Home » Anantapur
మండల పరిధిలోని జీనుల కుంట, సామచేను బైలులో నిర్వహించిన డ్రాఫ్ట్ పట్టాదార్ పాసు పుస్త కం సర్వే కార్యక్రమాన్ని ఆర్డీవో వీవీఎస్ శర్మ బుధవారం పరిశీలించారు. కొన్ని నెలలుగా జీనులకుంట, సామచేనుబైలు గ్రామాల్లో భూ రీ సర్వే ప్రక్రియను నిర్వహించారు.
పీఏబీఆర్ కుడికాలువ కింద ఉన్న చెరువులకు నీరందించేం దుకు ప్రభుత్వం ప్రణాళిక బద్ధంగా వ్యవహరిస్తోందని నీటి పారుదల శాఖ డీఈ ఈ చంద్రశేఖర్, ఏఈఈ ఓ బుళపతి అన్నారు. నీరు స జావుగా ప్రవహించేందుకు రైతులు సహకరించాలని కోరారు.
ప్రతి రైతు జీవిత భద్రతకు ఆ స్తి భరోసా అని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘు నాథరెడ్డి పేర్కొన్నారు. మండలపరిధిలోని వంకరకుంట, గోపేపల్లి పంచాయతీల్లో రైతులకు బుధవారం రాజముద్ర కలిగిన పట్టాదారు పాస్పుస్తకాలను అందజేశారు.
ఏళ్లు గడుస్తున్నా తమకా దారి కష్టాలు తీరడం లేదు. రహదారి గుంతలమయంగా మార డంతో తాము పడుతున్న కష్టాలు అంతా ఇంతా కాదంటూ మండలం లోని ఉగ్గిరెడ్డిపల్లి గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విజయవాడలో గురువారం జరిగే ‘మన నీరు- మన భవిష్యతు’్త కార్యక్రమానికి మండ లంలోని అన్ని గ్రామాల చెరువు సాగునీటి సంఘం అధ్యక్షులు తరలి వెళ్లి, విజయవంతం చేయాలని టీడీపీ క్లస్టర్ ఇనచార్జ్ మహేష్చౌదరి పిలుపునిచ్చారు. ఆయన మంగళవారం పట్టణంలోని గాంధీనగర్లో ఉన్న టీడీపీ కార్యాలయంలో సాగునీటి సంఘం అధ్యక్షులతో సమావే శమయ్యారు.
కేంద్ర ప్రభుత్వం రూపొం దించిన 2026-27 బడ్జెట్లో అంగనవాడీలు తదితర స్కీమ్ వర్కర్లకు వేతనాల పెంపు కోసం నిధులు కేటా యించకపోవడం అన్యాయమని ఉద్యోగుల జేఏసీ జిల్లా అధ్యక్షుడు ఓబిరెడ్డి అన్నారు. సీఐటీయూ ఆల్ఇండియా కమిటీ పిలుపు మేరకు మండలకేంద్రంలో మంగళవారం అంగనవాడీ కార్యకర్తలు నిరసన తెలిపారు.
పింఛన్ల తొలగింపు లో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి హస్తముందని వైసీపీ నాయకు లు జగన సొంత పత్రికలో అసత్య ఆరోపణలు చేయడం తగదని టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ మండల కన్వీనర్ శెట్టివారి జయచంద్ర, నాయకులు షేక్నిజాం వలీ, రాజారెడ్డి మంగళవారం మం డల కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావే శం ఏర్పా టు చేసి మాట్లాడారు.
భూ రీసర్వే నిర్వహించిన గ్రా మాల్లోని రైతులకు త్వరలో రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపు స్తకాలు ఇస్తామని ఆర్డీఓ మహేశ తెలిపారు. ప్రస్తుతం రీసర్వే చేసిన భూముల వివరాలను వివరిస్తామని, అందులో తప్పులుంటే సం బంధి త రైతులు తెలియజేయాలన్నారు.
ప్రభుత్వ పాఠశాలల అభివృధ్ది కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎ న్నో నిధులు ఖర్చు చేస్తోం ది. ప్రభుత్వ పాఠశాలలను అభివృధ్ది వైపు తీసుకెళ్లాల న్నది ప్రభుత్వాల లక్ష్యం. అయితే లక్ష్యాన్ని నెరవేర్చ డంలో అధికారులు, ప్రభు త్వ ఉద్యోగులు విఫలమవు తున్నారని ప్రజలు చర్చిం చుకుంటున్నారు.
మండలంలోని రాచానపల్లి గ్రామ సమీపంలో సోమవారం అక్కమ్మ గార్ల పరుష ఘనంగా సాగింది. గుడికట్టు వారు స్థానిక ఆలయంలోని అక్కమ్మ గార్లను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు.