాలతో పాటు మండల కేంద్రాల్లో నిర్వహించారు. వైద్యాధికారులు, సిబ్బంది, మున్సిపాలిటీ, మండల స్థాయి అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల్లో అవగాహన ర్యాలీలు నిర్వహించారు. మానవహారం ఏర్పాటుచేసి, ఎయిడ్స్పై అవగాహన కల్పించారు.
ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీతో ప్రతిపేద వాడి ముఖంలో ఆనందం కనిపిస్తోందని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాలశ్రీరామ్ అన్నారు. ఆయన సోమవారం పట్టణంలోని 27వ వార్డు వైఎస్సార్ కాలనీలో ఎన్టీఆర్భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీడీపీ నాయకులతో కలిసి లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన అందజేశారు.
రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పల్లె సిఽంధూరరెడ్డి అన్నారు. చినగానిపల్లిలో సోమ వారం నిర్వహించిన ‘రైతన్నా.. మీ కోసం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే ము ఖ్య అతిథిగా పాల్గొన్నారు. అలాగే మండలంలోని మహమ్మదాబాద్ ఎస్సీ కాలనీ, కసముద్రం, సోలుకుంట్ల, బలకవారిపల్లి, అమడగూరు, చినగానిపల్లి పంచాయతీలో ఎనటిఆర్ భరోసా సామాజిక పింఛన్లను లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పంపిణీ చేశారు.