Home » Anantapur
ఇళ్లు నీటమునిగితేనే ప్రజాప్రతినిధులు, అధికార ులు స్పందిస్తారా అని కురుగుంట వైఎస్సార్ కాలనీ వాసులు మండిపడ్డారు. కాలనీకి ఆనుకుని ఓ ప్రైవేటు కంపెనీ వెంచర్ వేశారు. కాలనీ పైభాగం నుంచి వచ్చే వర్షపునీరు వంకలోకి వెళ్లేందుకు వీలులేకుండా నిర్మాణం చేపట్టడంతో కాలనీవాసులు శుక్రవారం వెంచర్ ముఖద్వారం వద్ద నిరసనకు దిగారు.
ప్రజాదర్బార్లోనే సమస్యల పరిష్కారం సాధ్యమవుతుందని ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ అన్నారు. శుక్రవారం అనంతపురం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు.
వైసీపీ పాలనలో మాదిరిగా పార్టీలు చూడమని, అర్హత ఉంటే ఎలాంటి సంక్షేమ పథకమైనా అందుతుందని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక అర్బన టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ప్రజాదర్బార్ నిర్వహించారు.
పార్టీ ఏ పిలుపునిచ్చినా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ముందుంటారని ఎమ్మెల్యే పరిటాలసునీత అన్నారు. వర్చ్యువల్గా జరిగిన మహానాడు కార్యక్రమం విజయవంతం కావడంపై ఆమె శుక్రవారం మండలంలోని వెంకటాపురం క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
స్థానిక కేటీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ ఫిజిక్స్ మొదటి సంవ త్సరం చదువుతున్న ఎన సీసీ క్యాడెట్ ఎస్ సమీర్ జమ్మూ కశ్మీర్ లోజవహర్ ఇనస్టిట్యూట్ ఆఫ్ మౌం టెనీరింగ్, వింటర్ స్పోర్ట్స్ వారు నిర్వహించిన మౌం టెన ట్రిక్కింగ్ క్యాంప్లో పాల్గొని ప్రతిభ కనబరిచి నట్లు ప్రిన్సిపాల్ శ్రీనివా సులు గురువారం పేర్కొ న్నారు.
బక్రీద్ పండుగను ముస్లిం లు గురువారం ఘనంగా నిర్వ హిం చారు. గుంతకల్లు, గుత్తి, ఉరవ కొండ, రాయదుర్గం, కళ్యాణదు ర్గం, తాడిపత్రి పట్టణాలతో మండలకేంద్రాలు, పలు గ్రామా ల్లో ఈద్గా మైదా నాలు మసీ దుల్లో ప్రత్యేక ప్రా ర్థనలు చే శారు.
బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేసిన టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రా మారావు ఆశయ సాధన కోసం పని చేద్దామని టీడిపి జోనల్ కో- ఆర్డినే టర్ రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి, టీడీపీ జిల్లా అద్యక్షుడు పూల నాగరాజు, ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంఅన్నారు.
పేదల సంక్షేమానికి ఎన్టీ ఆర్ అహర్నిశలు కృషి చేసి, వారిగుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కొనియా డారు. పట్టణంలోని సిరి కన్వెన్షన హాల్లో గురువారం మహానాడు రెండో రోజు ఎన్టీఆర్ జయం తి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన వ్యక్తి ఎన్టీఆర్ అని ఎంపీ అంబికా లక్షీనారాయణ పేర్కొన్నారు. పట్టణంలోని దేవాంగ కల్యాణ మండపంలో నిర్వహించిన ఐదో క్లస్టర్ మహానాడులో ఎంపీ గురువారం పాల్గొన్నారు.
విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వ పాఠశాలలే సరైన వేదికలని బొమ్మన హాళ్ ఎంఈవో మల్లికార్జున అన్నారు. ప్రత్యేక కమిటీల ఆధ్వర్యంలో బుధవారం మండలంలోని వివిధ గ్రామాల్లో గడపగడపకు వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.