Home » Andhra Pradesh
ఏపీ శాసనమండలిలో తిరుపతి లడ్డూలో కల్తీ జరుగలేదని వైసీపీ నాయకులు చెప్పింది అబద్ధమని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. కల్తీ నెయ్యి అంశంపై చర్చ జరపాలంటే ముందు వారు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
సాక్షి మీడియాకు లీగల్ నోటీసులు జారీ చేశారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా కథనాలు రాస్తున్నారంటూ నోటీసులు పంపారు.
ఏపీ శాసనమండలిలో వైసీపీ సభ్యులు చేస్తున్న హంగామాపై మంత్రి అచ్చెన్నాయుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘చీజ్కి నెయ్యికి తేడా తెలియని ప్రతిపక్షం ఉండటం మన దౌర్భాగ్యం’ అని మంత్రి వ్యాఖ్యానించారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. సమగ్ర శిక్షా అభియాన్ కింద పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులు, కస్తూరిబా బాలికా విద్యాలయాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి లోకేశ్ సమాధానాలు ఇచ్చారు.
పల్నాడు జిల్లా వినుకొండలో భూ ప్రకంపనలు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో వినుకొండతో పాటు నడిగడ్డ పరిసర ప్రాంతాల్లో కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆరో రోజుకు చేరుకున్నాయి. సభ మొదలైన వెంటనే స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాలను చేపట్టారు.
కోర్టులో బాంబు ఉందంటూ మధ్యాహ్నం 12గంటల ప్రాంతంలో మెసేజీ రావడంతో స్థానిక జేఎఫ్సీఎం కోర్టులో బుధవారం ఉదయం ఉన్నట్లుండి కలకలం చెలరేగింది. కోర్టులో నుంచి న్యాయమూర్తి, న్యాయవాదులు, కక్షిదారులు బైటకు వచ్చేశారు. పోలీసు శాఖ అప్రమత్తమై రైల్వే ఆర్పీఎఫ్ నుంచి జాగిలాన్ని రప్పించి కోర్టులో తనిఖీలను నిర్వహించారు.
మండలంలోని గోవిం దవాడ గ్రామంలో ఎణ్ణే రంగనాథేశ్వర స్వామి ఉత్సవాల సందర్భంగా టీడీపీ స్థానిక నాయకులు సోమనాథ్గౌడ్, కటెంబ్లీ సుంకన్న, ఎస్.జీ వన్నూరుస్వామి ఆధ్వర్యంలో బుధవారం రాతిదూలం లాగుడు పోటీల ను ఉత్సాహంగా నిర్వహించారు. సింగల్ విండో చైర్మన కొత్తపల్లి మల్లికా ర్జున, టీడీపీ నాయకులు తిమ్మరాజు పోటీలను ప్రారంభించారు.
పాఠశాల వేళలకు అనుకూ లంగా విద్యార్థుల కోసం తమ గ్రామానికి ఉదయం 8.30 గంటలకు, సాయంత్రం 4.30 గంటలకు ఆర్టీసీ బస్సును నడపాలని ఎమ్మెల్యే కాల వ శ్రీనివాసులు సూచించినా ఆర్టీసీ స్థానిక డిపో మేనేజర్ పట్టించు కోవడం లేదంటూ విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మండలపరిధిలోని నాగేపల్లి విద్యార్థినీలు బుధవారం ఆ గ్రామంలో రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు.
మండలంలోని పాల్తూరు పోలీస్ స్టేషనను సిబ్బంది కొరత వేధిస్తోంది. స్టేనలో ఎప్పు డూ హెడ్ కానిస్టేబుల్ ఓబుళేసు తప్ప ఎవరూ ఉండరు. ఏదైన సమ స్య వస్తే స్టేషన పరిధిలోని ఐదు గ్రామాలకు ఆయన పెద్ద దిక్కుగా ఉంటున్నారు. పాల్తూరు రాష్ట్ర సరిహద్దు గ్రామం. దీంతో ఇక్కడి పోలీస్ స్టేషనలో విధులు నిర్వహించేందుకు సిబ్బంది ఎవరూ ఆసక్తి చూపడం లేదు.