Home » Anantapur
రైతుల సంక్షేమం కోసం ప్రభు త్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొ న్నారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో శనివారం సాయంత్రం అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన పథకం నిధులు విడుదల కా ర్యక్రమాన్ని నిర్వహించారు.
కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగుతోందని, మరో 15 ఏళ్ల పా టు కూటమి అధికారంలో ఉంటుందని ఎమ్మెల్యే అమిలినేని సురేం ద్రబాబు పేర్కొన్నారు. పట్టణంలోని ప్రజావేదిక వద్ద శనివారం అన్న దాత సుఖీభవ పథకాన్ని ఆర్డీవో వసంతబాబు, ఏడీఏ ఎల్లప్పతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు.
వ్యవసాయంలో రైతులను అన్ని విధాలా ఆదుకోవడంలో సీఎం చంద్ర బాబునాయుడు ముందుంటారని, రైతుల పక్షపాతి అని ప్రభుత్వ విప్ కాలవ శ్రీని వాసు లు పేర్కొన్నారు. అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని శనివారం మండ లంలోని కెంచానపలిలో వ్యవసాయ శాఖ ఏడీ పద్మజ ఆధ్వర్యం లో నిర్వహించారు.
పట్టణం లోని బుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయ సమీపంలో నూతనంగా నిర్మించిన ఆల యంలో వల్లీదేవసేన సమే త న్రాగ సుబ్రహ్మణ్యస్వామి విగ్రహ ప్రతిష్ఠను శని వారం ఘనంగా నిర్వహిం చారు.
నగరంలో పారిశుధ్య సిబ్బంది విధులలో కచ్చితంగా యాప్రాన ధరించాల్సిందేనని నగరపాలక సంస్థ కమిషనర్ జస్వంతరావు ఆదేశించారు. శనివారం స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయంలోని కౌన్సిల్హాల్లో పారిశుధ్యం మెరుగునకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ప్రకృతి వ్యవసాయంతోనే పజ్రల ఆరోగ్యానికి రక్ష అని ప్రధానమంత్రి మోదీ ఇచ్చిన పిలుపును అమలు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్ అన్నారు. పీఎం 12 సంవత్సరాల సుపరిపాలన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో భాగంగా శనివారం రెడ్డిపల్లి కృషి విజ్ఞానకేంద్రంలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు నిర్వహించారు.
డి. హీరేహాళ్ మండలంలోని ఎం హనుమాపురం నుంచి కణేకల్లు మండ లం జక్కలవడికి గ్రామానికి వెళ్లే రహదారి అధ్వానంగా మారింది. రోడ్డంతా కంకర తేలి ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ముఖ్యం గా ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛ అనంతపురం సాధ్యమవుతుందని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం స్థానిక కొవ్వూరునగర్లో నగరపాలక సంస్థ కమిషనర్, అధికారులు, టీడీపీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే చీపురు పట్టి..చెత్త ఊడ్చి రోడ్లను శుభ్రం చేశారు. పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ ఇంటింటా పరిశుభ్రతపై పోస్టర్లు అతికిస్తూ స్వచ్ఛ అనంత కోసం కట్టుబడి ఉంటామని ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు.
: సీఎం చంద్రబాబు రైతులకు అండగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో శనివారం అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన నిధులు విడుదల కార్యక్రమం నిర్వహించారు. నవ ధాన్యాలతో ఏర్పాటు చేసిన స్టాల్స్, ముగ్గులను పరిశీలించి, అన్నదాత సుఖీభవ మెగా చెక్కు అందచేశారు.
కంబదూరు మండల పరిధిలోని చెన్నంపల్లికి చెందిన గులగానప్ప అనే విద్యార్థి పదో తరగతి పరీక్షల్లో 568 మార్కులు సాధించాడు. ఆ విద్యార్థి ని అభినందిస్తూ కంబ దూరు ఎస్ఐ లోకేశ కు మార్ రూ. 5 వేలు ఆర్థికసాయం అందించారు.