Home » Anantapur
రూరల్ పరిధిలోని సున్నపుగుట్ట తండాలో రాత్రికి రాత్రే అక్రమ లేఅవుట్లు వెలుస్తున్నాయి. జాతీయ రహదారికి సమీపంలో శనివారం ఉదయానికే అక్రమ లేఅవు ట్ సిద్ధ మైంది. ఎటువంటి అనుమతులు లేకుండానే రాళ్లు పాతి, ప్లాట్లు వేశా రు. అనధికారికంగా అగ్రిమెంట్లపై అమ్మకాలు కూడా జరిగినట్లు సమాచారం.
గ్రంథాలయాలు విజ్ఞాన బాండాగారాలు అని ధర్మవరం గ్రంఽథాలయ కమిటీ చైర్మన చింతపులుసు పెద్దన్న, ఎంఈఓ-1,2లు రాజేశ్వరి, గోపాల్నాయక్ పేర్కొన్నారు. 58వ గ్రంథాలయ వారోత్స వాలను స్థానిక గ్రంథాలయంలో శుక్రవారం గ్రంథాలయ అధికారి అంజలి సౌభాగ్యవతి ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాదించడంతో బీజేపీ నాయకులు శుక్రవారం సాయంత్రం పట్టణంలో సంబరాలు జరుపుకున్నారు. పట్టణ కార్యాలయం నుంచి కళాజ్యోతి సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించా రు. అక్కడ బాణాసంచా కాల్చి, స్వీట్లను తినిపించుకున్నారు.
విద్యార్థి విద్య పట్ల తప్ప ఇతర ఆ కర్షణలకు లోను కాకూడ దని జూనియర్ సివిల్ కో ర్టు న్యాయాధికారి లోకనా థం పేర్కొన్నారు. పట్టణం లోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఇనచార్జ్ ప్రిన్సిపాల్ విజయలక్ష్మి అధ్యక్షతన నిర్వహిం చిన బాలల దినోత్సవంలో న్యాయాధికారి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
మండలంలోని ఏకపాదంపల్లిలో శుక్రవారం సాయంత్రం నారసింహ నామం మార్మోగింది. కార్తీక దీపోత్సవం సందర్భంగా ఉదయం నుం చి గ్రామంలోని ఆలయంలో ప్రత్యేక పూజ లు, అన్నదానం నిర్వహించారు. సాయం త్రం 6గంటలకు ఆ కాశదీపం వెలిగించి కార్తీక దీపోత్సవాన్ని పురోహితుడు అశోక్ శర్మ ప్రారంభించారు.
ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పే ర్కొన్నారు. పట్టణంలోని నిజాంవలీ కాలనీలో ఉన్న వార్డు సచివా లయంలో శుక్రవారం 11, 13, 14, 15, 16, 17 వార్డుల ప్రజల సమస్య లను తెలుసుకునేందుకు ప్రజాదర్బార్ నిర్వహించారు. ఆ వార్డులకు సంబంధించిన ఫిర్యాదులను ఎమ్మెల్యే ప్రజల నుంచి స్వీకరించారు.
ఒకనాటి గొల్లపల్లి గ్రామమే నేటి పుట్టపర్తి పట్టణం. ఒకప్పుడు గొల్లపల్లిలో గోపాలకులు ఎక్కువగా ఉండటంతో గొల్లపల్లిగా పిలిచేవారు. ప్రచారంలో ఉన్న కథ ప్రకారం గోపాలకులు తమ పాడి ఆవులను మేతకోసం అడవికి తీసుకొని వెళ్లేవారు. ఒక ఆవు మాత్రం ప్రతి రోజు మంద నుంచి తప్పించుకుని అడవిలో మరో చోటుకు వెళ్లేది.
‘మా ప్రాణం మీరే.. మీరే మమ్మల్ని ముందుండి నడిపించారు. ఊపిరి ఉన్నంతవరకు మీ కోసమే పనిచేస్తామ’ని టీడీపీ కార్యకర్తలను ఉద్దేశించి ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. మండలంలోని కక్కలపల్లి క్రాస్లో గల ఆర్ కన్వెన్షన్ హాల్లో గురువారం టీడీపీ నియోజకవర్గ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం అట్టహాసంగా సాగింది.
పట్టణంలోని శాంతి నగర్ మున్సిప ల్ ఉన్నత పాఠశాల లో పదో తరగతి చ దువుతున్న శంకరపు గణేశ రాష్ట్రస్థాయి సైన్స సెమినార్లో ప్రతిభ కనబరచారని ఆ పాఠశాల హెచఎం ఉమాపతి, సైన్స ఉపాధ్యాయులు ఎస్బీ రేఖ, ప్రదీప్కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థి గణేశను గురువారం పాఠశాల లో వారు అభినందించారు.
ఇనసర్వీస్ ఉపా ధ్యాయులను టెట్ నుంచి మినహాయించాలని కోరుతూ ప్రదానమంత్రి నరేంద్రమోదీకి లేఖ పంపినట్లు డెమోట్రిక్ టీచర్స్ ఫెడరేషన (డీటీ ఎఫ్) జిల్లా అధ్యక్షుడు కట్టుబడి గౌస్ లాజం తెలిపారు. ఆయన గురు వారం విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికే ఉద్యోగంలో ఉన్న ఉపాధ్యా యులకు టెట్లో మినహాయింపు ఇచ్చే విధంగా చూడాలని ప్రధానమం త్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్రప్రదానకు లేఖ రాశామన్నారు.