Home » Anantapur
భూములపై సంపూర్ణ హక్కుదారులుగా రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాసు పుస్తకాలతో కూటమి ప్రభుత్వం రైతులకు భరోసా కల్పించిందని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. మండలంలోని కదిరికుంట్లపల్లిలో శనివారం రెవెన్యూ శాఖ ఆఽధ్వర్యంలో చేపట్టిన పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
రైతుల భూముల రక్షణ కోసమే ప్రభుత్వం రీ సర్వే నిర్వహిస్తోందని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. మండల పరిధిలోని లింగారెడ్డి పల్లిలో శనివారం రెవెన్యూ అధికారులు ఏర్పాటుచేసిన కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పేర్కొన్నారు. మండలకేంద్రంలో చౌడేశ్వరీ రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో మండలకేంద్రంలో నిర్మించిన కలెక్షన సెంటర్, కోల్డు స్టోరేజీని ఆయన శనివారం ప్రారంభించారు.
మండలంలోని పోతు కుంట గ్రామ చెరువు మరువపారుతోంది. ఇటీవ ల విడుదల చేసిన హం ద్రీనీవా నీటితో రేగాటిపల్లి చెరువు మరువ పారి పోతుకుంట చెరువుకు నీరు చేరుతోంది. ప్రస్తుతం ఆ చెరువు మరువ పారుతోంది. అయితే పోతుకుంట చెరువు మరువ నుంచి నీరు వెళ్లే కాలువ పూడిపోయి, మరమ్మతులకు గురికావడంతో ఆ నీరంతా పొలాల్లోకి వెళుతోంది.
మండలంలోని ఉప్పర్లపల్లిలో శుక్రవారం టీడీపీ వర్గీయులపై వైసీపీ శ్రేణులు దాడి చేశారు. టీడీపీకి చెందిన ఇద్దరు గాయపడ్డారు. బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నా యి. శుక్రవారం ఉద యం స్వచ్ఛ భారత కార్యక్రమం కింద గ్రామంలో సర్పంచ కరుణాకర్నాయుడు, పంచాయతీ కార్యదర్శి భారతి వీధుల్లో పారిశుధ్య పనులు చేయిస్తున్నారు.
సత్యసాయి గిరి ప్రదక్షిణను శుక్రవారం రాత్రి భక్తులు ఘనంగా నిర్వహించారు. పౌర్ణమి సంద ర్భంగా రాత్రి 7.00 గంటలకు ప్రశాంతి నిలయం గణేష్ గేటు వద్ద సత్యసాయి రథానికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు చేశారు.
రోడ్డు భద్రతా నిబంధనలను తప్పకుండా పాటించా లని, అప్పుడే ప్రమాదాలు జరగవని ఆర్టీఓ రాణి ఆర్టీసీ డ్రైవర్లకు సూచించారు. జాతీయ రహ దారి భద్రతా మాసోత్సవాలలో భాగం గా శుక్రవారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్లోని డిపో గ్యా రేజీలో శుక్రవారం సమావేశాన్ని నిర్వహించారు.
తెలుగుదేశంపార్టీ అ భ్యున్నతికి కార్యకర్తలే నిజమైన హీరోలని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్యెల్యే క్యాం పు కార్యాలయంలో శుక్ర వారం జరిగిన ఓ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఉత్తమ కార్య కర్తలకు ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రశంసాపత్రాలను అందజేశారు.
మండలంలోని మర్తాడు గ్రామంలో రైతులకు పట్టా దారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. ముఖ్య అతిథులుగా జాయిం ట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ఆర్డీవో మ హేష్ హాజరై వాటిని రైతులకు అందజేశారు.
తాడిపత్రి పట్టణం అన్ని విధాలుగా బాగుండాలన్నదే తన అభిమతమని మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి అన్నారు. తాడిపత్రి మున్సిపాలిటీకి వస్తున్న ఆదాయం ఎంత ఖర్చు ఎంత అన్న విషయం ప్రజలకు తెలపాలని ఫ్లెక్సీని ఏర్పాటు చేశామన్నారు.