Home » Anantapur
ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసించారు. విద్యా శాఖ మంత్రిగా దేశానికే ఆదర్శంగా ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసం కృషి చేస్తూ, ఎన్నో సంస్కరణలు విజయవంతంగా అమలు చేస్తున్న లోకేశ్ను రాష్ట్రపతి అభినందించారు.
మండలంలోని వి. కొత్త కోటకు వెళ్లే దారి పూర్తిగా శిథిలమై గుంతలమయమై ఉండేది. వాహనా ల రాకపోకలకు చాలా ఇబ్బందిగా ఉండేది. కూటమి అధికారంలోకి వచ్చాక టీడీపీ నాయకులు రోడ్డు దుస్థితిని మంత్రి పయ్యావుల దృష్టికి తీసుకెళ్లారు.
రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్దే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని కళ్యాణదు ర్గం మార్కెట్ యార్డు చైర్మన లక్ష్మీదేవి రమేష్ పేర్కొ న్నారు. స్థానికం గా సోమవారం నిర్వహించిన ఉచిత కంది విత్తనాల పంపిణీ కార్య క్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
మండలంలోని శ్రీధరఘ ట్ట, ఉంతకల్లు తదితర గ్రామాల్లో ఏరువాక పౌర్ణమి వేడుకలను సోమ వారం వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచే రైతులు తమ ఎద్దు లను కడిగా, కొమ్ములకు రంగులు వేసి, మెడలో గంటలు, పూలమాల లతో అలంకరించి పూజలు చేశారు.
వజ్రకరూ రులోని జగనన్న కాలనీలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరిం చాలని కాలనీ వాసులు సోమవారం ఆందోళన నిర్వ హించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ఖాళీ బిందెలతో మహిళలు నిరసన తెలిపారు.
సమాజంలో అందరి సమిష్టి కృషితో పోలియో మహమ్మారిని నిర్మూలిద్దామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఈబీ దేవి వైద్యశాఖ అధికారులకు సూచిం చారు. జాతీయ పోలియో నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఆమె సోమవారం పట్టణంలోని శాంతినగర్ అర్బన హెల్త్ సెంటర్ను ఆక స్మి కంగా తనిఖీ చేశారు.
మండలంలోని గాండ్లపాడు గ్రామంలో రూ. లక్షలు వెచ్చించి నిర్మించిన చెత్తతో సంపద తయారీ కేంద్రం నిరుపయోగంగా మారింది. చెత్త సంపద తయారీ కేంద్రం ఉ న్నా చెత్తాచెదారాన్ని గ్రామస్థులు ఆరు బయట గ్రామ సమీపంలోనే వేస్తున్నారు.
మండల పరిధిలోని బోరంపల్లి వద్ద ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వి హించిన జాబ్ మేళాలో 39 మంది ఉ ద్యోగాలకు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సి పాల్ ఎం తిప్పేస్వామి తెలిపారు. ఆంధ్రప్రదేశ నైపుణ్యాభివృద్ధి సంస్థ , సీడప్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం కళాశాలలో జాబ్ మేళా నిర్వహించినట్లు తెలిపారు.
మండల పరిధిలోని మోపిడి గ్రామంలో తాగు నీటి కోసం మహిళలు శనివారం ఆందోళన చేపట్టారు. గ్రామంలోని పడమటి వీధి ప్రాంతం మ హిళలు స్థానిక ఉరవకొండ - కళ్యాణదుర్గం రహదారిపై ఖాళీ బిందెలతో బైఠాయించి నిరసన తెలిపారు.
పేదలను ఆదుకోవడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, ఆ మేరకు సీఎం చంద్రబాబు అడుగు జాడల్లో నడుస్తున్నామని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పేర్కొ న్నారు. అందుకే వైసీపీ సానుభూతిపరులకు కూడా సీఎం సహాయ నిధి ని మంజూరు చేయిస్తున్నామని అన్నారు. పట్టణంలోని ప్రజావేదిక వద్ద శనివారం నియోజక వరం్గలోని 15 మందికి మంజూరైన రూ. 8,15,000 సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.