Home » Andhra Pradesh
స్థానిక స్వపరిపాలనలో వెనుకబడిన వర్గాలకు సాధికారత కల్పించడంపై శాసనసభలో లఘు చర్చ జరిగింది. మంత్రి సవిత ఈ చర్చను ప్రారంభించారు. బీసీలకు అవకాశం ఇవ్వడం, ప్రాతినిధ్యం కల్పించడం రాజకీయ సాధికారిత కల్పించడం తమ విధి అని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్న్యూస్. 2026-27 విద్యా సంవత్సరానికి 6,534 విద్యా వాలంటీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
దేవాలయాల్లో అర్చకులు, వేద పండితులు, పరిచారకులు, ఇతర ధార్మిక సిబ్బంది నియామకాల్లో జోనల్ విధానం అమల్లో లేదని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ప్రధాన దేవాలయాల్లో అర్చకులు, వేద పండితుల నియామకాల్లో రాయలసీమకు అన్యాయం జరుగుతోందన్న విషయం ప్రభుత్వం దృష్టికి రాలేదని తెలిపారు.
పిఠాపురం మండలంలో పంచాయతీ రాజ్ శాఖ ఏఈగా పనిచేస్తున్న నూకరాజు తన కుటుంబంతో సహా గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడు కాకినాడకు చెందిన ప్రో రైఫిల్ షూటింగ్ నిర్వాహకుడు షేక్ సాదిక్ ఖాన్పై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
కూటమితో కలసి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తున్నామని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ వ్యాఖ్యానించారు.స్థానిక సంస్థల ఎన్నికలు నేపథ్యంలో మంత్రి సత్యకుమార్ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసుకున్నామని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం రెండో రోజు కొనసాగనున్నాయి. ఉదయం 9 గంటలకు సభ ప్రారంభం కానుంది. తొలుత ప్రశ్నోత్తరాల కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సమావేశాలు మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా సోమవారం జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ నిర్ణయాల నివేదికను సభ ముందు సీఎం చంద్రబాబు ఉంచనున్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్కు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని దేవుడిని ప్రార్థించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగస్టు 19, 20 తేదీల్లో చెన్నైలో పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్ ఖరారైంది.
ఝార్ఖండ్ ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. వారాల తరబడి సాగిన విద్యార్థుల నిరసనలు ముగిశాయని ఊపిరి తీసుకునేలోపే ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమ బాట పట్టారు. 2014 నుంచి ఝార్ఖండ్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (జేఎస్ఎస్సీ) ద్వారా నియమితులైన ఉద్యోగులంతా రోడ్లెక్కారు.