Home » Ananthapuram
జగన్ రాజకీయ కుట్ర బద్దలైందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అన్నారు. ఆయన మాట్లాడుతూ..స్కిల్ డెవల్పమెంట్ వ్యవహారంలో చంద్రబాబునాయుడుపై నాటి వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపుతో పెట్టిన అక్రమ కేసును కోర్టు కొట్టివేయడం చాలా ఆనందంగా ఉందన్నారు.
అనంతపురం ఎస్పీ కార్యాలయం ఎదుట టీడీపీ నేత, టీఎన్టీయూసీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మోహన్ తల్లిదండ్రులు ఆందోళన నిర్వహించారు. తమ కొడుకును పోలీసులు అదుపులోకి తీసుకుని 24 గంటలైందనీ, ఎక్కడ పెట్టారో చెప్పాలని వారు ఆందోళనకు దిగారు.
అనంతపురం నగరంలో మంగళవారం తెల్లవారుజామున ఒక ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. నగరంలోని అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో, ఒక ప్రముఖ వైన్ షాపులో జరిగిన ఈ ప్రమాదం స్థానికంగా పెను కలకలం రేపింది..
జిల్లాలో సంచలనం కలిగించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మాదినేని మహేశ్ హత్య కేసును పోలీసుల ఛేదించారు. వ్యాపారంలో విభేదాలతోనే.. హత్య జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇందుకు సంబంధించిన పోలీసులు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.
రాష్ట్రమంత్రి సవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. అపరభగీరథుడు సీఎం చంద్రబాబునాయుడు.. అతిపెద్ద దొంగ జగన్ అని ఆమె అన్నారు. ఈ వ్యాఖ్యలపై వైసీసీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఆమె ఏమన్నారంటే..
చిరుతపులులు, ఎలుగుబంట్ల సంచారంతో అనంతపురం జిల్లా మడకశిర ఏరియా వాసులు భయాందోళన చెందుతున్నారు. రెండు రోజుల క్రితం రొళ్ల మండలం హొట్టెబెట్ట గ్రామ సమీపంలోని కొండలో చిరుత సంచారాన్ని గ్రామస్థులు చూశారు. అలాగే ఎలుగుబంట్లు కూడా సంచరిస్తుండడంతో గ్రామాల్లో భయాందోళన వ్యక్తమవుతోంది.
విద్యాబుద్దులు నేర్పి విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదాద్దాల్సిన గురువులే పెడదోవ పడుతున్నారు. ఓ ఉపాధ్యాయుడు విద్యార్థిని ఇంటికే వెళ్లి అఘాయిత్యానికి పాల్పడబోయాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
బస్సు ఎక్కడానికి వెళుతూ కిందపడిపోయి ఓ యువకుడు మృతిచెందిన విషాద సంఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. గాండ్ల పురుషోత్తం అనే యువకుడు బస్సు ఎక్కడానికి వెళుతూ కిందపడిపోయాడు. అనంతరం కొద్దిసేపటికే ఊపిరాడక అతను మృతిచెందాడు.
మీకు చీము, నెత్తురు ఉంటే.. తాడిపత్రికి రండి.. అంటూ తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి కుమారులకు ఆయన సవాల్ విసిరారు. అలాగే.. వారు 15 నెలలుగా కనిపించడం లేదంటూ వ్యంగ్యంగా మాట్లాడారు.
చిరుత సంచారం స్థానికుల్లో భయాందోళన కల్పిస్తోంది. అదానీ సిమెంట్ పరిశ్రమ మైనింగ్ ప్రాంతంలో చిరుతపులి తిరుగుతున్నట్లు గుర్తించారు. అలాగే.. రోళ్ల మండలంలో కూడా చిరుత పులి సంచారం ఉన్నట్లు తెలుస్తోంది.