• Home » Anantapur

Anantapur

MLA:  అభివృద్ధి బాటలో రాష్ట్రం

MLA: అభివృద్ధి బాటలో రాష్ట్రం

ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవనకల్యాణ్‌ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడుపుతున్నారని ఎమ్మెల్యే పల్లెసింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లెరఘునాథరెడ్డి పే ర్కొన్నారు. మండలంలోని కొడపగానిపల్లి, వేములేటిపల్లిలకు చెందిన 55 వైసీపీ కుటుం బాలు బుధవారం టీడీపీలో చేచాయి.

MLA: నివాసయోగ్యమైన స్థలాలను గుర్తించండి

MLA: నివాసయోగ్యమైన స్థలాలను గుర్తించండి

ఇళ్లులేని నిరుపేదల కోసం ఉపయోగకరమైన నివాస స్థలాలను వెంటనే గుర్తించాలని పుట్టప ర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి రెవె న్యూ అధికారులకు సూచించారు. మండల కేంద్రంలోని మామిళ్లకుంట్లపల్లి పంచాయతీలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములతో పాటు గతంలో ప్రభు త్వం పేదలకు కేటాయించిన ఎన్టీఆర్‌కాలనీ ప్రాంతాన్ని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డితో కలిసి ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి పరిశీలించారు.

WATER: తాగునీటి సౌకర్యం కల్పించాలి

WATER: తాగునీటి సౌకర్యం కల్పించాలి

తాగునీటి సౌకర్యం కల్పించాలంటూ మండలపరిధి లోని దోరణాల గ్రామస్థులు కోరారు. ఈమేరకు మంగళవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయానికి తాళాలు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మండల పరిధిలోని కటారుపల్లి పంచాయతీ దోరణాల గ్రామంలో తాగునీటి బోరు తరచూ మరమ్మతులకు గురు వుతోందని తెలిపారు.

BJP: స్వదేశీ వస్తువులనే వాడుదాం

BJP: స్వదేశీ వస్తువులనే వాడుదాం

ఆత్మనిర్భర్‌ భా రత కార్యక్రమంలో భాగంగా ప్రతిఒక్కరూ, ప్రతి ఇంటా స్వదేశీ వస్తువులనే వాడుదాం అంటూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు జీఎం శేఖర్‌ పిలుపునిచ్చారు. ఆయన ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని వార్డుల్లో, సూపర్‌మార్కెట్లలో స్వదేశీ వస్తువుల వాడకంపై ప్రజల్లో చైతన్యం తెచ్చే కార్యక్రమాన్ని నిర్వహించారు. మేక్‌ఇన ఇండియా ఉత్పత్తులనే వాడుదాం, దేశ ఆర్థికవ్యవస్థను బలపరుద్దామంటూ ఆయన పేర్కొన్నారు.

ROAD: మగ్గాల వీధిలో పైపులు పూడ్చి వదిలేసిన రోడ్డు

ROAD: మగ్గాల వీధిలో పైపులు పూడ్చి వదిలేసిన రోడ్డు

ఆధ్మాత్మిక కేంద్రమైన పుట్టపర్తి లో... చాలా ప్రాంతాల్లో ఎటు చూసినా గుంతల రోడ్లే ద ర్శన మిస్తున్నాయి. తర చూ రోడ్లను తవ్వడం.. పూ డ్చడం చేస్తుండడంతో సిమెంట్‌ రోడ్లు కాస్త మట్టి రోడ్లుగా, గుంతల రోడ్లుగా మారాయి. రక్షిత మంచి నీటి సరఫరా ఏర్పాట్ల పేరుతో ఉన్న సీసీ రోడ్లను తొలగించి పైప్‌లైన్లను వే శారు. పైపు లైన్లను పూడ్చి రెండేళ్లు పూర్తయినా ఇంతవరకు రోడ్లను మాత్రం బాగు చేయకపోవడంతో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు.

ROAD: దారంతా గుంతలే..!

ROAD: దారంతా గుంతలే..!

మండలంలోని ఆర్‌అండ్‌బీ రోడ్లు గుంతల మ యంగా మారాయి. వర్షాకాలం కా వడంతో ఎటుచూసినా గుంతల్లో నీరు నిలబడి వాహనాల రాకపో కలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. రాళ్లఅనంతపురం క్రాస్‌ నుంచి హుస్సేనపురం, కొడవం డ్లపల్లి వరకు రోడ్డు అధ్వానంగా మారింది. ఈ మార్గంలో అధికంగా ఇసుక టిప్పర్లు వెళ్లడంతో తారురోడ్డు ధ్వసమైంది. గతంలో రోడ్డుకు అక్కడక్కడ మరమ్మతులు చేపట్టినా మళ్లీ గుంతలు ఏర్పడ్డాయి.

OFFICIALS: కర్బూజ పంటను పరిశీలించిన అధికారులు

OFFICIALS: కర్బూజ పంటను పరిశీలించిన అధికారులు

మండలంలో రైతులు సాగుచేసిన కర్బూజ పంట పొలాలను ఉద్యానశాఖాధికారులు సోమవారం పరిశీలించారు. మండల వ్యాప్తంగా సాగుచేసిన పలువురు రైతులకు కర్బూజ కన్నీరు మిగిల్చింశీ ‘కన్నీళ్లు మిగిల్చిన కర్బూజ’ అనే శీర్షికతో ఆంధ్రజ్యోతిలో సోమవారం కథనం ప్రచురితమైన విషయం విదితమే. దీనిపై స్పందించిన ఉద్యానశాఖ అధికారి ప్రతాప్‌రెడ్డి మండలంలో కర్బూజ సాగు చేసిన పొలాలను పరిశీలించారు.

COLLECTOR: చియా సాగుపై అవగాహన కల్పించండి : కలెక్టర్‌

COLLECTOR: చియా సాగుపై అవగాహన కల్పించండి : కలెక్టర్‌

జిల్లాలో చియా సాగుపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్‌ ఎ. శ్యాంసుందర్‌ వ్యవశాయ శాఖ అధికారులను ఆదేశించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమం అనంతరం చియా సాగు విఽధానంపై ప్రచార కరపత్రాలను ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్‌, జిల్లా వ్యవసాయ అధికారి రాము నాయక్‌, ఆర్డీఓ వీవీఎస్‌ శర్మతో కలిసి కలెక్టర్‌ ఆవిష్కరించారు.

PGRS: పీజీఆర్‌ఎస్‌లో సమస్యల వెల్లువ

PGRS: పీజీఆర్‌ఎస్‌లో సమస్యల వెల్లువ

పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు సమస్యల వెల్లు వెత్తాయి. నియోజకవర్గంలోని ఆరు మండలాలతో పాటు అమడ గూరు మండల ప్రజలు తరవచ్చారు. మొత్తం 551 ిఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఎన్పీకుంట మం డలం వంకమద్దికి చెందిన రైతులు తాము తమ భూములను సోలార్‌కు ఇవ్వమని, తమకు జీవానాధారం అవేనని కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు.

TDP: వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిక

TDP: వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిక

మండల పరిధిలోని ఆకు ల వాండ్లపల్లిలో సోమవారం వైసీపీకి చెందిన 20 కుటుంబాలు తెలుగు దే శం పార్టీలోకి చేరాయి. పుట్టపర్తిలోని టీడీపీ కార్యాలయంలో వారికి ఎమ్మెల్యే సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి