Home » Anantapur
త్యాగరాజు స్వామి ఆరాధనోత్సవాన్ని బుధవారం పట్టణంలోని ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఘనంగా నిర్వహించారు. కదిరి పట్టణ నాయీ బ్రాహ్మణ సంఘం, మంగళ వాయిద్య కళాకారుల సంఘం ఆధ్వర్యంలో త్యాగరాజుస్వామి చిత్రపటానికి పూజలు నిర్వహించారు.
యువత, విద్యార్థులు మత్తుకు బానిసలై చిత్తు కావద్దని మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన, సీనియర్ సివిల్ కోర్టు న్యాయాధికారి ఎస్ జయలక్ష్మి పేర్కొన్నారు. మా దకద్రవ్యాల వ్యతిరేక దినం సందర్భంగా... పట్టణంలోని బీసీ బాలుర కళాశాల హాస్టల్లో బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన న్యాయవిజ్ఞాన సదస్సులో న్యాయాధికారి పాల్గొని మాట్లాడారు.
క్షేత్రస్థాయిలో ప్రజల కు అత్యంత బాధ్యతతో సేవలందించాలని ఎమ్యెల్యే పల్లె సింధూ ర రెడ్డి ఆశావర్కర్లకు సూచించారు. నూతనంగా నియమితులైన ఏడు గురు ఆశావర్కర్లకు బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వారు నియామక పత్రాలను అందజేశారు.
మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు సకాలం లో ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతు న్నారు. ఓబుళదేవరచెరువు, అమడగూరు మండలాలకు కలిపి అమ డగూరు మండలకేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేశారు.
మద్యం దుకాణాల్లో ఎక్సైజ్ ఏపీ సురక్ష యాప్ ద్వారా ప్రతిబాటిల్ను స్కాన చేసి విక్రయిం చాలని ప్రొహిబిషన, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నాగమద్ద య్య సూచించారు. ఆయన మంగళవారం ధర్మవరం ఎక్సైజ్శాఖ కార్యాల యాన్ని ఆకస్మికంగా తనిఖీచేశారు.
మండలంలోని పలు పంచా యతీల్లో ఉన్న చెత్త సంపద కేంద్రాల ఆదాయం ఎక్కడ? అని డీఎల్డీఓ అధికారులను ప్రశ్నించారు. గాండ్లపెంట మండలం లోని సచివాలయాల తనిఖీలో భాగంగా ఆయన మంగళవారం మండల కేంద్రంలోని సచివా లయాన్ని తనిఖీ చేశారు. సిబ్బంది పని తీరుపై ఆరా తీశారు.
కడప జోన పరిధిలోని ఆర్టీసీ డిపోల్లో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎనఎంయూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం స్థానిక ఆర్టీసీ డిపో ఎదుట ఎర్రబ్యాడ్జీలు ధరించి ధర్నా చేపట్టారు.
మన భూమిపై మన హక్కు కల్పించే ఉద్దేశ్యంతో కూటమి ప్రభుత్వం గ్రామాల్లో రీసర్వే చేయించి ప్రభుత్వ రాజముద్ర కలిగిన పట్టాదారు పుస్తకాలు పంపిణీ చేస్తోందని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి పేర్కొన్నారు. మండలంలోని కుసుమవారిపల్లిలో ఎమ్మెల్యే చేతుల మీదుగా 68 మంది రైతులకు రాజ ముద్ర కలిగిన పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు.
వైద్యానికి ఒక వైపు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నా... మండలంలోని చాలా ఆరోగ్య కేం ద్రాల్లో సరైన సౌకర్యాలు లేక రోగులు అవస్థలు పడుతున్నారు. ఓబు ళదేవరచెరువు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనం పైకప్పు పెచ్చు లూడి పడుతుండటంతో అధికారుల ఆదేశాల మేరకు తప్పని పరిస్థితు ల్లో ల్యాబ్ నిర్వహిస్తున్న గదిలోకి మార్చారు.
పట్టణ పరిసర ప్రాంతాల్లోని రెవెన్యూ, మున్సిపల్ రిజర్వుడ్ స్థలాలు ఆక్రమణకు గురయ్యాయని, వాటిని వెంటనే స్వాధీనం చేసుకోవాలని టీడీపీ నాయకులు ఆర్డీవో మహేశకు విన్నవించారు. ఈ మేరకు వారు సోమవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీవోను కలిసి ఆధారాలతో వినతిపత్రం అందజేశారు.