Home » Anantapur
మండల వ్యాప్తంగా పలు పంచాయతీల్లో స్వచ్ఛ సంకల్పం సైకిళ్లు తుప్పు పడుతున్నాయి. అయినా అధికారులు, పాలకులు పట్టించు కోవడం లేదు. మండలంలోని 14 పంచాయతీలలో ప్రతి పంచాయతీకి స్వచ్ఛ భారత, స్వచ్ఛ సంకల్పం అనే ట్రై సైకిళ్ళను పంపిణీ చేశారు. అయితే పలు పంచాయతీల్లో వాటి ని వినియోగంచడం అంతంత మాత్రంగానే ఉండటంతో మూలన పడివేశారు.
నియోజకవర్గంలోని ఆర్హులైన ప్రతిఒక్క రైతు ఖాతాలో అన్నదాత సుఖీభవ నిధులు జమ అవుతున్నాయని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి తెలిపారు. మండల పరిధిలోని వెంగళమ్మచెరువులో శనివారం నిర్వహించిన ‘రైతన్నా మీ కోసం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పాల్గొన్నారు.
మండలం లోని చిగిచెర్ల గ్రామంలో అ య్యప్పస్వామి పడిపూజోత్స వాన్ని శనివారం ఘనంగా ని ర్వహించారు. అయ్యప్ప మా లధారులు అయ్యప్ప చిత్రప టాన్ని ప్రత్యేకంగా అలంకరిం చి పడిపూజ నిర్వహించారు.
షార్ట్ సర్క్యూట్తో ఇంట్లోని వస్తు సామగ్రి కాలి బూడిదైనట్లు మండలంలోని పోతుల నాగేపల్లిలో ఆశా కార్యకర్తగా పనిచేస్తున్న ఆదినారాయణమ్మ ఆవే దన వ్యకం్త చేశారు. గ్రామంలోని ఆశా కార్యకర్త ఇంట్లోని వంట గదిలో శనివారం మధ్యాహ్నం ఉన్నఫలంగా షార్ట్షర్య్కూట్తో మం టలు చెలరేగాయి.
మండలపరిధిలోని కటారుపల్లిలోని క్రాస్లో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం(కేజీబీవీ) వద్ద నెలకొన్న స్థల సమస్యను త్వరలో పరిష్కరిస్తామని ఎమ్మెల్యే కంది కుంట వెంకటప్రసాద్ గ్రామస్థులకు తెలిపారు. ఖబ్బం నరసింహస్వామి ద్వారం స్థలం వివాదాన్ని పరిష్కరించాలని కటారుపల్లి పంచాయతీ వా సులు గత ప్రజావేదికలో ఇచ్చిన అర్జీపై స్పందించిన ఎమ్మెల్యే శనివా రం అక్కడికి వెళ్లి పరిశీలించారు.
మండల పరిధిలోని పి.కొత్తపల్లి పంచాయతీ కేంద్రంలో ఉన్న గ్రామసచివాలయంలో కొద్ది నెలలుగా ప్రింటర్ మిషన పనిచేయడం లేదు. దీంతో వివిధ పనుల నిమిత్తం వేళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పి.కొత్తపల్లి, పి. కొత్తపల్లి తండా రెండు పంచాయతీలకు సంబంధించి ఇదే గ్రామ సచివాలయం.
ప్రేమ వ్యవహారానికి ఓ యువకుడు బలైన సంఘటన అనంతపురం జిల్లా మడకశిర మండలంలో జరిగింది. రాజు అనే యువకుడు ఓ అమ్మాయిని ప్రేమించాడు. అయితే.. ఆమె మోసం చేసిందంటూ.. అతను ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో వారి కుటుబంలో విషాదం నెలకొంది.
హిందూపురం వస్తే.. తన పుట్టింటికి వచ్చినట్లుగా ఉంటుందని రాష్ట్రమంత్రి నారా లోకేశ్ సతీమణి, హెరిటేజ్ సంస్థల ఈడీ నారా బ్రాహ్మణి అన్నారు. ఆమె హిందూపురం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలు, విద్యర్థులు బ్రాహ్మణికి ఘనస్వాగతం పలికారు.
సెల్ఫోన్.. మరో విద్యార్థిని ఊపిరితీసింది. ఫోన్ ఎక్కువగా చూడొద్దని కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్తాపానికి గురైన విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన అనంతపురం జిల్లా హిందూపురం సత్యనారాయణపేటలో జరిగింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కోటి సంతకాల సేకరణ కాదు.. రామకోటి రాస్తే మేలు.. అంటూ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుడిసె దేవానంద్ ఎద్దేదా చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపి భక్తుల మనో భావాలని దెబ్బతీశారని ఆయన ఆరోపించారు.