Home » Anantapur
పట్టణంలోని మార్కెట్ యార్డు సమీపంలో ఉన్న ఇస్కాన మందిరంలో శ నివారం నిత్యానంద త్ర యోదశి వేడుకలను భ క్తులు ఘనంగా నిర్వ హించారు. ఈ సందర్భం గా మందిరంలో ఉన్న జగన్నాఽథుడు, బలరాము డు, సుభద్ర ప్రతిమలను అందంగా అలంకరించారు. పంచా మృతాభిషేకాలు, పుష్పాభిషేకం, హరినామ సంకీర్తన, నైవేద్య సమర్పణ తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోరు అదు పులో ఉంచుకోవాలని టీడీపీ నాయకులు మండిపడ్డారు. ముఖ్య మంత్రి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకు ని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు కల్తీమద్యం తాపించి ఎంతో మంది అమాయకుల మరణాలకు కారణమైన వైసీపీ నేతలు, తమ అక్రమార్జన కోసం భగవంతుడి సన్నిధి లో సైతం పాపం చేశారని టీడీపీ పట్టణ అధ్యక్షుడు పరిశే సుధాకర్, నాయకులు రాళ్లపల్లి షరీఫ్ అన్నారు.
స్థానిక ప్రజాప్రతినిధులకు టీ, బిస్కెట్ ఇచ్చేందు కు సమా వేశాలు ని ర్వహిస్తున్నారా? అం టూ వెంకటాపురం ఎం పీటీసీ శ్రీనివాసులు అధికారుల తీరుపై ధ్వజమెత్తారు. గత సమావే శంలో తెలిపిన సమస్యల ఎంతవరకు పరిష్కరించారని నిలదీశారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో గురువారం ఎంపీపీ తుమ్మల పర్వీన షామీర్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది.
ప్రజలకు రెవెన్యూ సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ శ్యాంప్రసాద్ హెచ్చరించారు. ఆయన గురువారం స్థానిక తహ సీల్దార్ కార్యాలయన్ని తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. ప్రజల నుంచి వచ్చిన దరకాస్తులు, రెవెన్యూ రికార్డుల నిర్వహణ, భూ సమస్యల పరిష్కారంపై తహసీల్దార్ స్వర్ణలతను అడిగి తెలుసుకు న్నా రు.
కోట్లాది మంది ఆరాధ్యదైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూలో గత వైసీపీ పాలనలో కల్తీ జరి గిందని సిట్ నివేదిక ఇచ్చినా ఆ పార్టీ నాయకులు ఇంకా బుకాయి స్తున్నారని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలోని శివానగర్లో వెలసిన విజయచౌడేశ్వరి ఆలయ పుష్కర కుంభాభి షేకం, మహా సంప్రోక్షణ మహోత్సవంలో ఆ యన పాల్గొన్నారు.
మండలకేంద్రమైన త నకల్లుకు బ్రిటిషు పాల కుల కాలంలోనే పెద్ద పే రుంది. అప్పట్లో కదిరి తాలూకాలోనే పెద్ద ఫి ర్కాగా నమోదైంది. అ లాంటి తనకల్లు ప్రస్తు తం మండలకేంద్రం. పే రుకే మండలకేంద్రం, మే జర్ గ్రామ పంచాయతీ కానీ అభివృద్ధికి మాత్రం ఆమడదూరంలో ఉంది. తనకల్లులో జాతీయ రహ దారి విస్తరణలో భాగంగా డివైడర్లు నిర్మించి, వీధి లై ట్లు ఏర్పాటు చేశారు.
మండలంలోని తంగేడుకుంట గ్రామంలో జిల్లా పరిషత ఉన్నత పాఠశాల అభివృద్ధి కోసం, అదే గ్రామానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ హెబ్బార్ అమర్నాథ్ తమ వంతుగా రూ. 50వేలు విరాళం అందించారు.
నియోజకవర్గం అభివృద్ధికి తగిన ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని పుట్టపర్తి ని యోజకవర్గ ఇన్చార్జ్, మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి పలువురు మంత్రులను కోరా రు. ఆయన బుధవారం విజయవాడలోని అమ రావతి సచివాలయంలో మం త్రులను ఆయన కలసి విన్నవించారు.
మండలంలోని సు బ్బరావుపేట సమీపం లో ఉన్న భూమి తమ దని ఓ వర్గం కోర్టును ఆశ్ర యించగా, ఎన్నో ఏళ్లుగా పొజిషనలో ఉ న్నామని మరో వర్గం వారు మొరపెట్టుకున్నారు. గ్రామ సమీపం లోని సర్వేనం. 74-2లో 4.88ఎకరాల భూమి భూమిలో కొన్నేళ్లుగా అదేగ్రామానికి చెందిన వెంకటనారాయణరెడ్డి, వెంకటన రసమ్మ, పెద్దిరాజులు, తలారి గంగాధర్, క్రిష్ణారెడ్డి, భాస్కర్రెడ్డి, గంగులప్ప మరికొంత మంది కళ్లాలు వేసుకుని పొజిషనలో ఉన్నారు.