Home » Ananthapuram
చామంతి రైతులు కన్నీరు పెట్టుకునే పరిస్థితి ఏర్పడింది. పూల ధర భారీగా తగ్గడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. 15రోజుల్లోనే టన్నుపై రూ.70వేలు తగ్గడంతో.. ఏం చేయాలో పాలుపొలేని స్థితిలో రైతులు ఉండిపోతున్నారు.
ఈ ఏడాది అరటి పంట సాగు చేస్తున్న రైతులు ఆనందంలో మునిగితేలుతున్నారు. వారికి సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్లైంది. అరటికి తగిన గిట్టుబాటు ధర లభిస్తుండడంతో వారి కుటుంబాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. టన్ను అరటికి రూ.21వేలు పలుకుతోంది
అనంతపురం జిల్లాలోని తూముకుంట చెక్పోస్టు వద్ద ఉన్న ఎస్బీఐలో గత ఏడాది జూలై 26న రాత్రి భారీ చోరీ జరిగిన విషయంపై పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. బ్యాంకులో ఉన్న 11.5 కిలోల బంగారం, ఆభరణాలు, రూ.40లక్షలు ఎత్తుకెళ్లారు.
సారీ.. తప్పు నాదే.. అంటూ కేఎస్ఎన్ డిగ్రీ కళాశాల పీడీ శ్రీనివాస్ విద్యార్థినులను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. విచారణలో ఏమీ మాట్లాడొద్దు’ అంటూ ఆయన విద్యార్థినులను కోరుతున్నారు. ఈ వ్యవహారాని సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.
వైసీపీ నేతలపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. సుబ్బరాయసాగర్ ప్రాజెక్టు గేట్లకు కనీసం గ్రీస్ పెట్టిన పాపానపోలేదని ఆయన తీవ్రంగా విమర్శించారు. అలాగే.. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిపై కూడా జేసీ ప్రభాకర్రెడ్డి ఫైర్ అయ్యారు.
ప్రభుత్వ పాఠశాలల్లో అందించే మధ్యాహ్న భోజనంలో గుడ్డు మాయమవుతోంది. ఎప్పుడిస్తారో తెలీదు అస్సలు ఇస్తారో.. లేదో, కూడా తెలీదు. విషయం ఉన్నతాధికారుల నుంచి హెచ్ఎంల వరకు అందరికీ తెలిసినా ఎవ్వరూ నోరుమెదపరు. బిల్లులు మాత్రం ఎంచక్కా ఇచ్చేస్తున్నారు.
అతివేగం.. నిండు ప్రాణాలను బలిగొంది. అనంతపురం జిల్లా మడకశిర దగ్గర జరిడిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. డ్రెవర్లు మహమ్మద్ రఫిక్, రఘురామ్ మృతిచెందడంతో దారి కుటుంబాల్లో విషాదచాయలు అలుముకున్నాయి. వివరాలిలా ఉన్నాయి.
చలిపులి పట్టు రైతులను వణికిస్తోంది. చలి వల్ల పట్టు రైతులు ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా చలికాలంలో పట్టుపురుగుల పెంపకం, సంరక్షణ రైతులకు కష్టంగా మారింది. వివరాలిలా ఉన్నాయి.
అనంతపురం జిల్లా చిలమత్తూరు ఏరియా రైతులు రాగి పంట సాగుపై మొగ్గు చూపుతున్నారు. మార్కెట్లో రాగులకు గిట్టుబాటు ధర ఆశాజనకంగా ఉండడంతో ఈ ఏరియా రైతులు రాగి పంట సాగుపై మొగ్గుచూపుతున్నారు. ఒక్క చిలమత్తూరు మండలంలోనే 250 హెక్టార్లకుపైగానే సాగవుతున్నట్లు అంచనా.
హిందూపూర్, ధర్మవరం, అనంతపూర్, గుంతకల్ వాసులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఎస్ఎంవీటీ బెంగళూరు-బీదర్ మధ్య నడుతున్న ప్రత్యేక రైలును పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఫిబ్రవరి నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది.