Home » Anantapur
దేశ రాజకీయాలలో ఒక సంచలనంగా మొదలైన ప్రస్థానం ఎవరిదైనా ఉందంటే.. ఆల్ టైమ్ రికార్డ్గా నిలిచిన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుదేనని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. ఎన్టీ రామారావు వర్ధంతిని ఆదివారం పట్టణంలో టీడీపీ శ్రేణుల ఆధ్వర్యంలో నిర్వహించారు.
టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 30 వ వర్ధంతిని టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తల ఆధ్వ ర్యంలో ఆదివారం నిర్వహించారు. స్థానికంగా ఉన్న ఆయన విగ్రహాల కు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
మండలంలో ప్రసిద్ధి చెం దిన పాలపాటిదిన్నె ఆం జనేయస్వామి ఆలయం శనివారం భక్తులతో కిట కిటలాడింది. ఈ సంద ర్భంగా అర్చకులు స్వామి వారిని ప్రత్యేకంగా అలం కరించి పూజలు చేశారు.
ఆదర్శ పాలకుడిగా శ్రీకృష్ణదేవరాయలు చరిత్రలో నిలిచారని రాయల్ పీపుల్స్ ఫ్రంట్ నాయకులు కొనియాడారు. శనివారం శ్రీకృష్ణదేవరాయలు జయంతిని పురస్కరించుకుని పట్టణంలోని కోనేరు వద్ద శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు.
ఎంపీటీసీలకు చెల్లించాల్సిన గౌరవ వేతనం మూడున్నరేళ్లుగా చెల్లించలేదని, తమ పదవీకాలం పూ ర్తి అయ్యేలోగా చెల్లిస్తారా? అని కోటపల్లి ఎంపీటీసీ సభ్యురాలు వెంకట సుబ్బమ్మ అధికారులను ప్రశ్నించారు. మండలకేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం ఎంపీపీ వైవీ కౌసల్య అధ్యక్షతన అధికారులు మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు.
యోగా వేమన జయంతి ఉత్సవాల సందర్భంగా మండలపరిధిలోని కటారుపల్లి ఆలయ ప్రాంగ ణంలో పలు అభివృధ్ది పనులను ముమ్మరంగా చేపట్టారు. కటారుప ల్లిలో ప్రజాకవి విశ్వవేమన జయంతిని అధికారికంగా జరపాలని నిర్ణయించడంతో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
ఎగుడు దిగుడు, గుంతల రోడ్లతో ప్రయాణం భా రమవుతోంది. పాలకులు మారినా తమ బాధలు తప్పలేదని వెంకటాపురం పంచాయతీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. మండలపరిధిలో కదిరి - హిందూపురం ప్రధాన రహదారి... వెంక టాపురం పంచాయ తీ లోని నారప్పగారిపల్లి నుంచి వెంకటాపురం మీదుగా కరకమాను తోపు వరకు పూర్తిగా దెబ్బ తింది.
మండలంలోని గొ ట్లూరు, పోతుకుంట, రేగాటిపల్లి చెరువులు హాంద్రీనీవా నీటితో నిం డి మరువ పోతున్నాయి. నెల రోజుల క్రితం నుంచి చెరువులకు నీరు చేరుతోంది. ప్రస్తుతం పూర్తిస్థాయిలో నిండి మరువ పారు తున్నాయి. దీంతో ఆయా గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సత్యసాయి విద్యార్థులు చేప ట్టిన గానకచేరి భక్తులను అలరింపజేసింది. సంక్రాంతి సంబరాల సందర్భంగా బెంగళూరు బృందావన, చిక్ బళ్లాపూర్ నందగిరి విద్యా ర్థులు బుధవారం రాత్రి ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత సభామండపంలో ప్రేమామృతం పేరిట గాన కచేరి ని ర్వహించా రు.
మండల కేంద్రంలోని కదిరి - రాయచోటి ప్రధాన రహదారిలో ద్విచక్రవాహనాలు, ఆటోలను ఎక్కడప డితే అక్కడ నిలుపుతున్నారు. దీంతో ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతు న్నాయని ఆ రోడ్డుపై వెళ్లే వాహనదారులు తెలుపుతున్నారు. కదిరి - రాయచోటి ప్రధాన రహదారి నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉంటుంది.