Home » Anantapur
గ్రామీణప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి అధికారులకు సూచించారు. పుట్టపర్తి మండల పరిషతకార్యాలయంలో గురువారం ఎంపీపీ రమణారె డ్డి అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. రైతులు పండించిన పంటలకు సరైన మార్కెట్ సౌకర్యంలేక నష్టపోతున్నారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు.
పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో అరకొర సౌకర్యాలతో సరైన వైద్య సేవలు అందక రోగులు ఇబ్బంది పడుతున్నారు. వంద పడకల సామర్థ్యం కలిగిన ఈ ఆస్పత్రిలోని ప్రధాన విభాగాల్లో వైద్య పరికరాలు లేవు. దీంతో మెరుగైన వైద్యం కోసం వేరే ఆస్పత్రులకు రెఫర్ చేయాల్సి వస్తోందని వైద్యులు చెబుతున్నారు. పలువిభాగాల్లో వైద్యుల కొరత కూడా వేధిస్తోంది.
అనంతపురం జిల్లాలోని చింతకుంటలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. పుట్లూరు పాఠశాల విద్యార్థులను ఎక్కించుకుని వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
మండల కేంద్రంలోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో ఆది వారం 1992-93లో దోతరగతి చదివిన విద్యార్థులు, అప్పటి ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్ర మాన్ని నిర్వహించారు. ఒకరినొకరు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అప్పటి మధురస్మృతులను గుర్తుచేసుకుని సా యంత్రం వరకు ఉ ల్లాసంగా గడిపా రు.
మండల కేంద్రంలోని పాతవూరిలో వెలసిన గ్రామదేవత పెద్దమ్మకు కార్తీక మాసం ఆదివారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారు జామున పూజారులు పెద్దన్న, శివసాయి అమ్మవారిని వివిధ రకాల పుష్పాలు, వేప మండలతో ప్రత్యేకంగా అలంకరించారు.
మండలంలోని చిన్నరామన్నగారిపల్లి పంచాయతీ కేంద్రం నుంచి ఆ పంచా యతీలోని తురకవానిపల్లికి దాదాపు 30 యేళ్ల క్రితం నిర్మించిన రోడ్డు చాలా అధ్వానంగా మారింది. కంకర తేలిన రోడ్డు ప్రయాణించేందుకు ఆ గ్రామస్థు లు చాలా అగచాట్లు పడాల్సి వస్తోంది. చిన్నరామన్నపల్లి నుంచి తురకవానిపల్లి వరకు 30 ఏళ్ల క్రితం మూడు కిలో మీటర్ల తారు రోడ్డు నిర్మాణం చేపట్టారు.
మున్సిపాలిటీతో పాటు ని యోజకవర్గంలోని పలు గ్రామాలు, కాలనీల్లో సమస్యలను పరిష్కరిం చేలా ప్రణాళికలను సిద్ధం చేయాలని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ అధికారులకు సూచించారు. 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదల నేపథ్యంలో పరిటాలశ్రీరామ్ ఆదివారం ధర్మవరంలోని తన క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్తోను, తాడిమర్రి, బ త్తలపల్లి, ముదిగుబ్బ, ధర్మవరం ఎంపీడీఓల తో వేర్వేరుగా సమావే శాలను నిర్వహించారు.
సత్య సాయి జయంతి వేడుకల సందర్భంగా చిత్రావతి సుందరీకరణ ఏర్పాట్లు చేశారు. అందులో భాగం గా స్నాన ఘట్టం ఏర్పాటు చేశారు. అయితే కొన్ని రక్షణ చర్యలు చేప ట్టకపోవడంతో భక్తులు ఏ మాత్రం అప్రమత్తంగా లేకపోయినా ప్రమాదా లు జరిగే అవకాశాలు లేకపోలేదని పలువురు అంటున్నారు. జిల్లా కేం ద్రం సమీపంలో చిత్రావతి నది నీటితో నిండుగా ఉంటూ పర్యాటకులను ఆకర్షిస్తోంది.
ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్రెడ్డి శనివారం మండలలంలో పింఛన్ల పంపిణీలో పాల్గొ న్నారు. మం డలంలోని రెడ్డి పల్లి, బండవాం డ్లపల్లి, చారు పల్లి, కొత్తపల్లి తండా, వేళ్లమద్ది, బండకింద తండాలో వారు పాల్గొని పింఛన్లు అందజేశారు.
నియోజకవర్గంలోని ఏడు పోలీసు స్టేషనలకు ఎమ్మెల్యే కందికుంట వెం కటప్రసాద్ కొత్త వాహనాలను సమకూర్చారు. వాటి తాళంచెవులను శనివారం ముఖ్యమంత్రి చేతుల మీ దుగా ఎస్పీ సతీ్షకు మార్కు అందజేశారు. ని యోజకవర్గంలో ఉన్న పో లీసు వాహనాలు చాలా అధ్వాన స్థితిలో ఉన్నాయి,