Home » Anantapur
చౌకడిపోలకు బియ్యం తరలించే లారీ గురువారం మండలకేంద్రంలోని నాగలకట్ట సమీపంలో రోడ్డుపై ఆగిపోయింది. అది కదిరి- రాయచోటి ప్రధాన రోడ్డు కావడంతో... ఆ రోడ్డు వాహనాల రాకపోకలు పూర్తిగా రెండు గంటలపాటు నిలిచిపోయాయి. రోడ్డుకిరువైపుల భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.
దాదాపు యాభై ఏళ్ల క్రితం వారపుసంత నిర్వహించేందుకు మండలకేంద్రానికి కూతవేటు దూరం లో సంతగేటు కాలనీ ఏర్పాటైంది. ఎంతోమంది నిరుపేదలు అక్క డ ఇళ్లు నిర్మించుకుని నివాసాలుండేవారు. కొందరు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లగా, ప్రస్తుతం 20కి పైగా కుటుంబాలు ఉన్నాయి. 150 మం దికిపైగా జనం నివసిస్తున్నారు.
మండలకేంద్రంలో మురు గునీటి సమస్య తిష్టవేసింది. వీధుల్లోనే మురుగునీటితో కలిసి వృఽథానీరు పారుతోంది. మండల కేంద్రంలో అక్కదేవతల గుడి నుంచి సర్పంచ భారతి ఇంటి వెనుక భాగం మీదుగా పుట్టపర్తి ప్రధాన రోడ్డు వరకు, బీసీకాలనీ, పాతబాలాజీ పాఠశాల వెనుక వరకు మురుగునీటి కాలువ ఉంది.
మండలంలోని చింతలపల్లి, వసంతపురం గ్రామాలకు వెళ్లే రహదారులు ఆధ్వానంగా తయారుకావడంతో కూటమి ప్రభుత్వం నూతన బీటీ రోడ్లుకు రూ. 2.6కోట్లు నిధులు మంజూరు చేసింది.
స్థానిక ఎంపీడీఓ కార్యా లయం సమావేశ భవనంలో బుధవారం మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని ఎంపీపీ గిరక రమాదేవి అధ్యక్షతన ‘మన పల్లె- మన నీరు’ అనే కార్యక్రమంపై నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులు తమ శాఖల ద్వారా జరిగే పథకాలు, అభివృద్ధి కార్యక్రమా లు వివరించారు.
రాష్ట్ర అభివృద్ధిపై స్పష్ట మైన విజన కలిగిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నా యుడని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి పేర్కొన్నారు. తిరుపతి కలెక్టరేట్లో మహిళా శిశుసంక్షేమం, వయోవృద్ధులు, దివ్యాంగుల సంక్షేమ కమిటీ సమావేశంలో ఆమె బుధవారం పాల్గొని మాట్లాడారు.
పట్టణంలోని మార్కండేయ స్వామి ఆలయం లో బుఽధవారం పద్మశాలీయ బ హూత్తమ సంఘం ఆధ్వర్యంలో స్వామి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆల యంలో మూల విరాట్కు, ఉత్స వ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు.
సచివాలయంలో పనిచేస్తున్న ఏఎనఎంలకు ఇతర డ్యూటీలు వేయరాదని ఎన్జీఓ సంఘం నాయకులు కలెక్టర్ శ్యాంప్రసాద్ను కోరారు. కలెక్టరేట్లో మంగళవారం వారు కలెక్టర్ను శాలువాతో సన్మానించి, తమ సమస్యలను వివరించారు. ము ఖ్యంగా ఏఎనఎంలకు ఇతర పనులు ఇవ్వడం వలన డ్యూటీకి ఇబ్బందిగా ఉందని వివరించారు.
ఆ ప్రయాణికుల అవ స్థలు వర్ణనాతీతం. బస్సుల కోసం ఎండైనా, వాన కురిసినా భరిస్తూ ఎ దురుచూడాల్సి వస్తోంది. ధర్మవరం నుంచి చిగిచెర్ల మీదుగా అనం తపురానికి వెళ్లే రహదారిలో ఒక్క బస్ షెల్టర్ కూడా లేదు. దీంతో ప్ర యాణికులు అవస్థలు పడుతున్నారు.
జాతీయ ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనులపై మంగళవారం స్థానిక ఎంపీడీఓ కా ర్యాలయంలో సామాజిక తనిఖీ ప్రజావేదికను నిర్వహించారు. మం డలపరిధిలోని 14 పంచాయతీలో జరిగిన ఉపాధి హామీ పనులను సామాజిక తనిఖీ బృందం గ్రామాల్లో పర్యటించి, తనిఖీ చేశారు. వాటి ఖర్చులు, వివరాలను ప్రజావేదికలో వెల్లడించింది.