Home » Anantapur
క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ప్రధానోపాధ్యాయుడు ఖాదర్బాషా పేర్కొన్నారు. ఇటీవల ఖో-ఖో పుట్బాల్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను బుధవారం స్థానిక జిల్లా పరిషత సెంట్రల్ ఉన్నత పాఠశాలలో అభినందించారు.
స్థానిక కొనకొండ్ల రోడ్డు లోని శ్రీవివేకానంద ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో బుధవారం ఆ పాఠ శాల వ్యవస్థాపకులు ఆర్ మంజునాథ్ ఆధ్వర్యంలో సైన్స ఫెయిర్ను ని ర్వహించారు. ముఖ్య అతిథులుగా ప్రముఖ గణిత ఉపాధ్యా యుడు అ స్లాంబాషా, వాణి విద్యానికేతన కరస్పాండెంట్ మల్లికార్జున రెడ్డి, నీటిపారుదలశాఖ ఏఈఈ పవనకుమార్ హాజరయ్యారు.
జనసేన క్రియాశీలక సభ్యత్వంతో భద్రమైన భవిష్యత్తు అని ఉద్యమి సభ్యత్వ కార్యక్రమం అనంతపురం పార్లమెంట్ సమన్వయకర్త, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన చైర్మన పసుపులేటి హరిప్రసాద్ పేర్కొన్నారు. స్ధానిక మున్సి పల్ కార్యాలయం వద్ద బుధవారం జనసేన ఉద్యమి క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయ కర్త వాసిగిరి మణికంఠ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మో త్సవాల్లో భాగంగా బుధ వారం స్వామివారు అశ్వ వాహనంపై భక్తులకు ద ర్శనమిచ్చారు. ఉదయం ఆలయంలో స్వామివారి మూలవిరాట్కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత స్వామి ఉత్సవ మూర్తు లను అశ్వవాహనంపై అ లంకరించి పురవీధుల్లో ఊరేగించారు.
శాంతిభద్రత పరిరక్షణ కోసం రేయింబవళ్లు కష్టపడుతున్న పోలీసుల నివాసం కోసం మండల కేంద్రంలో నిర్మించిన క్వార్టర్లు శిథిలావస్థకు చేరాయి. దీంతో విధులు నిర్వహించి వచ్చిన సిబ్బందికి విశ్రాంతి తీసుకోవడానికి సౌకర్యం లేదు. నివాస గృహాల్లోనే కాదు స్టేషన భవనంలోకి పాములు వస్తున్నాయని స్థానిక స్టేషనలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది భయాందోళన చెందు తున్నారు.
మండలంలోని చేర్లోప ల్లి శివారులో చండ్రాయుని కుంట వద్ద వెలసిన లక్ష్మీచెన్నకేశవ స్వామి రఽథోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయంలో స్వామి వారికి వేకువజామున పంచా మృ తాభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు.
ఆనారోగ్యంతో అనంతపురంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరిని మంగళవారం మాజీ ఎమ్మెల్యే ఆర్ జితేంద్రగౌడ్ పరామర్శించారు. విషయం తెలుసుకున్న జితేంద్రగౌడ్ హాస్పిటల్కు వెళ్లి ఉన్నం ఆరోగ్య పరిస్థితి పై ఆయన కుమారుడు మారుతీ చౌదరిని ఆడిగి తెలుసుకున్నారు.
భక్తులు కోరిన కోర్కెలు తీర్చే మండలకేంద్రంలోని గ్రామదేవత కుందుర్పమ్మ ఆలయంలో ఆదివారం పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పెద్దఎ త్తున భక్తులు నాలుగో గిరి ప్రదక్షిణ చేపట్టారు.
చంద్రగ్రహణం సంద ర్భంగా జిల్లాలోని ఆల యాలను మంగళవారం మూసివేశారు. కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వా మి దేవాలయంతో పాటు బొమ్మనహాళ్, డీ. హీరేహాళ్ మండలాల్లోని నేమకల్లు, మురిడి గ్రామాల్లో వెలసిన ప్రముఖ ఆంజనేయస్వామి ఆలయాలను ఉదయమే మూసి వేశారు.
గ్రామీణ ప్రాం తాలలో గతంలో ఏర్పాటు చేసిన విద్యుతస్తంభాలు పెచ్చులూడి, కడ్డీలు తేలి, ప్రమాదకరంగా మారాయి. అయినా విద్యుత అధికారులు వాటి వైపు కన్నెత్తి చూడడం లేదని మండలపరిధిలోని జుంజురంపల్లికి చెంది న పలు కాలనీవాసులు వాపోతున్నారు.