Home » Anantapur
మండలంలోని నేమకల్లు గ్రామంలో వెలసిన ఆంజనేయస్వామికి శనివారం విశేష పూజలు చేశారు. ప్రధాన ఆర్చకులు అనిల్కుమార్ చార్యులు స్వామికి సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం, వెండి కవచ అలంకరణ, విశేషపుష్పా లం కరణ చేశారు. వందలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించు కున్నారు.
మండల పరిధిలోని కంబదూరు వద్ద శుక్రవారం ఆటో బోల్తా పడి నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. కంబదూరు ప్రాంతానికి చెందిన బొమ్మలాట సుబ్బారావు అనే వ్యక్తి మృతి చెందిన నేపథ్యంలో అనంతపురం నుంచి రాజు, ఉమాపతి, రాఘవేంద్ర, లక్ష్మీదేవి శుక్రవారం ఆటోలో వస్తున్నారు. కంబదూరు చెరువు కట్ట ప్రాంతానికి చేరుకునే స మయంలో ఆటో ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తాపడింది.
మండల కేంద్రంలోని రాధా స్వామి విద్యాలయం ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జాతీయ సైన్స దినోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యా యురాలు సుశీల అధ్యక్షతన ఏర్పాటు చేసిన సైన్స దినోత్సవానికి ముఖ్య అతిథులుగా ఎంఈవో తిప్పేస్వామి, ఎస్ఐ మహేష్ హాజరయ్యారు.
మున్సిపల్ మహిళా కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ అనుబంధం ము న్సిపల్ యూనియన నాయకులు పేర్కొన్నారు. స్ధానిక మున్సిపల్ కార్యా లయం వద్ద శుక్రవారం ఆ యూనియన ఆధ్వర్యంలో మహిళా కార్మి కులు రిలే దీక్షలు ప్రారంభించారు.
నియోజకవర్గ ప్రజల కల నెరవేర్చేందుకు త్వరలో కళ్యాణదుర్గంలో నిర్వహిం చే నగరవనం పార్కు ప్రా రంభోత్సావానికి రావాలని ఉప ముఖ్యమంత్రి పవన కళ్యాణ్ను ఎమ్మెల్యే అమిలి నేని సురేంద్రబాబు విజ యవాడలో శుక్రవారం ఆ హ్వానించారు. దీనికి ఆయ న సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
మండల పరిధిలోని అపిలేపల్లి మండల పరిషత ప్రాథమికోన్నత పాఠశాలలో గురువారం మండల స్థాయి సైన్స మేళా పోటీలలో గెలుపొందిన విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఉపాధ్యాయులు అభినందించారు.
మండల పరిధిలోని ఎనుములదొడ్డి గ్రామంలో మురు గునీరు రహదారిలోకి చేరి నిత్యం మురుగు గుంటగా మారు తోంది. స్థానిక ప్రధాన రహదారి నుంచి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం వరకు సీసీ రోడ్డు లేదు.
పట్టణంలోని కూరగా యల మార్కెట్లో చెత్త పేరుకుపోయి దుర్వాసనకు కేరాఫ్ అడ్రస్గా మారిపోయింది. కూరగాయల మార్కెట్లో పబ్లిక్ టాయిలెట్ల పక్కన ఖాళీ స్థలంలో మున్సిపల్ శానిటేషన సిబ్బంది డస్ట్ బినలు ఏ ర్పాటు చే శారు.
నేర విభాగంపై పోలీసు లు ప్రత్యేక దృష్టి సారించాలని ట్రైనీ ఎస్పీ, ఐపీఎస్ అధికారి అశ్విన మణిదీప్ పోలీసుల కు సూచించారు. ఆయన గురువారం పట్ట ణంలోని యూపీఎస్ పోలీస్స్టేషనను కళ్యాణ దుర్గం డీఎస్పీ రవిబాబుతో కలిసి తనిఖీ చేశారు. పోలీస్స్టేషనలోని రికార్డులను పరిశీ లించారు.
మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లే దారికి నేడు పల్లే పండుగలో మోక్షం లభించింది. ఆసుపత్రికి వెళ్లేందుకు 30 ఏళ్లుగా సరైన దారి లేక రోగులు, వైద్య సిబ్బంది చాలా అవస్థలు పడేవారు. పల్లె పండుగ 2.0లో బాగంగా మంత్రి పయ్యావుల కేశవ్, టీడీపీ సీనియర్ నాయకుడు పయ్యావుల శ్రీనివాసులు ఆదేశాలతో టీడీపీ నాయకులు ఆసుపత్రికి సీసీ రోడ్డును వేయిస్తున్నారు.