Home » Ananthapuram
తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గత కొద్దిరోజులుగా విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.
పింఛన ఇచ్చి ఆదుకోండి మహాప్రభో... అంటూ మండలంలోని ముత్తేపల్లికి చెందిన కిష్టప్ప అనే దివ్యాంగుడు సబ్కలెక్టర్ కార్తీక్కు విన్నవించారు.
తాడిపత్రి పట్టణ సీఐ ఆనందరావు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. రాజకీయ ఒత్తిళ్ల లేక కుటుంబ కుటుంబ సమస్యలే ఆత్మహత్యకు కారణమా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తాడిపత్రికి చేరుకుని ఆనందరావు కుటుంబ సభ్యులతో మాట్లాడారు.
మరోసారి బట్టబయలైన ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ అసలు స్వరూపం వెలుగు చూసింది. కథ స్క్రీన్ ప్లే...డైరెక్షన్ లాగా కౌన్సిలర్లు, వాలంటీర్ల స్క్రిప్ట్తో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గుడ్ మార్నింగ్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు.
అనంతపురం జిల్లా: తాడిపత్రి రూరల్ పరిధిలోని చుక్కలూరు రోడ్లో ఉన్న శ్రీనిధి నల్ల బండల ఫ్యాక్టరీలో నిద్రిస్తున్న భార్య, భర్తతో పాటు, మరో యువతిపై పెట్రోల్ పోసి దుండగుడు నిప్పంటించాడు.
అనంతపురం: ప్రింటింగ్ ప్రెస్ యజమాని తుమ్మల వంశీ ఆత్మహత్య వెనుక కీలక వైసీపీ నేత హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. కుట్ర కుతంత్రాలతో భూమిని అమ్మిన వారసులను వంశీపైకి వైసీపీ నేత ఉసిగొల్పారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ విష్ణు, రౌడీ షీటర్లతో కలిపి కథ వైసీపీ నేత నడిపారు.
శ్రీ సత్యసాయి జిల్లా: రైల్వే ప్యాంట్రీ సిబ్బందిపై సత్యసాయి జిల్లా ఏఆర్ పోలీసుల వీరంగం సృష్టించారు. పుట్టపర్తికి వచ్చేందుకు కర్ణాటక ఎక్స్ప్రెస్లో అనంతపురం వద్ద ప్యాంట్రీ బోగిలోకి ఏఆర్ పోలీసులు ఎక్కారు.
శ్రీ సత్యసాయి జిల్లాలో అంగనవాడీలు అసౌకర్యాల నడుమ కొలువయ్యాయి. అద్దె భవనాలు, పాఠశాల వరండాలు, ఇరుకు గదులే చిన్నారులకు దిక్కయ్యాయి.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే భూకబ్జాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యే శంకర్నారాయణ, ఆయన కుటుంబ సభ్యులకు బేడీలు వేసి, నడిరోడ్డుపై నడిపిస్తామని మాజీ ఎంపీ, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నిమ్మల కిష్టప్ప పేర్కొన్నారు.
‘జగన్ ప్రభుత్వంలో ఏమీ లేదప్పా ప్రతీది రేటే అంటూ’ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనపై మహిళా కూలీలు అసంతృప్తి వ్యక్తం చేశారు...