Home » Anantapur
పరిసరాల పరిశుభ్రతే ఆరోగ్యానికి భద్రత అని ప్రభుత్వ డిగ్రీకళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్రెడ్డి తెలిపారు. ధర్మవరంలోని కేహెచ ప్రభుత్వ డిగ్రీకళాశాల ఎనఎస్ఎస్ వలంటీర్లు మండలంలోని గొట్లూరులో నిర్వహిస్తున్న ప్రత్యేక శిబి రాన్ని ఆయన శనివారం సందర్శించారు.
మండలంలోని గొట్లూరు, చిగిచెర్ల గ్రామాల్లో ని ఆంజనేయస్వామి ఆలయాల్లో శనివారం కార్తీకమాస పూజలు ఘనంగా నిర్వహించారు. మూలవిరాట్లను ఆకుపూజతో అలంకరించి పూజలు చేశారు.
ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం తలుపుల మండ లంలోని పెద్దన్నవారిపల్లికి వచ్చారు. హెలిప్యాడ్ వద్ద నాయకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. రెవెన్యూ శాఖమంత్రి, జిల్లా ఇనచార్జ్ మంత్రి అవగా న సత్యప్రసాద్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, ఎంపీ బీకే పార్థసారథి ఎమ్మెల్యేలు కందికుంట వెంక టప్రసాద్, పరిటాల సునీత, పల్లె సింధూరరెడ్డితదితరులు పుష్పగుచ్ఛాలతో ఘనంగా స్వాగతం పలికారు.
మండలకేంద్రంలో వెలసిన హజరత ఓడీసీ బాబా పదో ఆరాఽధనోత్సవాన్ని బాబా దర్గా సన్నిధిలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గా నిర్వాహకులు బైపరెడ్డి ఆధ్వర్యంలో దర్గా ఆవరణను వివిధరకాల పుష్పాలు, విద్యుతదీపాలతో అలంకరిం చారు. రాత్రి బాగేపల్లి స్వామివారి ఆధ్వర్యంలో గంధోత్సవం నిర్వహించారు. పెనుకొండ ఫకీర్ల జలసాలతో బాబాకు గంధం సమర్పించారు.
మున్సిపల్ ఛైర్మన్గా ఉండి కూడా తలారి రాజ్కుమార్ ప్రజాసమస్యలను నిర్లక్ష్యం చేశారని, దాని ఫలితంగానే పదవి పోయిందని, ఇందులో రాజకీయాలు ఏమీ లేవని.. టీడీపీ పట్టణ అధ్యక్షుడు సర్మస్వలీ స్పష్టం చేశారు.
సోషల్ మీడియా వేదికపై వలపు వలలో పడి యువకులు, పెళ్లైనవారు విలవిలలాడుతున్నారు. స్నేహం, జోడీ పేరిట కనిపించే వెబ్సైట్ లింకులను క్లిక్ చేసి.. బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసుకుంటున్నారు. ఫేస్బుక్, ఇన్స్టా, వాట్సాప్.. ఇలా ఏదో ఒక మార్గంలో అమ్మాయిల గొంతుతో కేటుగాళ్లు వాయిస్ కాల్స్ చేసి బురిడీ కొట్టిస్తున్నారు.
స్థానిక ఎస్టీఎస్ఎన డిగ్రీ కళాశాలలో శుక్రవారం మూడో రోజు ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో అండర్ -14, 17 బాల బాలికల క్రీడల పోటీలు కొనసాగా యి. ఇందులో హైజంప్, లాంగ్ జంప్, 100, 200, 400, 800, 1500 మీటర్ల పరుగుపందెంతో పాటు డిస్క్ త్రో, షాట్పుట్, జావ్లింగ్ త్రో సంబంధిత క్రీడల పోటీలు నిర్వహించారు.
ఎవరో వస్తా రనీ... ఏదో చేస్తారనీ ఎదురు చూడకుండా మండలం లోని నడిమికుంటపల్లి, రత్నగిరి, సుబ్బరాయనిపల్లి ప్రజలు ఒక్కటయ్యారు. మూడు గ్రామా లలో గ్రామపెద్దల సమక్షంలో సమావేశమై ప్రతి ఇంటి నుంచి ఒక మనిషి, కొంత విరా ళం వచ్చేలా తీర్మానించారు. మూడు గ్రా మాలలో కలిపి రూ. లక్ష సేకరించారు. ఇంటికి ఒకరు చొప్పున కలిసి, ఎక్స్కవేటర్, ట్రాక్టర్లు అద్దెకు తీసుకున్నారు.
సత్యసాయి శత జయంతి ఉత్సవాలకు జిల్లా కేంద్రంలో ఆయా శాఖల అధి కారులు, సిబ్బంది ఏర్పాట్లు ముమ్మరంగా చేపట్టారు. అందులో భాగంగా ప్రధాన వీధుల్లో విద్యుత శాఖ అధికా రులు కొత్తగా విద్యుత స్తంభాలు ఏర్పాటు చేస్తున్నా రు. గురువారం, శుక్రవారం స్థానిక గోపురం రోడ్డులో విద్యుత సిబ్బంది ఎత్తైన విద్యుత స్తంభాలను ఏర్పాట చేస్తున్నారు. పాత స్తంభాలను తొలగించి కొత్తగా ఎత్తైన స్తంభాలు మా ర్చే కార్యక్రమం చేపట్టడంతో జిల్లా కేంద్రంలో పగటిపూట విద్యుత సరఫరాను పూర్తిగా నిలిపివేస్తున్నారు.
పట్టణంలోని సాలేవీధిలో వెలసిన పెద్దమ్మ దేవత ఆలయంలో కార్తీక మాసం శుక్రవారం సందర్భంగా సహస్ర దీపోత్సవాన్ని బుగ్గవంశస్థులు నిర్వహించారు. ఈ సందర్భంగా మూల విరాట్ను పట్టువస్ర్తాలు, వివిధ రకాల పూలతో అలంకరించి పూజలు చేశారు.