Home » Anantapur
పట్టణంలోని కొత్త పేటలో వెలసిన లక్ష్మీవెంకటేశ్వర స్వామి ఆలయంలో మూడు రోజు ల పాటు సాగిన వార్షిక బ్రహ్మోత్స వాలు సోమవారం ఘనంగా ము గిశాయి. చివరిరోజు స్వామివారి మూలవిరాట్కు ప్రత్యేక పూజలు చేశారు.
మండలకేంద్రంలో నిర్మించిన పంచాయతీ దుకాణ సముదాయంలోని గదులకు వేలంపాట నిర్వ హించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో వేలం ఎప్పుడు నిర్వహిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ముదిగుబ్బ పంచా యతీ కార్యాలయం వద్ద ఐదు దుకాణ గదులను నిర్మించారు.
సత్యసాయి గిరి ప్రదక్షిణను భక్తులు ఘనంగా నిర్వహించారు. ఆదివారం రాత్రి ప్రశాంతి నిల యం గణేష్ గేటు వద్ద సత్యసాయి రథాన్ని ప్రత్యేకంగా అలంకరిం చి పూజలు చేశారు. భక్తిపాటలు పాడుతూ రథాన్ని లాగారు.
మండల కేంద్రంలోని జనజీవన రైతు ఉత్పత్తి దారుల సంఘం కార్యాలయంలో ఆదివారం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రూ. 5లక్షలు విలువ చేసే వేరుశనగ పొట్టు పూర్తిగా కాలిపోయింది.
మండలంలోని ఏలుకుంట్ల గ్రామానికి చెందిన రైతు గుట్టూరు నారాయణస్వామి సాగుచేసిన అరటిచెట్లు అగ్నికి అహుతయ్యాయి. తనకున్న మూడు ఎకరాల్లో సుమారు 3000 అరటిచెట్లు సాగుచేశానని బాధిత రైతు ఆదివారం తెలిపాడు.
మండలంలోని పోతు కుంట చెరువు లీకేజీ అయి నీరంతా వృథాగా వెళుతోంది. ఇటీవల హాంద్రీనీవా నీటితో చెరువు నిండి మరువ పారింది. అయితే ప్రస్తుతం మరువ నిలిచిపోయింది. అయితే చెరువు మరువ పారే కట్ట దెబ్బ తినడంతో రాళ్ల సందుల్లో నుంచి నీరు లీకేజీ అవుతోంది.
కదిరి ని యోజకవర్గంలోనే తనక ల్లు మండలం పెద్దది. ఈ మండలానికి ఓ వైపు కర్ణాటక రాష్ట్రం, మరో వైపు అన్నమయ్య జిల్లా సరి హద్దులుగా ఉన్నా యి. మండల పరిధిలోని 17 పంచాయతీలు, 20 రెవెన్యూ గ్రామాలు, 186 కుగ్రామాలు ఉన్నాయి.
తెలుగుదేశం పార్టీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డితోనే నియోజకవ ర్గం అబివృద్ది సాధ్యమని అమడగూరు మండలం దిండిమీదపల్లి వైసీపీ కార్యకర్తలు పేర్కొన్నారు.
ప్రజల సమస్యలు తెలుసు కొని వాటిని పరిష్కరించేందుకు ప్రజాదర్భార్ కార్యక్రమం నిర్వహిస్తు న్నామని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ తెలిపారు. మండలం లోని కె.పూలకుంట పంచాయతీలో ఎమ్మెల్యే శనివారం ప్రజా దర్భార్ నిర్వహించారు. ముందుగా గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను అధి కారులతో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం ప్రజాద ర్బార్ నిర్వహించారు.
స్వర్ణాంధ్రప్రదేశ సాధనే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్రెడ్డి పేర్కొన్నారు. మండలపరిధిలోని పాము దుర్తి గ్రామంలో శనివారం స్వర్ణ గ్రామ పంచాయతీ భవనాన్ని వారు ప్రారంభించారు.