Home » Anantapur
కూటమి ప్రభుత్వంలో తమకు న్యాయం జరుగుతోందని వైద్య, ఆరోగ్యశాఖ ఉద్యోగులు హార్షాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన కళ్యాణ్, మంత్రులు లోకేష్, సత్యకుమార్ యాదవ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.
రాప్తాడు నియోజకవర్గంలో పీఏబీఆర్ కుడికాలువ పరిధిలోని అన్ని చెరువులకు నీరు ఇవ్వాలని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అధికారులను ఆదేశించారు. అనంతపురంలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆమె పీఏబీఆర్ ఎస్ఈ, ఏఈలు, ఇతర అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు.
హంద్రీనీవా సుజల స్రవంతి కాలువ ద్వారా నీటి ప్రవాహం ఇప్పటివరకు 490కిలోమీటర్ల దూరాన్ని అధిగమించినట్లు హెచ ఎనఎస్ఎస్ ఈఈ అమరనాథ్రెడ్డి, డీఈఈ రెడ్డెప్పరెడ్డి తెలిపారు. హంద్రీనీవా కాలువను వారు సోమవారం పరిశీలించారు.
మండలపరిధి లోని కదిరి - హిందూపురం ప్రధాన రహదారికి వెంటనే మరమ్మతు లు చేపట్టాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ప్రధాన రోడ్డుపై మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు.
మహిళలు వృత్తివిద్యలో నైపుణ్యాలు పెంచుకోవాలని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి పిలుపునిచ్చా రు. మునిసిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లిలో సోమవారం కెనరా బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణసంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన టైలరింగ్, బ్యూటిషియన 30 రోజుల ఉచిత శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు.
పట్టణంలోని కొత్త పేటలో వెలసిన లక్ష్మీవెంకటేశ్వర స్వామి ఆలయంలో మూడు రోజు ల పాటు సాగిన వార్షిక బ్రహ్మోత్స వాలు సోమవారం ఘనంగా ము గిశాయి. చివరిరోజు స్వామివారి మూలవిరాట్కు ప్రత్యేక పూజలు చేశారు.
మండలకేంద్రంలో నిర్మించిన పంచాయతీ దుకాణ సముదాయంలోని గదులకు వేలంపాట నిర్వ హించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో వేలం ఎప్పుడు నిర్వహిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ముదిగుబ్బ పంచా యతీ కార్యాలయం వద్ద ఐదు దుకాణ గదులను నిర్మించారు.
సత్యసాయి గిరి ప్రదక్షిణను భక్తులు ఘనంగా నిర్వహించారు. ఆదివారం రాత్రి ప్రశాంతి నిల యం గణేష్ గేటు వద్ద సత్యసాయి రథాన్ని ప్రత్యేకంగా అలంకరిం చి పూజలు చేశారు. భక్తిపాటలు పాడుతూ రథాన్ని లాగారు.
మండల కేంద్రంలోని జనజీవన రైతు ఉత్పత్తి దారుల సంఘం కార్యాలయంలో ఆదివారం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రూ. 5లక్షలు విలువ చేసే వేరుశనగ పొట్టు పూర్తిగా కాలిపోయింది.
మండలంలోని ఏలుకుంట్ల గ్రామానికి చెందిన రైతు గుట్టూరు నారాయణస్వామి సాగుచేసిన అరటిచెట్లు అగ్నికి అహుతయ్యాయి. తనకున్న మూడు ఎకరాల్లో సుమారు 3000 అరటిచెట్లు సాగుచేశానని బాధిత రైతు ఆదివారం తెలిపాడు.